‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించిన ఏ ప్రోమో చూసినా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ల కెమిస్ట్రీ ఎంత గొప్పగా పండిందో అర్థమవుతూనే ఉంది. ‘నాటు నాటు’ పాటలో వాళ్లిద్దరూ ఎంత మంచి సింక్లో డ్యాన్స్ చేశారో తెలిసిందే. ఇతర ప్రోమోల్లోనూ ఇద్దరి మధ్య మంచి సమన్వయం కనిపించింది. ఈ సినిమాకు పని చేసే క్రమంలో ఇద్దరూ మంచి స్నేహితులవడంతో తెరపై కెమిస్ట్రీ అలా పండిందేమో అని అంతా అనుకుంటున్నారు.
కానీ అది తప్పని.. తామిద్దరం ముందు నుంచి మంచి స్నేహితులు కావడం వల్లే ఈ సినిమాలో ఆ సమన్వయం, సింక్, కెమిస్ట్రీ కనిపిస్తోందని తారక్, చరణ్ అంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో వాళ్లెంత మంచి స్నేహితులనేది ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది. తాజాగా ముంబయిలో నిర్వహించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్లో తారక్-చరణ్ల అనుబంధం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఈవెంట్లో ఒకరి గురించి ఒకరు గొప్పగా మాట్లాడుకున్నట్లు అందులో పాల్గొన్న వారు చెబుతున్నారు. ఈ ఈవెంట్ లైవ్ ఇవ్వకపోయినా.. మొబైళ్లలో తీసిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా తారక్ మైకందుకున్నపుడు మాట్లాడిన తొలి మాటల తాలూకు వీడియో వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి తారక్, చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున స్పెషల్ బస్సుల్లో తరలి వెళ్లారు. ఈవెంట్లో వారు తమ అభిమాన కథానాయకుల నినాదాలతో హోరెత్తించారు.
కాగా తారక్ మైకందుకున్నపుడు.. అందరికీ నమస్కారం అని చెప్పి రామ్ చరణ్ అభిమానులకు స్వాగతం అన్నాడు. తన అభిమానులను పలకరించకుండా చరణ్ అభిమానుల పేరెత్తాడే అని అంతా ఆశ్చర్యపోయారు. ఐతే దీనికి కొనసాగింపుగా తారక్ మాట్లాడుతూ.. ఇక్కడ రామ్ అంటే తాను అని, చరణ్ అంటే రామ్ చరణ్ అని అందుకే ఇరువురి అభిమానులను ఉద్దేశించి ఇలా సంబోధించానని చెప్పి అందరి మనసూ దోచేశాడు. తమ ఇద్దరి కలయికను బహుశా దేవుడు నిర్ణయించి ఉంటాడని తారక్ వ్యాఖ్యానించాడు.
This post was last modified on December 20, 2021 5:30 pm
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…
రాకా.. ప్రస్తుతం ఇండియాలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటి. పుష్ప-2 లాంటి సెన్సేషనల్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్…