నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు నిజంగా అభిమానా? ఇప్పుడు చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది. ఇంతకుముందు దీనిపై సందేహాలుండేవి కానీ.. ఇటీవల ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో బాలయ్యే స్వయంగా జగన్ తన అభిమాని అని తెలుసని.. అతను కడప టౌన్ బాలయ్య అభిమానుల సంఘం ప్రెసిడెంట్గా ఉండేవాడని ధ్రువీకరించడంతో అయోమయం నెలకొంది.
జగన్ అయితే ఎప్పుడూ తాను బాలయ్య అభిమానని చెప్పలేదు. ఐతే సమరసింహారెడ్డి విడుదల సమయంలో బాలయ్యకు శుభాకాంక్షలు చెబుతూ ఆయన అభిమాన సంఘం అధ్యక్షుడిగా జగన్ ఇచ్చినట్లుగా ఓ యాడ్ మాత్రం ఆ మధ్య సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కానీ అది ఫేక్ అంటూ కూడా ప్రచారం సాగింది.
ఈ నేపథ్యంలో బాలయ్యకు జగన్ అభిమానా కాదా అనేదానిపై అయోమయం కొనసాగుతోంది. ఈ విషయాన్ని క్లియర్ చేయాల్సింది జగన్. కానీ ఆయన ఇప్పుడు దీనిపై స్పందిస్తాడని అనుకోలేం. ఐతే రాయలసీమలో బాలయ్యకు వీరాభిమానిగా పేరున్న అనంతపురం జగన్.. ఈ వషయంలో స్పష్టత ఇచ్చాడు ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో.
అప్పట్లో అభిమానులు తమ సంఘాలకు గౌరవాధ్యక్షులుగా జిల్లాల్లో పేరున్న కుటుంబాల్లోని యువ నాయకుల పేర్లు వాడుకునేవారని.. తమకు ఏదైనా సమస్య వస్తే, ఇబ్బందులు ఎదురైతే వాళ్లు సాయం చేస్తారని ఇలా చేసేవారని.. జగన్ పేరును కూడా కడప జిల్లా బాలయ్య అభిమానుల సంఘం గౌరవాధ్యక్షుడిగా ఇలాగే పెట్టుకున్నారని.. అంతకుమించి ఏమీ లేకపోవచ్చని అతను చెప్పాడు. మరి ఇదెంతవరకు పక్కా సమాచారమో?
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…