Movie News

బాల‌య్య‌కు జ‌గ‌న్ ఫ్యాన్.. అస‌లు క‌థేంటి?

నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఒక‌ప్పుడు నిజంగా అభిమానా? ఇప్పుడు చాలామందిని తొలిచేస్తున్న ప్ర‌శ్న ఇది. ఇంత‌కుముందు దీనిపై సందేహాలుండేవి కానీ.. ఇటీవ‌ల ఓ టీవీ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో బాల‌య్యే స్వ‌యంగా జ‌గ‌న్ త‌న అభిమాని అని తెలుస‌ని.. అత‌ను క‌డ‌ప టౌన్ బాల‌య్య అభిమానుల సంఘం ప్రెసిడెంట్‌గా ఉండేవాడ‌ని ధ్రువీక‌రించ‌డంతో అయోమ‌యం నెల‌కొంది.

జ‌గ‌న్ అయితే ఎప్పుడూ తాను బాల‌య్య అభిమాన‌ని చెప్ప‌లేదు. ఐతే స‌మ‌ర‌సింహారెడ్డి విడుద‌ల స‌మ‌యంలో బాల‌య్య‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ ఆయ‌న అభిమాన సంఘం అధ్య‌క్షుడిగా జ‌గ‌న్ ఇచ్చినట్లుగా ఓ యాడ్ మాత్రం ఆ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది. కానీ అది ఫేక్ అంటూ కూడా ప్ర‌చారం సాగింది.

ఈ నేప‌థ్యంలో బాల‌య్య‌కు జ‌గ‌న్ అభిమానా కాదా అనేదానిపై అయోమ‌యం కొన‌సాగుతోంది. ఈ విష‌యాన్ని క్లియ‌ర్ చేయాల్సింది జ‌గ‌న్. కానీ ఆయ‌న ఇప్పుడు దీనిపై స్పందిస్తాడ‌ని అనుకోలేం. ఐతే రాయ‌లసీమ‌లో బాల‌య్య‌కు వీరాభిమానిగా పేరున్న అనంత‌పురం జ‌గ‌న్‌.. ఈ వ‌ష‌యంలో స్ప‌ష్ట‌త ఇచ్చాడు ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో.

అప్ప‌ట్లో అభిమానులు త‌మ సంఘాల‌కు గౌర‌వాధ్యక్షులుగా జిల్లాల్లో పేరున్న కుటుంబాల్లోని యువ నాయ‌కుల పేర్లు వాడుకునేవార‌ని.. త‌మ‌కు ఏదైనా స‌మ‌స్య వ‌స్తే, ఇబ్బందులు ఎదురైతే వాళ్లు సాయం చేస్తార‌ని ఇలా చేసేవార‌ని.. జ‌గ‌న్ పేరును కూడా క‌డ‌ప జిల్లా బాల‌య్య అభిమానుల సంఘం గౌర‌వాధ్య‌క్షుడిగా ఇలాగే పెట్టుకున్నార‌ని.. అంత‌కుమించి ఏమీ లేక‌పోవ‌చ్చ‌ని అత‌ను చెప్పాడు. మ‌రి ఇదెంత‌వ‌ర‌కు ప‌క్కా స‌మాచారమో?

This post was last modified on June 9, 2020 9:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago