బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) షాకిచ్చింది. పనామా పేపర్స్ లీక్ కేసులో ఐశ్వర్యరాయ్కు సమన్లు జారీ చేసింది ఈడీ. పన్నులు ఎగ్గొట్టడానికి దీవుల్లో కంపెనీలు ఏర్పాటు చేసినట్లు పనామా పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా ఈడీ కేసును నమోదు చేసింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఈరోజు హాజరు కావాలని ఐశ్వర్యరాయ్కు సమన్లు జారీ చేసింది. నిజానికి ఇంతకుముందే ఐశ్వర్యరాయ్ ను ఈడీ ఆఫీస్ కు రావాలని కోరారు.
కానీ ఆమె ఏవో కారణాలు చెప్పి తప్పించుకుంది. ఈసారి మాత్రం ఆమె తప్పకుండా హాజరు కావాల్సిందేనని ఈడీ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై ఆమెని విచారించనుంది ఈడీ. దీనిపై ఐశ్వర్యరాయ్ ఇప్పటివరకు స్పందించలేదు. నెల రోజుల క్రితం అభిషేక్ బచ్చన్కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన అధికారుల ముందు హాజరయ్యారు. ఈడీ అధికారులకు అభిషేక్ కొన్ని పత్రాలను అందజేశారు.
ఇప్పుడు ఐశ్వర్యరాయ్కు సమన్లు జారీ కావడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పనామా పేపర్స్ కేసులో భారత్ నుంచి సుమారు 500 మందికి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఇందులో నాయకులు, నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు ఇలా సొసైటీలో పేరున్న చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇంతకీ ఈ పనామా పేపర్స్ ఏంటంటే.. కొన్ని దేశాల్లో రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సంపన్న కుటుంబాలకు చెందిన వారు ఇతర దేశాల బ్యాంకుల్లో తమ నగదును దాచుకున్నారు. ఆ విధంగా స్వదేశానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొడుతున్నారు. ఈ విషయం పనామా పేపర్స్ నుంచి లీక్ అవ్వడంతో విషయం బయటపడింది. దీంతో ఇప్పుడు అధికారులు పన్నులు ఎగ్గొట్టిన వారిపై దృష్టి పెట్టారు.
This post was last modified on December 20, 2021 1:29 pm
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…