Movie News

ఐశ్వర్యరాయ్‌కు షాకిచ్చిన ఈడీ.. సమన్లు జారీ!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) షాకిచ్చింది. పనామా పేపర్స్ లీక్ కేసులో ఐశ్వర్యరాయ్‌కు సమన్లు జారీ చేసింది ఈడీ. పన్నులు ఎగ్గొట్టడానికి దీవుల్లో కంపెనీలు ఏర్పాటు చేసినట్లు పనామా పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా ఈడీ కేసును నమోదు చేసింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఈరోజు హాజరు కావాలని ఐశ్వర్యరాయ్‌కు సమన్లు జారీ చేసింది. నిజానికి ఇంతకుముందే ఐశ్వర్యరాయ్‌ ను ఈడీ ఆఫీస్ కు రావాలని కోరారు.

కానీ ఆమె ఏవో కారణాలు చెప్పి తప్పించుకుంది. ఈసారి మాత్రం ఆమె తప్పకుండా హాజరు కావాల్సిందేనని ఈడీ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై ఆమెని విచారించనుంది ఈడీ. దీనిపై ఐశ్వర్యరాయ్‌ ఇప్పటివరకు స్పందించలేదు. నెల రోజుల క్రితం అభిషేక్‌ బచ్చన్‌కు కూడా ఈడీ సమన‍్లు జారీ చేసింది. దీంతో ఆయన అధికారుల ముందు హాజరయ్యారు. ఈడీ అధికారులకు అభిషేక్‌  కొన్ని పత్రాలను అందజేశారు.

ఇప్పుడు ఐశ్వర్యరాయ్‌కు సమన్లు జారీ కావడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పనామా పేపర్స్ కేసులో భారత్ నుంచి సుమారు 500 మందికి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఇందులో నాయకులు, నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు ఇలా సొసైటీలో పేరున్న చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

ఇంతకీ ఈ పనామా పేపర్స్ ఏంటంటే.. కొన్ని దేశాల్లో రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సంపన్న కుటుంబాలకు చెందిన వారు ఇతర దేశాల బ్యాంకుల్లో తమ నగదును దాచుకున్నారు. ఆ విధంగా స్వదేశానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొడుతున్నారు. ఈ విషయం పనామా పేపర్స్ నుంచి లీక్ అవ్వడంతో విషయం బయటపడింది. దీంతో ఇప్పుడు అధికారులు పన్నులు ఎగ్గొట్టిన వారిపై దృష్టి పెట్టారు. 

This post was last modified on December 20, 2021 1:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సామాన్యుల సమస్యలపై మాట్లాడే ఎంపీకు సొంత పార్టీ షాక్

రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…

35 minutes ago

రౌడీ ఇన్‌స్పెక్టర్ స్థాయిలో రంజింపజేయాలి

బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్‌స్పెక్టర్. 1992లో…

2 hours ago

అమ‌రావ‌తిపై చ‌ర్చ‌.. రాజ్య‌స‌భ‌లో దుమ్మురేపిన నాయుడు

అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లును బుధ‌వారం లోక్‌స‌భ ఆమోదించిన ద‌రిమిలా.. రాజ్య‌స‌భ‌లో గురువారం ప్ర‌వేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…

3 hours ago

సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజుల ఊపిరి

తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…

3 hours ago

వారణాసి ఇప్పుడెందుకు గుర్తుకు వస్తోంది

రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…

4 hours ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్‌: `ఐప్యాక్`పై ఈడీ న‌జ‌ర్‌!

పొలిటిక‌ల్ క‌న్స‌ల్టెన్సీ సంస్థ‌.. ఐప్యాక్‌పై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏక‌కాలంలో గురువారం.. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఐప్యాక్ సంస్థ‌ల‌కు…

4 hours ago