Movie News

ఐశ్వర్యరాయ్‌కు షాకిచ్చిన ఈడీ.. సమన్లు జారీ!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) షాకిచ్చింది. పనామా పేపర్స్ లీక్ కేసులో ఐశ్వర్యరాయ్‌కు సమన్లు జారీ చేసింది ఈడీ. పన్నులు ఎగ్గొట్టడానికి దీవుల్లో కంపెనీలు ఏర్పాటు చేసినట్లు పనామా పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా ఈడీ కేసును నమోదు చేసింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఈరోజు హాజరు కావాలని ఐశ్వర్యరాయ్‌కు సమన్లు జారీ చేసింది. నిజానికి ఇంతకుముందే ఐశ్వర్యరాయ్‌ ను ఈడీ ఆఫీస్ కు రావాలని కోరారు.

కానీ ఆమె ఏవో కారణాలు చెప్పి తప్పించుకుంది. ఈసారి మాత్రం ఆమె తప్పకుండా హాజరు కావాల్సిందేనని ఈడీ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై ఆమెని విచారించనుంది ఈడీ. దీనిపై ఐశ్వర్యరాయ్‌ ఇప్పటివరకు స్పందించలేదు. నెల రోజుల క్రితం అభిషేక్‌ బచ్చన్‌కు కూడా ఈడీ సమన‍్లు జారీ చేసింది. దీంతో ఆయన అధికారుల ముందు హాజరయ్యారు. ఈడీ అధికారులకు అభిషేక్‌  కొన్ని పత్రాలను అందజేశారు.

ఇప్పుడు ఐశ్వర్యరాయ్‌కు సమన్లు జారీ కావడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పనామా పేపర్స్ కేసులో భారత్ నుంచి సుమారు 500 మందికి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఇందులో నాయకులు, నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు ఇలా సొసైటీలో పేరున్న చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

ఇంతకీ ఈ పనామా పేపర్స్ ఏంటంటే.. కొన్ని దేశాల్లో రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సంపన్న కుటుంబాలకు చెందిన వారు ఇతర దేశాల బ్యాంకుల్లో తమ నగదును దాచుకున్నారు. ఆ విధంగా స్వదేశానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొడుతున్నారు. ఈ విషయం పనామా పేపర్స్ నుంచి లీక్ అవ్వడంతో విషయం బయటపడింది. దీంతో ఇప్పుడు అధికారులు పన్నులు ఎగ్గొట్టిన వారిపై దృష్టి పెట్టారు. 

This post was last modified on December 20, 2021 1:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago