‘పుష్ప’ సినిమాలో బెస్ట్ పెర్ఫామర్ ఎవరు అంటే మరో మాట లేకుండా అల్లు అర్జున్ పేరు చెప్పేస్తారు అందరూ. వన్ మ్యాన్ షో అనిపించేలా మొత్తం సినిమాను తన భుజాల మీద మోశాడు బన్నీ. పెర్ఫామెన్స్ విషయంలో ఎవరూ అతడి ముందు నిలవలేకపోయారు. హీరోయిన్ రష్మిక గురించి ఎక్కువగా నెగెటివ్ కామెంట్లే వినిపిస్తున్నాయి. మెయిన్ విలన్గా చేసిన సునీల్ గెటప్ అదీ బాగున్నా.. మంగళం శీను పాత్ర అనుకున్నంత గొప్పగా ఏమీ లేదు. సునీల్ అనుకున్నంత ఇంపాక్ట్ వేయలేకపోయాడు.
అనసూయ చేసిన ద్రాక్షాయని పాత్ర తేలిపోయింది. కొండా రెడ్డిగా అజయ్ ఘోష్ మంచి మార్కులే వేయించుకున్నాడు. జాలి రెడ్డిగా కన్నడ నటుడు ధనంజయ పర్వాలేదనిపించాడు. ఐతే వీళ్లందరినీ మించి.. అల్లు అర్జున్ తర్వాత నటన పరంగా మంచి ఇంపాక్ట్ వేసిన ఒక నటుడున్నాడు. అతడి పేరు.. జగదీష్.
సినిమా అంతటా హీరో పక్కనే ఉండే కేశవ అనే పాత్రలో నటించిన నటుడే జగదీష్. చాలామందికి ఇతనెవరో కూడా తెలియదు. ఎవరో కొత్త ఆర్టిస్ట్ అనుకుంటున్నారు. కానీ అతను ఇప్పటికే ఓ సినిమాలో మంచి పాత్ర చేశాడు. ఆ చిత్రమే.. పలాస. అందులో హీరోయిన్ అన్న పాత్రలో చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా చూసే సుకుమార్ ‘పుష్ప’లో హీరో ఫ్రెండు పాత్రకు జగదీష్ను ఎంచుకున్నాడు.
ఐతే తొలి సినిమాలో శ్రీకాకుళం యాసలో ఆకట్టుకున్న జగదీష్కు దానికి పూర్తి భిన్నమైన చిత్తూరు యాసలో డైలాగ్స్ చెప్పడం కష్టమే అయ్యుంటుంది. ఐతే అతను ఎంత కష్టపడ్డాడో ఏమో కానీ.. చాలా ఈజ్తో చిత్తూరు యాసలో సంభాషణలు చక్కగా పలికాడు. ఇక అతడి నటన కూడా గొప్పగా సాగింది. అల్లు అర్జున్ అయినా అక్కడక్కడా కొంచెం కృత్రిమంగా చేసినట్లు, పట్టి పట్టి డైలాగులు చెబుతున్నట్లు అనిపించింది కానీ.. జగదీష్ అయితే ఆ పాత్రలో చాలా ఈజీగా ఒదిగిపోయాడు. సుకుమార్ సినిమా చూసి అతణ్ని ప్రత్యేకంగా అభినందించినట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత ఈ నటుడు బిజీ అయ్యేలా ఉన్నాడు.
This post was last modified on December 19, 2021 7:49 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…