‘పుష్ప’ సినిమాలో బెస్ట్ పెర్ఫామర్ ఎవరు అంటే మరో మాట లేకుండా అల్లు అర్జున్ పేరు చెప్పేస్తారు అందరూ. వన్ మ్యాన్ షో అనిపించేలా మొత్తం సినిమాను తన భుజాల మీద మోశాడు బన్నీ. పెర్ఫామెన్స్ విషయంలో ఎవరూ అతడి ముందు నిలవలేకపోయారు. హీరోయిన్ రష్మిక గురించి ఎక్కువగా నెగెటివ్ కామెంట్లే వినిపిస్తున్నాయి. మెయిన్ విలన్గా చేసిన సునీల్ గెటప్ అదీ బాగున్నా.. మంగళం శీను పాత్ర అనుకున్నంత గొప్పగా ఏమీ లేదు. సునీల్ అనుకున్నంత ఇంపాక్ట్ వేయలేకపోయాడు.
అనసూయ చేసిన ద్రాక్షాయని పాత్ర తేలిపోయింది. కొండా రెడ్డిగా అజయ్ ఘోష్ మంచి మార్కులే వేయించుకున్నాడు. జాలి రెడ్డిగా కన్నడ నటుడు ధనంజయ పర్వాలేదనిపించాడు. ఐతే వీళ్లందరినీ మించి.. అల్లు అర్జున్ తర్వాత నటన పరంగా మంచి ఇంపాక్ట్ వేసిన ఒక నటుడున్నాడు. అతడి పేరు.. జగదీష్.
సినిమా అంతటా హీరో పక్కనే ఉండే కేశవ అనే పాత్రలో నటించిన నటుడే జగదీష్. చాలామందికి ఇతనెవరో కూడా తెలియదు. ఎవరో కొత్త ఆర్టిస్ట్ అనుకుంటున్నారు. కానీ అతను ఇప్పటికే ఓ సినిమాలో మంచి పాత్ర చేశాడు. ఆ చిత్రమే.. పలాస. అందులో హీరోయిన్ అన్న పాత్రలో చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా చూసే సుకుమార్ ‘పుష్ప’లో హీరో ఫ్రెండు పాత్రకు జగదీష్ను ఎంచుకున్నాడు.
ఐతే తొలి సినిమాలో శ్రీకాకుళం యాసలో ఆకట్టుకున్న జగదీష్కు దానికి పూర్తి భిన్నమైన చిత్తూరు యాసలో డైలాగ్స్ చెప్పడం కష్టమే అయ్యుంటుంది. ఐతే అతను ఎంత కష్టపడ్డాడో ఏమో కానీ.. చాలా ఈజ్తో చిత్తూరు యాసలో సంభాషణలు చక్కగా పలికాడు. ఇక అతడి నటన కూడా గొప్పగా సాగింది. అల్లు అర్జున్ అయినా అక్కడక్కడా కొంచెం కృత్రిమంగా చేసినట్లు, పట్టి పట్టి డైలాగులు చెబుతున్నట్లు అనిపించింది కానీ.. జగదీష్ అయితే ఆ పాత్రలో చాలా ఈజీగా ఒదిగిపోయాడు. సుకుమార్ సినిమా చూసి అతణ్ని ప్రత్యేకంగా అభినందించినట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత ఈ నటుడు బిజీ అయ్యేలా ఉన్నాడు.
This post was last modified on December 19, 2021 7:49 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…