ఇప్పటి జనాల్లో వెటకారం పీక్స్ లో ఉంటోంది. ఏదైనా నచ్చకపోతే దాన్ని పబ్లిగ్గా ఎండగట్టేస్తున్నారు. సినిమాలను అయినా, రాజకీయ నాయకులనైనా, మీడియాను అయినా ట్రోల్ చేసేస్తున్నారు. అయితే ఇలాంటి జమానాలో కూడా రాంగోపాల్ వర్మ తాను తీసే సినిమాల్లో కంటెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం లేదు. ఏదైనా సిట్యుయేషన్ వచ్చినపుడు అందులోంచి బయటకు రావడానికి తన బుర్ర బాగానే వాడతాడు. ఉదాహరణకు సినిమా థియేటర్లు లేని టైంలో ఓటిటీ దయ దాక్షిణ్యాలపై ఆధారపడకుండా పే పర్ వ్యూ పద్ధతిని అమల్లోకి తెచ్చాడు. అయితే ఈ పద్ధతిలో క్లైమాక్స్ లాంటి సినిమాను చూపించి 100 రూపాయలు పెట్టి కొన్న వారితో అక్షింతలు వేయించుకుంటున్నాడు. ఈ సినిమా కంటే కూడా దీనిపై వస్తోన్న కామెంట్స్ ఎక్కువ వినోదాన్ని అందిస్తున్నాయి.
ఓటిటీలో వచ్చే సినిమాలు ఇంటి వసారాలో టీవీలో ఠీవిగా చూస్తే, క్లైమాక్స్ మాత్రం బాత్రూమ్లో కూర్చుని ఒంటరిగా చూసుకోవాలట. ఎందుకనేది ట్రైలర్ చుసిన వాళ్లకు ఇట్టే అర్ధమై ఉండాలి. తన సినిమాలపై ఎలాంటి కామెంట్స్ వచ్చినా కానీ తన పని తాను చేసేసుకునే వర్మ ఆల్రెడీ ఈ పద్ధతిలో రెండో సినిమా నేకెడ్ (నగ్నం) సిద్ధం చేస్తున్నాడు. ఈసారి రేట్ 100 కాకుండా 200 పెడతాడట. ఆయన కాన్ఫిడెన్స్ ని మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే.
వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…