ఇప్పటి జనాల్లో వెటకారం పీక్స్ లో ఉంటోంది. ఏదైనా నచ్చకపోతే దాన్ని పబ్లిగ్గా ఎండగట్టేస్తున్నారు. సినిమాలను అయినా, రాజకీయ నాయకులనైనా, మీడియాను అయినా ట్రోల్ చేసేస్తున్నారు. అయితే ఇలాంటి జమానాలో కూడా రాంగోపాల్ వర్మ తాను తీసే సినిమాల్లో కంటెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం లేదు. ఏదైనా సిట్యుయేషన్ వచ్చినపుడు అందులోంచి బయటకు రావడానికి తన బుర్ర బాగానే వాడతాడు. ఉదాహరణకు సినిమా థియేటర్లు లేని టైంలో ఓటిటీ దయ దాక్షిణ్యాలపై ఆధారపడకుండా పే పర్ వ్యూ పద్ధతిని అమల్లోకి తెచ్చాడు. అయితే ఈ పద్ధతిలో క్లైమాక్స్ లాంటి సినిమాను చూపించి 100 రూపాయలు పెట్టి కొన్న వారితో అక్షింతలు వేయించుకుంటున్నాడు. ఈ సినిమా కంటే కూడా దీనిపై వస్తోన్న కామెంట్స్ ఎక్కువ వినోదాన్ని అందిస్తున్నాయి.
ఓటిటీలో వచ్చే సినిమాలు ఇంటి వసారాలో టీవీలో ఠీవిగా చూస్తే, క్లైమాక్స్ మాత్రం బాత్రూమ్లో కూర్చుని ఒంటరిగా చూసుకోవాలట. ఎందుకనేది ట్రైలర్ చుసిన వాళ్లకు ఇట్టే అర్ధమై ఉండాలి. తన సినిమాలపై ఎలాంటి కామెంట్స్ వచ్చినా కానీ తన పని తాను చేసేసుకునే వర్మ ఆల్రెడీ ఈ పద్ధతిలో రెండో సినిమా నేకెడ్ (నగ్నం) సిద్ధం చేస్తున్నాడు. ఈసారి రేట్ 100 కాకుండా 200 పెడతాడట. ఆయన కాన్ఫిడెన్స్ ని మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే.
This post was last modified on June 9, 2020 2:46 am
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…