ఇప్పటి జనాల్లో వెటకారం పీక్స్ లో ఉంటోంది. ఏదైనా నచ్చకపోతే దాన్ని పబ్లిగ్గా ఎండగట్టేస్తున్నారు. సినిమాలను అయినా, రాజకీయ నాయకులనైనా, మీడియాను అయినా ట్రోల్ చేసేస్తున్నారు. అయితే ఇలాంటి జమానాలో కూడా రాంగోపాల్ వర్మ తాను తీసే సినిమాల్లో కంటెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం లేదు. ఏదైనా సిట్యుయేషన్ వచ్చినపుడు అందులోంచి బయటకు రావడానికి తన బుర్ర బాగానే వాడతాడు. ఉదాహరణకు సినిమా థియేటర్లు లేని టైంలో ఓటిటీ దయ దాక్షిణ్యాలపై ఆధారపడకుండా పే పర్ వ్యూ పద్ధతిని అమల్లోకి తెచ్చాడు. అయితే ఈ పద్ధతిలో క్లైమాక్స్ లాంటి సినిమాను చూపించి 100 రూపాయలు పెట్టి కొన్న వారితో అక్షింతలు వేయించుకుంటున్నాడు. ఈ సినిమా కంటే కూడా దీనిపై వస్తోన్న కామెంట్స్ ఎక్కువ వినోదాన్ని అందిస్తున్నాయి.
ఓటిటీలో వచ్చే సినిమాలు ఇంటి వసారాలో టీవీలో ఠీవిగా చూస్తే, క్లైమాక్స్ మాత్రం బాత్రూమ్లో కూర్చుని ఒంటరిగా చూసుకోవాలట. ఎందుకనేది ట్రైలర్ చుసిన వాళ్లకు ఇట్టే అర్ధమై ఉండాలి. తన సినిమాలపై ఎలాంటి కామెంట్స్ వచ్చినా కానీ తన పని తాను చేసేసుకునే వర్మ ఆల్రెడీ ఈ పద్ధతిలో రెండో సినిమా నేకెడ్ (నగ్నం) సిద్ధం చేస్తున్నాడు. ఈసారి రేట్ 100 కాకుండా 200 పెడతాడట. ఆయన కాన్ఫిడెన్స్ ని మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే.
This post was last modified on June 9, 2020 2:46 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…