Movie News

థియేటర్లలో మొదలైన అసలు సినిమా

థియేటర్లలో అసలైన సినిమా ఇపుడే మొదలైందా ? రెవిన్యు అధికారుల వ్యవహారం చూస్తుంటే అవుననే అనుకోవాలి. నిబంధనల ప్రకారం నడుచుకోని సినిమా థియేటర్లను సీజ్ చేయటానికి ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో థియేటర్లలో రెవిన్యు అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు మొదలుపెట్టారు. గుంటూరు, చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లోని చాలా థియేటర్లను రెవిన్యు ఇన్సెపెక్టర్లు, పోలీసులు కలిసి తనిఖీలు చేశారు.

రోజుకు ఎన్నిషోలు వేస్తున్నారు ? టికెట్లను ఎంత ధరకు అమ్ముతున్నారు ? థియేటర్ల విద్యుత్ చార్జీలు చెల్లించారా లేదా ? బాత్ రూములు నిర్వహణ ఎలా ఉంది ? క్యాంటిన్లో అమ్ముతున్న వస్తువులేంటి ? అవి ప్రమాణాలకు తగ్గట్లుగానే ఉన్నాయా లేవా ? నిర్దేశిత ధరలకు మాత్రమే అమ్ముతున్నారా ? బిల్లులు ఇస్తున్నారా ?  వెహికల్ పార్కింగ్ లో టోకెన్లు ఇస్తున్నారా ? లేదా ? సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా ? లేదా ? అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

నిజానికి పై నిబంధనలన్నింటినీ ఇపుడు ప్రభుత్వం కొత్తగా పెట్టిందేమీ కాదు. ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నవే. కాకపోతే గత ప్రభుత్వాలు ఏ నిబంధనలనూ పెద్దగా పట్టించుకోలేదు. థియేటర్ల యాజమాన్యాలు ఇష్టరాజ్యంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా ఏ అధికారి కూడా కన్నెత్తి చూసిందిలేదు. దాంతో రోజుకు ఇన్నే షోలు వేయాలన్న నిబంధనను యాజమాన్యాలు తమిష్టం వచ్చినట్లు ఉల్లంఘించాయి. తమను అడిగేవారే లేరన్నట్లుగా వ్యవహరించాయి.

ఇపుడు ప్రభుత్వం సినీమాటోగ్రఫీ చట్టం నిబంధనలను గుర్తుచేస్తు థియేటర్ల తనిఖీలు మొదలుపెట్టింది. తమ తనిఖీలను వీడియోలు కూడా తీయించి జాయిట్ కలెక్టర్లకు పంపుతున్నారు. నిబంధనల ప్రకారం నడుచుకోని థియేటర్ల వివరాలు, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయన్న నివేదికలను రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు, పోలీసుల తనిఖీ బృందం ఆర్డీవోల ద్వారా జాయింట్ కలెక్టర్లకు అందిస్తున్నారు. ఇలా జిల్లా మొత్తం నుండి వచ్చిన నివేదికలపై జాయింట్ కలెక్టర్లు తమ రిపోర్టు రాసి ప్రభుత్వానికి పంపుతున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on December 18, 2021 9:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

32 minutes ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

45 minutes ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

2 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

3 hours ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

4 hours ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

4 hours ago