దర్శకుడు సుకుమార్తో అల్లు అర్జున్కు ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తొలి సినిమా ‘గంగోత్రి’ ఉన్నంతలో బాగానే ఆడినా.. ఆ సినిమాతో బన్నీకి నెగెటివ్ రిమార్క్సే పడ్డాయి. ఐతే ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చేసిన ‘ఆర్య’తో అతడి కెరీర్ మారిపోయింది. ఆ చిత్రంతో స్టార్ అయిపోయాడు బన్నీ. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ‘ఆర్య’ ఎప్పటికీ బన్నీకి స్పెషల్. అలాగే తాను పని చేసిన దర్శకులందరిలో సుకుమార్ అతడికి చాలా ప్రత్యేకం. సుక్కు గురించి ఎప్పుడు మాట్లాడినా చాలా ఎగ్జైట్ అవుతాడు. అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తాడు.
ఇప్పుడు ‘పుష్ప’ రిలీజ్ ముంగిట సుక్కుతో కలిసి పాల్గొన్న ప్రెస్ మీట్లోనూ తన ఫేవరెట్ డైరెక్టర్పై ప్రశంసల జల్లు కురిపించాడు బన్నీ. ‘పుష్ఫ’ సినిమాను సుక్కు తీసిన విధానం చూసి తాను షాకైపోయినట్లుగా బన్నీ వెల్లడించాడు. ఈ సందర్భంగా బన్నీ ఒక ఆసక్తికర ఛాలెంజ్ కూడా చేయడం విశేషం.
‘‘పుష్ప సినిమాను ఒక హీరోగా కాకుండా ఒక ప్రేక్షకుడిలా చూసి చెబుతున్నా. సుకుమార్ గారు ఈ సినిమాను మామూలుగా తీయలేదు. ఒక కమర్షియల్ సినిమాను ఇలా కూడా తీయొచ్చా అనిపించారు సుక్కు. రేప్పొద్దున థియేటర్లలో ప్రేక్షకులు ఈ సినిమా చూస్తున్నపుడు వారికి పిచ్చెక్కిపోతుంది. మేం అనుకున్నట్లుగా మ్యాజిక్ వర్కవుట్ అయితే సినిమా లెవెలే వేరుగా ఉంటుంది.
కచ్చితంగా చెబుతున్నా.. ఈ సినిమా రిలీజయ్యాక దర్శకులంతా సుకుమార్ గారి దగ్గరికి వచ్చి ఇలా ఎలా తీశారు సార్ సినిమా అని అడుగుతారు. ఈ విషయంలో ఆయన దగ్గర క్లాసులు తీసుకుంటారు. ప్రతి సీన్ గురించి మాట్లాడతారు. ఆ సీన్లు ఎలా తీశారో అడిగి తెలుసుకుంటారు. అంత బాగా తీశారాయన ఈ సినిమా. ఇలా జరక్కపోతే నేను షర్ట్ విప్పేసి మైత్రీ ఆఫీసులో తిరుగుతా’’ అంటూ నవ్వేశాడు బన్నీ. మరి ఈ అల్లు హీరో చెబుతున్న రేంజిలో ‘పుష్ఫ’లో సుక్కు ఏం మ్యాజిక్ చేశాడో చూడాలి.
This post was last modified on December 17, 2021 6:52 am
ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…