దర్శకుడు సుకుమార్తో అల్లు అర్జున్కు ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తొలి సినిమా ‘గంగోత్రి’ ఉన్నంతలో బాగానే ఆడినా.. ఆ సినిమాతో బన్నీకి నెగెటివ్ రిమార్క్సే పడ్డాయి. ఐతే ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చేసిన ‘ఆర్య’తో అతడి కెరీర్ మారిపోయింది. ఆ చిత్రంతో స్టార్ అయిపోయాడు బన్నీ. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ‘ఆర్య’ ఎప్పటికీ బన్నీకి స్పెషల్. అలాగే తాను పని చేసిన దర్శకులందరిలో సుకుమార్ అతడికి చాలా ప్రత్యేకం. సుక్కు గురించి ఎప్పుడు మాట్లాడినా చాలా ఎగ్జైట్ అవుతాడు. అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తాడు.
ఇప్పుడు ‘పుష్ప’ రిలీజ్ ముంగిట సుక్కుతో కలిసి పాల్గొన్న ప్రెస్ మీట్లోనూ తన ఫేవరెట్ డైరెక్టర్పై ప్రశంసల జల్లు కురిపించాడు బన్నీ. ‘పుష్ఫ’ సినిమాను సుక్కు తీసిన విధానం చూసి తాను షాకైపోయినట్లుగా బన్నీ వెల్లడించాడు. ఈ సందర్భంగా బన్నీ ఒక ఆసక్తికర ఛాలెంజ్ కూడా చేయడం విశేషం.
‘‘పుష్ప సినిమాను ఒక హీరోగా కాకుండా ఒక ప్రేక్షకుడిలా చూసి చెబుతున్నా. సుకుమార్ గారు ఈ సినిమాను మామూలుగా తీయలేదు. ఒక కమర్షియల్ సినిమాను ఇలా కూడా తీయొచ్చా అనిపించారు సుక్కు. రేప్పొద్దున థియేటర్లలో ప్రేక్షకులు ఈ సినిమా చూస్తున్నపుడు వారికి పిచ్చెక్కిపోతుంది. మేం అనుకున్నట్లుగా మ్యాజిక్ వర్కవుట్ అయితే సినిమా లెవెలే వేరుగా ఉంటుంది.
కచ్చితంగా చెబుతున్నా.. ఈ సినిమా రిలీజయ్యాక దర్శకులంతా సుకుమార్ గారి దగ్గరికి వచ్చి ఇలా ఎలా తీశారు సార్ సినిమా అని అడుగుతారు. ఈ విషయంలో ఆయన దగ్గర క్లాసులు తీసుకుంటారు. ప్రతి సీన్ గురించి మాట్లాడతారు. ఆ సీన్లు ఎలా తీశారో అడిగి తెలుసుకుంటారు. అంత బాగా తీశారాయన ఈ సినిమా. ఇలా జరక్కపోతే నేను షర్ట్ విప్పేసి మైత్రీ ఆఫీసులో తిరుగుతా’’ అంటూ నవ్వేశాడు బన్నీ. మరి ఈ అల్లు హీరో చెబుతున్న రేంజిలో ‘పుష్ఫ’లో సుక్కు ఏం మ్యాజిక్ చేశాడో చూడాలి.
This post was last modified on December 17, 2021 6:52 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…