టాలీవుడ్లో నిన్నటితరం హీరోల్లో రాజశేఖర్, విక్టరీ వెంకటేష్ ఎక్కువగా రీమేక్లు చేసేవాళ్లు. ఇప్పటికీ వాళ్లిద్దరూ వేరే భాషల్లో హిట్టయిన చిత్రాల ఆధారంగా సినిమాలు చేస్తున్నారు. ఇక తర్వాతి తరం హీరోల్లో ఎక్కువగా రీమేక్లు చేసేదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణే. ‘సుస్వాగతం’తో మొదలుపెట్టి ‘వకీల్ సాబ్’ తరచుగా ఆయన రీమేక్లు చేశారు.
త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న ‘భీమ్లా నాయక్’ సైతం రీమేకే అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా పవన్ హీరోగా మరో రీమేక్ ఖరారైనట్లుగా వార్తలొస్తున్నాయి. తమిళ చిత్రం ‘వినోదియ సిత్తం’ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో పవన్ హీరోగా నటించనున్నాడట. తెలుగులో ‘అల వైకుంఠపురములో’, ‘క్రాక్’ సహా పలు చిత్రాలతో నటుడిగా మంచి పేరు సంపాదించిన సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. ఆయనే స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
గతంలో ‘శంభో శివ శంభో’కు ఆధారమైన ‘నాడోడిగల్’ సహా కొన్ని హిట్ సినిమాలను రూపొందించిన సముద్రఖని కొంత కాలంగా దర్శకత్వానికి దూరంగా ఉన్నాడు. కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టి తనే హీరోగా ‘వినోదియ సిత్తం’ సినిమాను రూపొందించాడు.
ఓ నడి వయస్కుడైన వ్యక్తి ఒక ప్రమాదంలో చనిపోయాక ఇంకో మూడు నెలల పాటు బతికే అవకాశం పొందుతాడు. ఆ మూడు నెలల్లో తన తీరని కోరికలను ఎలా నెరవేర్చుకున్నాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం నేరుగా జీ5లో రిలీజై మంచి స్పందన తెచ్చుకుంది.
ఈ ఏడాది వచ్చిన ఉత్తమ తమిళ చిత్రాల్లో దీన్నొకటిగా చెబుతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయాలనుకుంటున్నట్లుగా వార్తలొస్తున్నాయి. సముద్రఖనినే దర్శకత్వం వహిస్తాడట. నిర్మాణ సంస్థ ఏదన్నది వెల్లడి కాలేదు. ఈ సినిమా కన్ఫమ్ అయితే పవన్ చేస్తున్న 11వ రీమేక్ అవుతుందిది.
This post was last modified on December 16, 2021 10:44 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…