టాలీవుడ్లో నిన్నటితరం హీరోల్లో రాజశేఖర్, విక్టరీ వెంకటేష్ ఎక్కువగా రీమేక్లు చేసేవాళ్లు. ఇప్పటికీ వాళ్లిద్దరూ వేరే భాషల్లో హిట్టయిన చిత్రాల ఆధారంగా సినిమాలు చేస్తున్నారు. ఇక తర్వాతి తరం హీరోల్లో ఎక్కువగా రీమేక్లు చేసేదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణే. ‘సుస్వాగతం’తో మొదలుపెట్టి ‘వకీల్ సాబ్’ తరచుగా ఆయన రీమేక్లు చేశారు.
త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న ‘భీమ్లా నాయక్’ సైతం రీమేకే అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా పవన్ హీరోగా మరో రీమేక్ ఖరారైనట్లుగా వార్తలొస్తున్నాయి. తమిళ చిత్రం ‘వినోదియ సిత్తం’ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో పవన్ హీరోగా నటించనున్నాడట. తెలుగులో ‘అల వైకుంఠపురములో’, ‘క్రాక్’ సహా పలు చిత్రాలతో నటుడిగా మంచి పేరు సంపాదించిన సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. ఆయనే స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
గతంలో ‘శంభో శివ శంభో’కు ఆధారమైన ‘నాడోడిగల్’ సహా కొన్ని హిట్ సినిమాలను రూపొందించిన సముద్రఖని కొంత కాలంగా దర్శకత్వానికి దూరంగా ఉన్నాడు. కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టి తనే హీరోగా ‘వినోదియ సిత్తం’ సినిమాను రూపొందించాడు.
ఓ నడి వయస్కుడైన వ్యక్తి ఒక ప్రమాదంలో చనిపోయాక ఇంకో మూడు నెలల పాటు బతికే అవకాశం పొందుతాడు. ఆ మూడు నెలల్లో తన తీరని కోరికలను ఎలా నెరవేర్చుకున్నాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం నేరుగా జీ5లో రిలీజై మంచి స్పందన తెచ్చుకుంది.
ఈ ఏడాది వచ్చిన ఉత్తమ తమిళ చిత్రాల్లో దీన్నొకటిగా చెబుతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయాలనుకుంటున్నట్లుగా వార్తలొస్తున్నాయి. సముద్రఖనినే దర్శకత్వం వహిస్తాడట. నిర్మాణ సంస్థ ఏదన్నది వెల్లడి కాలేదు. ఈ సినిమా కన్ఫమ్ అయితే పవన్ చేస్తున్న 11వ రీమేక్ అవుతుందిది.
This post was last modified on December 16, 2021 10:44 pm
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. బాలీవుడ్ నిర్మాత జాకీ…
టిడిపి తరఫున బలమైన గళం వినిపించే వారి కోసం పార్టీలో వెతుకుతున్నారు. వివాదరహితంగా పార్టీ పరంగా ప్రజలకు సంక్షేమ పథకాలు…
బాలీవుడ్లో వచ్చిన కల్ట్ బ్లాక్ బస్టర్ విక్కీ డోనర్ చూసిన ప్రేక్షకులు ఎవ్వరూ అందులో డాక్టర్ గా కీలక పాత్ర…
ఆరేళ్ల ముందు కొవిడ్ టైంలో థియేటర్లు మూతపడడంతో.. ఆ ఖాళీని భర్తీ చేయడం కోసం ఒక్కసారిగా ఓటీటీలు విజృంభించేశాయి. ఫిలిం…
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…