బాహుబలి తర్వాత ఇండియాలో అత్యధిక అంచనాలతో రాబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్యే అనడంలో మరో మాట లేదు. ఈ సినిమా మొదలైనపుడు బాహుబలి మ్యాజిక్ రిపీట్ చేయడం రాజమౌళికి అంత తేలిక కాదని అనుకున్నారు కానీ.. ఈ టాస్క్ మాస్టర్ తన కొత్త చిత్రం మీదా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తించడంలో విజయవంతం అయ్యాడు.
ఇప్పటికే ఉన్న హైప్ ఇటీవల రిలీజైన ట్రైలర్తో మరింత పెరిగింది. ఆర్ఆర్ఆర్ కోసం ఇండియాలోనే కాక విదేశాల్లోనూ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. యుఎస్లో బాహుబలి తరహాలోనే ఆర్ఆర్ఆర్ సైతం సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్న అంచనాలున్నాయి. అక్కడ ఈ సినిమా విడుదలకు భారీ స్థాయిలోనే సన్నాహాలు జరుగుతున్నాయి.
ఏకంగా వెయ్యికి పైగా మల్టీప్లెక్సుల్లో ఆర్ఆర్ఆర్ విడుదలవుతుండటం విశేషం. యుఎస్లో బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, టికెట్ల రేట్లు ఎలా ఉండబోతున్నాయని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. దీనికి సంబంధించి అప్డేట్ వచ్చేసింది. జనవరి 7న రిలీజ్ కాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు డిసెంబరు 20న బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. వివిధ భాషల్లో డిమాండ్ను బట్టి, అలాగే థియేటర్లలో టెక్నాలజీ ఆధారంగా టికెట్ల రేట్లను నిర్ణయించారు. ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్ నార్మల్ థియేటర్లలో ప్రిమియర్లకు 25 డాలర్లు, రెగ్యులర్ షోలకు 22 డాలర్లు టికెట్ ధర ఫిక్స్ చేశారు.
పిల్లలకు వరుసగా ఈ ధరలు 18 డాలర్లు, 15 డాలర్లుగా ఉన్నాయి. ఎక్స్డీ, త్రీడీ, లాంటి లార్జ్ ఫార్మాట్ ఉన్న థియేటర్లలో టికెట్ ధర ప్రిమియర్లకు 28 డాలర్లు, రెగ్యులర్ షోలకు 25 డాలర్లుగా ఉంది. ఐమ్యాక్స్ స్క్రీన్లలో ప్రిమియర్లకైనా, రెగ్యులర్ షోలకైనా టికెట్ రేటు 30 డాలర్లే. డాల్బీ విజన్లో అయితే రేటు 35 డాలర్లకు ఫిక్స్ చేశారు. తెలుగుతో పోలిస్తే మిగతా వెర్షన్లకు రేట్లు తక్కువ ఉన్నాయి. ప్రిమియర్స్లో రెగ్యులర్ స్క్రీన్లకు 16 డాలర్లు, లార్జ్ స్క్రీన్లకు 20 డాలర్లు, డాల్బీ వెర్షన్కు 22 డాలర్లు రేట్ నిర్ణయించారు. రెగ్యులర్ షోలకు ఇవే రేట్లు వర్తిస్తాయి.
This post was last modified on December 16, 2021 12:41 pm
నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…