బాహుబలి తర్వాత ఇండియాలో అత్యధిక అంచనాలతో రాబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్యే అనడంలో మరో మాట లేదు. ఈ సినిమా మొదలైనపుడు బాహుబలి మ్యాజిక్ రిపీట్ చేయడం రాజమౌళికి అంత తేలిక కాదని అనుకున్నారు కానీ.. ఈ టాస్క్ మాస్టర్ తన కొత్త చిత్రం మీదా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తించడంలో విజయవంతం అయ్యాడు.
ఇప్పటికే ఉన్న హైప్ ఇటీవల రిలీజైన ట్రైలర్తో మరింత పెరిగింది. ఆర్ఆర్ఆర్ కోసం ఇండియాలోనే కాక విదేశాల్లోనూ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. యుఎస్లో బాహుబలి తరహాలోనే ఆర్ఆర్ఆర్ సైతం సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్న అంచనాలున్నాయి. అక్కడ ఈ సినిమా విడుదలకు భారీ స్థాయిలోనే సన్నాహాలు జరుగుతున్నాయి.
ఏకంగా వెయ్యికి పైగా మల్టీప్లెక్సుల్లో ఆర్ఆర్ఆర్ విడుదలవుతుండటం విశేషం. యుఎస్లో బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, టికెట్ల రేట్లు ఎలా ఉండబోతున్నాయని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. దీనికి సంబంధించి అప్డేట్ వచ్చేసింది. జనవరి 7న రిలీజ్ కాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు డిసెంబరు 20న బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. వివిధ భాషల్లో డిమాండ్ను బట్టి, అలాగే థియేటర్లలో టెక్నాలజీ ఆధారంగా టికెట్ల రేట్లను నిర్ణయించారు. ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్ నార్మల్ థియేటర్లలో ప్రిమియర్లకు 25 డాలర్లు, రెగ్యులర్ షోలకు 22 డాలర్లు టికెట్ ధర ఫిక్స్ చేశారు.
పిల్లలకు వరుసగా ఈ ధరలు 18 డాలర్లు, 15 డాలర్లుగా ఉన్నాయి. ఎక్స్డీ, త్రీడీ, లాంటి లార్జ్ ఫార్మాట్ ఉన్న థియేటర్లలో టికెట్ ధర ప్రిమియర్లకు 28 డాలర్లు, రెగ్యులర్ షోలకు 25 డాలర్లుగా ఉంది. ఐమ్యాక్స్ స్క్రీన్లలో ప్రిమియర్లకైనా, రెగ్యులర్ షోలకైనా టికెట్ రేటు 30 డాలర్లే. డాల్బీ విజన్లో అయితే రేటు 35 డాలర్లకు ఫిక్స్ చేశారు. తెలుగుతో పోలిస్తే మిగతా వెర్షన్లకు రేట్లు తక్కువ ఉన్నాయి. ప్రిమియర్స్లో రెగ్యులర్ స్క్రీన్లకు 16 డాలర్లు, లార్జ్ స్క్రీన్లకు 20 డాలర్లు, డాల్బీ వెర్షన్కు 22 డాలర్లు రేట్ నిర్ణయించారు. రెగ్యులర్ షోలకు ఇవే రేట్లు వర్తిస్తాయి.
This post was last modified on December 16, 2021 12:41 pm
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…