బాహుబలి తర్వాత ఇండియాలో అత్యధిక అంచనాలతో రాబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్యే అనడంలో మరో మాట లేదు. ఈ సినిమా మొదలైనపుడు బాహుబలి మ్యాజిక్ రిపీట్ చేయడం రాజమౌళికి అంత తేలిక కాదని అనుకున్నారు కానీ.. ఈ టాస్క్ మాస్టర్ తన కొత్త చిత్రం మీదా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తించడంలో విజయవంతం అయ్యాడు.
ఇప్పటికే ఉన్న హైప్ ఇటీవల రిలీజైన ట్రైలర్తో మరింత పెరిగింది. ఆర్ఆర్ఆర్ కోసం ఇండియాలోనే కాక విదేశాల్లోనూ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. యుఎస్లో బాహుబలి తరహాలోనే ఆర్ఆర్ఆర్ సైతం సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్న అంచనాలున్నాయి. అక్కడ ఈ సినిమా విడుదలకు భారీ స్థాయిలోనే సన్నాహాలు జరుగుతున్నాయి.
ఏకంగా వెయ్యికి పైగా మల్టీప్లెక్సుల్లో ఆర్ఆర్ఆర్ విడుదలవుతుండటం విశేషం. యుఎస్లో బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, టికెట్ల రేట్లు ఎలా ఉండబోతున్నాయని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. దీనికి సంబంధించి అప్డేట్ వచ్చేసింది. జనవరి 7న రిలీజ్ కాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు డిసెంబరు 20న బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. వివిధ భాషల్లో డిమాండ్ను బట్టి, అలాగే థియేటర్లలో టెక్నాలజీ ఆధారంగా టికెట్ల రేట్లను నిర్ణయించారు. ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్ నార్మల్ థియేటర్లలో ప్రిమియర్లకు 25 డాలర్లు, రెగ్యులర్ షోలకు 22 డాలర్లు టికెట్ ధర ఫిక్స్ చేశారు.
పిల్లలకు వరుసగా ఈ ధరలు 18 డాలర్లు, 15 డాలర్లుగా ఉన్నాయి. ఎక్స్డీ, త్రీడీ, లాంటి లార్జ్ ఫార్మాట్ ఉన్న థియేటర్లలో టికెట్ ధర ప్రిమియర్లకు 28 డాలర్లు, రెగ్యులర్ షోలకు 25 డాలర్లుగా ఉంది. ఐమ్యాక్స్ స్క్రీన్లలో ప్రిమియర్లకైనా, రెగ్యులర్ షోలకైనా టికెట్ రేటు 30 డాలర్లే. డాల్బీ విజన్లో అయితే రేటు 35 డాలర్లకు ఫిక్స్ చేశారు. తెలుగుతో పోలిస్తే మిగతా వెర్షన్లకు రేట్లు తక్కువ ఉన్నాయి. ప్రిమియర్స్లో రెగ్యులర్ స్క్రీన్లకు 16 డాలర్లు, లార్జ్ స్క్రీన్లకు 20 డాలర్లు, డాల్బీ వెర్షన్కు 22 డాలర్లు రేట్ నిర్ణయించారు. రెగ్యులర్ షోలకు ఇవే రేట్లు వర్తిస్తాయి.
This post was last modified on December 16, 2021 12:41 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…