ఆంధ్రప్రదేశ్లో టికెట్ల ధరల గొడవ కొన్ని నెలలుగా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సినిమాతో మొదలైన టికెట్ల రేట్ల నియంత్రణ.. తర్వాత కూడా కొనసాగుతోంది. పరిశ్రమ పెద్దలు ఎంత గట్టిగా ప్రయత్నించినా ఈ విషయంలో ప్రభుత్వ ఆలోచన మారట్లేదు. చివరికిప్పుడు ఏపీలో థియేటర్ల యజమానులు కోర్టుకెక్కడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఏప్రిల్కు ముందున్న రేట్లనే కొనసాగించాలని, ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం.35ను వెనక్కి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం అప్పీల్కు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ వ్యవహారంపై ఇప్పుడు సినీ ప్రముఖులెవరూ స్పందించడానికి ఇష్టపడట్లేదు. ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లు మౌనంగా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో నందమూరి బాలకృష్ణ ఈ విషయమై స్పందించారు.
తన కొత్త చిత్రం అఖండ విజయయాత్రలో భాగంగా ఏపీలో పర్యటిస్తున్న బాలయ్యకు మంగళగిరిలో విలేకరుల నుంచి టికెట్ల రేట్ల వ్యవహారంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. టికెట్ల రేట్లపై నియంత్రణను ముందే ఎత్తి వేస్తే అఖండకు మేలు జరిగేది కదా.. కోర్టు ఉత్తర్వులపై ఏమంటారు.. ప్రభుత్వం అప్పీల్కు వెళ్లబోతుండటంపై మీ స్పందనేంటి లాంటి ప్రశ్నలు బాలయ్యకు సంధించారు విలేకరులు. దీనికాయన బదులిస్తూ.. ‘‘ఏపీలో ఉన్న సినిమా టికెట్ ధరల విషయంపై ‘అఖండ’ విడుదలకు ముందు మేమంతా చర్చించాం.
కానీ, నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి ధైర్యంగా ముందుకొచ్చి చిత్రాన్ని విడుదల చేశారు. సినిమా బాగా వచ్చింది. టికెట్ల విషయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఇప్పుడే విడుదల చేద్దామన్నారు. టికెట్ల విషయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తామంటోంది.. ఏం జరుగుతుందో చూద్దాం’’ అన్నారు. మరోవైపు మల్టీస్టారర్లు చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా.. ఎవరైనా మంచి కథతో వస్తే తప్పకుండా చేస్తానని బాలయ్య బదులిచ్చారు.
This post was last modified on December 16, 2021 9:12 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…