నందమూరి బాలకృష్ణ ఇంతకుముందు పైసా వసూల్ సినిమా కోసం గొంతు సవరించుకున్నాడు. మామా ఏక్ పెగ్ లా.. అంటూ తాగుబోతుల్ని సంబరాల్లో ముంచెత్తే ఓ పాట పాడాడు. మళ్లీ ఇప్పుడాయన పాట పాడే సాహసం చేశాడు. దీని గురించి కొన్ని రోజుల కిందటే ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో బాలయ్య చూచాయిగా చెప్పాడు.
ఇప్పుడు దానిపై అధికారిక ప్రకటన వచ్చింది. బుధవారం బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని ముందు రోజు ఈ పాటను లాంచ్ చేయబోతున్నారు. దీని గురించి టాలీవుడ్ ప్రముఖ పీఆర్వోలు, కొందరు ఫిలిం సెలబ్రెటీలు ట్వీట్లు వేశారు. ఐతే దీనికి సంబంధించి తయారు చేసిన పోస్టర్ మీద ఉన్న వాక్యాలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి.
నిన్న తప్పు చేసిన వారిని నిలదీసింది ఆ గళం.. నేడు ఆ బాల గోపాలాన్ని అలరించడానికి పాడింది ఆ గళం.. ఇదీ ఆ పోస్టర్ మీద రాసిన క్యాప్షన్. పక్కన బాలయ్య మైకు పట్టి పాట పాడుతున్నట్లుగా ఉన్న ఫొటో ఉంది. బాలయ్య పాట పాడిన విషయాన్ని చెప్పడానికి మధ్యలో నిన్న తప్పు చేసిన వారిని నిలదీసింది ఆ గళం అన్న కామెంట్ను ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు.
ఈ మధ్య బాలయ్య తెలంగాణ ప్రభుత్వంతో సినీ పెద్దల సమావేశానికి తనను పిలవకపోవడంపై నిరసన గళం వినిపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూల్లోనూ కొందరు సినీ పెద్దల మీద విమర్శలు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆర్థిక వ్యవహారాల మీదా ప్రశ్నించారు.
ఇప్పుడు పోస్టర్ మీద కామెంట్ చూస్తే ఆ విమర్శల్ని ఉద్దేశించి పెట్టినట్లుగా అనిపిస్తోంది. దీన్ని పీఆర్వోలందరూ ఉమ్మడిగా ప్రమోట్ చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. వివాదం కాస్త సద్దుమణిగిందనుకుంటుండగా.. మళ్లీ ఇలాంటి కామెంట్లతో రచ్చ అవసరమా అన్నది ప్రశ్న.
This post was last modified on June 8, 2020 10:27 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…