నందమూరి బాలకృష్ణ ఇంతకుముందు పైసా వసూల్ సినిమా కోసం గొంతు సవరించుకున్నాడు. మామా ఏక్ పెగ్ లా.. అంటూ తాగుబోతుల్ని సంబరాల్లో ముంచెత్తే ఓ పాట పాడాడు. మళ్లీ ఇప్పుడాయన పాట పాడే సాహసం చేశాడు. దీని గురించి కొన్ని రోజుల కిందటే ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో బాలయ్య చూచాయిగా చెప్పాడు.
ఇప్పుడు దానిపై అధికారిక ప్రకటన వచ్చింది. బుధవారం బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని ముందు రోజు ఈ పాటను లాంచ్ చేయబోతున్నారు. దీని గురించి టాలీవుడ్ ప్రముఖ పీఆర్వోలు, కొందరు ఫిలిం సెలబ్రెటీలు ట్వీట్లు వేశారు. ఐతే దీనికి సంబంధించి తయారు చేసిన పోస్టర్ మీద ఉన్న వాక్యాలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి.
నిన్న తప్పు చేసిన వారిని నిలదీసింది ఆ గళం.. నేడు ఆ బాల గోపాలాన్ని అలరించడానికి పాడింది ఆ గళం.. ఇదీ ఆ పోస్టర్ మీద రాసిన క్యాప్షన్. పక్కన బాలయ్య మైకు పట్టి పాట పాడుతున్నట్లుగా ఉన్న ఫొటో ఉంది. బాలయ్య పాట పాడిన విషయాన్ని చెప్పడానికి మధ్యలో నిన్న తప్పు చేసిన వారిని నిలదీసింది ఆ గళం అన్న కామెంట్ను ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు.
ఈ మధ్య బాలయ్య తెలంగాణ ప్రభుత్వంతో సినీ పెద్దల సమావేశానికి తనను పిలవకపోవడంపై నిరసన గళం వినిపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూల్లోనూ కొందరు సినీ పెద్దల మీద విమర్శలు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆర్థిక వ్యవహారాల మీదా ప్రశ్నించారు.
ఇప్పుడు పోస్టర్ మీద కామెంట్ చూస్తే ఆ విమర్శల్ని ఉద్దేశించి పెట్టినట్లుగా అనిపిస్తోంది. దీన్ని పీఆర్వోలందరూ ఉమ్మడిగా ప్రమోట్ చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. వివాదం కాస్త సద్దుమణిగిందనుకుంటుండగా.. మళ్లీ ఇలాంటి కామెంట్లతో రచ్చ అవసరమా అన్నది ప్రశ్న.
This post was last modified on June 8, 2020 10:27 pm
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…