ఒక సూపర్ స్టార్ హీరో తనయుడు హీరోగా అరంగేట్రం చేశాడంటే.. ఇక అతను తండ్రితో కలిసి ఎప్పుడు నటిస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తారు. టాలీవుడ్ విషయానికి వస్తే నిన్నటి తరంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వాళ్ల కొడుకులతో కలిసి నటించారు. తర్వాతి తరంలో చిరంజీవి రామ్ చరణ్ నటించిన రెండు సినిమాల్లో క్యామియో రోల్స్ చేశాడు.
ఆచార్యలో ఇద్దరూ కలిసి నటిస్తారని అంటున్నారు. ఇక నాగార్జున మనం సినిమాలో తన కొడుకులిద్దరితో కలిసి నటించాడు. ఇప్పుడు కోలీవుడ్లో ఓ సూపర్ స్టార్ కొడుకుతో కలిసి నటించబోతున్నాడు. ఆ తండ్రీ కొడుకులు.. విక్రమ్, ధ్రువ్. అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో ధ్రువ్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పర్వాలేదనిపించింది. ఇంకా అతడి రెండో సినిమా ఖరారవ్వలేదు.
ఈ లోపే తండ్రితో కలిసి నటించే అవకాశం అందుకున్నాడు ధ్రువ్. వీళ్లిద్దరినీ తెరపై చూపించబోయేది కార్తీక్ సుబ్బరాజ్. అతను విక్రమ్తో ఓ సినిమా\ చేయబోతున్నాడని.. ధ్రువ్ అందులో అతిథి పాత్ర చేస్తాడని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ రోజు దానిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందించబోతున్నాడు. ప్రస్తుతం కార్తీక్.. ధనుష్ హీరోగా తీసిన జగమే తంత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
థియేటర్లు పునఃప్రారంభం కాగానే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. త్వరలోనే విక్రమ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. విక్రమ్ కోబ్రా, మహావీర్ కర్ణ, పొన్నియన్ సెల్వన్ లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. విక్రమ్, ధ్రువ్ కాంబినేషన్లో సినిమాను ఇంత త్వరగా చూస్తామని అభిమానులు ఊహించి ఉండరు. ప్రి లుక్ పోస్టర్ను బట్టి చూస్తే ఇది పక్కా యాక్షన్ మూవీ అని అర్థమవుతోంది.
This post was last modified on June 8, 2020 10:20 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…