ఒక సూపర్ స్టార్ హీరో తనయుడు హీరోగా అరంగేట్రం చేశాడంటే.. ఇక అతను తండ్రితో కలిసి ఎప్పుడు నటిస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తారు. టాలీవుడ్ విషయానికి వస్తే నిన్నటి తరంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వాళ్ల కొడుకులతో కలిసి నటించారు. తర్వాతి తరంలో చిరంజీవి రామ్ చరణ్ నటించిన రెండు సినిమాల్లో క్యామియో రోల్స్ చేశాడు.
ఆచార్యలో ఇద్దరూ కలిసి నటిస్తారని అంటున్నారు. ఇక నాగార్జున మనం సినిమాలో తన కొడుకులిద్దరితో కలిసి నటించాడు. ఇప్పుడు కోలీవుడ్లో ఓ సూపర్ స్టార్ కొడుకుతో కలిసి నటించబోతున్నాడు. ఆ తండ్రీ కొడుకులు.. విక్రమ్, ధ్రువ్. అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో ధ్రువ్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పర్వాలేదనిపించింది. ఇంకా అతడి రెండో సినిమా ఖరారవ్వలేదు.
ఈ లోపే తండ్రితో కలిసి నటించే అవకాశం అందుకున్నాడు ధ్రువ్. వీళ్లిద్దరినీ తెరపై చూపించబోయేది కార్తీక్ సుబ్బరాజ్. అతను విక్రమ్తో ఓ సినిమా\ చేయబోతున్నాడని.. ధ్రువ్ అందులో అతిథి పాత్ర చేస్తాడని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ రోజు దానిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందించబోతున్నాడు. ప్రస్తుతం కార్తీక్.. ధనుష్ హీరోగా తీసిన జగమే తంత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
థియేటర్లు పునఃప్రారంభం కాగానే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. త్వరలోనే విక్రమ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. విక్రమ్ కోబ్రా, మహావీర్ కర్ణ, పొన్నియన్ సెల్వన్ లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. విక్రమ్, ధ్రువ్ కాంబినేషన్లో సినిమాను ఇంత త్వరగా చూస్తామని అభిమానులు ఊహించి ఉండరు. ప్రి లుక్ పోస్టర్ను బట్టి చూస్తే ఇది పక్కా యాక్షన్ మూవీ అని అర్థమవుతోంది.
This post was last modified on June 8, 2020 10:20 pm
జనవరిలో మూడు వందల కోట్ల వసూళ్లతో సునామిలా విరుచుకుపడి ఇండస్ట్రీ హిట్ సాధించిన సంక్రాంతికి వస్తున్నాం సంచలనాలు ఇక్కడితో ఆగిపోవడం…
ఆగస్ట్ 14 మీద ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజీ మల్టీస్టారర్ వార్…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో ఇండస్ట్రీకి వచ్చిన రోషన్ డెబ్యూ చేశాక నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. 2021 తర్వాత…
వన్ మూవీ వండర్ లాగా ఎప్పుడో దశాబ్దం క్రితం బిచ్చగాడుతో బ్లాక్ బస్టర్ సాధించిన విజయ్ ఆంటోనీ పాతిక సినిమాలు…
ఒకప్పటి హీరో ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీలో ఎంత ప్రతిభ ఉన్నా ఆ మధ్య రాజకీయాల వైపు వెళ్లిపోవడంతో ఇండస్ట్రీకి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఒక్కసారి మాటిచ్చారా? ఇక ఆ పని అయిపోయినట్టే. వాయిదా…