ఒక సూపర్ స్టార్ హీరో తనయుడు హీరోగా అరంగేట్రం చేశాడంటే.. ఇక అతను తండ్రితో కలిసి ఎప్పుడు నటిస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తారు. టాలీవుడ్ విషయానికి వస్తే నిన్నటి తరంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వాళ్ల కొడుకులతో కలిసి నటించారు. తర్వాతి తరంలో చిరంజీవి రామ్ చరణ్ నటించిన రెండు సినిమాల్లో క్యామియో రోల్స్ చేశాడు.
ఆచార్యలో ఇద్దరూ కలిసి నటిస్తారని అంటున్నారు. ఇక నాగార్జున మనం సినిమాలో తన కొడుకులిద్దరితో కలిసి నటించాడు. ఇప్పుడు కోలీవుడ్లో ఓ సూపర్ స్టార్ కొడుకుతో కలిసి నటించబోతున్నాడు. ఆ తండ్రీ కొడుకులు.. విక్రమ్, ధ్రువ్. అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో ధ్రువ్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పర్వాలేదనిపించింది. ఇంకా అతడి రెండో సినిమా ఖరారవ్వలేదు.
ఈ లోపే తండ్రితో కలిసి నటించే అవకాశం అందుకున్నాడు ధ్రువ్. వీళ్లిద్దరినీ తెరపై చూపించబోయేది కార్తీక్ సుబ్బరాజ్. అతను విక్రమ్తో ఓ సినిమా\ చేయబోతున్నాడని.. ధ్రువ్ అందులో అతిథి పాత్ర చేస్తాడని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ రోజు దానిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందించబోతున్నాడు. ప్రస్తుతం కార్తీక్.. ధనుష్ హీరోగా తీసిన జగమే తంత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
థియేటర్లు పునఃప్రారంభం కాగానే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. త్వరలోనే విక్రమ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. విక్రమ్ కోబ్రా, మహావీర్ కర్ణ, పొన్నియన్ సెల్వన్ లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. విక్రమ్, ధ్రువ్ కాంబినేషన్లో సినిమాను ఇంత త్వరగా చూస్తామని అభిమానులు ఊహించి ఉండరు. ప్రి లుక్ పోస్టర్ను బట్టి చూస్తే ఇది పక్కా యాక్షన్ మూవీ అని అర్థమవుతోంది.
This post was last modified on June 8, 2020 10:20 pm
పార్టీ కోసం కష్ట పడే వారికే పదవులు దక్కుతాయి. పార్టీని నమ్ముకున్నవారికి ఎన్నటికీ అన్యాయం జరగదు. ఈ మాటలు టీడీపీ…
తెలంగాణలో అధికార కాంగ్రెస్ తన ఖాతాలోని మూడు ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను ఆదివారం సాయంత్రం ప్రకటించింది. అంతా అనుకున్నట్లుగా పార్టీ…
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(శ్రీశైలం కుడి కాల్వ) టన్నెల్లో గత నెల 22న జరిగిన ప్రమాదంలో చిక్కుకు పోయిన.. ఆరుగురు…
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ మహిళలకు మరింత భద్రత లభించింది. ఈ మేరకు ఏపీలోని కూటమి సర్కారు నేతృత్వంలోని…
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో మొత్తం 5 స్థానాలు…
రాష్ట్రంలో మహిళా ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. నగరాలు, పట్టణాలే కాదు.. గ్రామీణ స్థాయిలోనూ మహిళల ఓటు…