Movie News

‘నాయట్టు’ రీమేక్ ఆగిపోయినట్లే..!

ఈ మధ్యకాలంలో మలయాళంలో హిట్ అయిన చాలా సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వెంకటేష్ నటించిన ‘దృశ్యం 2’, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాలు మలయాళ సినిమాలకు రీమేక్ లనే సంగతి తెలిసిందే. రీసెంట్ గా ‘నాయట్టు’ అనే మరో మలయాళ సినిమా రీమేక్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

ప్రియదర్శి, అంజలి ప్రధాన పాత్రల్లో కరుణకుమార్ దర్శకుడిగా ఈ సినిమా పూజాకార్యక్రమాలు నిర్వహించారు. గీతాఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించాలనుకుంది. ఇక రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టే సమయానికి సినిమాకి బ్రేకులు పడ్డాయట. రీమేక్ రైట్స్ విషయంలో గీతాఆర్ట్స్ కి, మలయాళ నిర్మాతలకు మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయని.. అందుకే ‘నాయట్టు’ రీమేక్ కి పక్కన పెట్టేశారని సమాచారం.

ఇప్పటికే దర్శకుడు కరుణకుమార్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చి.. మరో సినిమా కోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ రీమేక్ రైట్స్ కి సంబంధించిన ఇష్యూని పరిష్కరించుకున్నా.. ఫ్యూచర్ లో ఈ సినిమా మొదలయ్యే ఛాన్స్ లేదని.. గీతాఆర్ట్స్ ఈ సినిమా చేయడానికి ఇక ఆసక్తి చూపించడం లేదని సమాచారం.

రీమేక్ హక్కులు చేతులు మారితే గనుక అప్పుడు సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు చాలా మంది గీతాఆర్ట్స్ ని అప్రిషియేట్ చేశారు. మంచి కాన్సెప్ట్ ఉన్న కథను తెలుగులోకి తీసుకొస్తున్నారని పొగిడారు. మరిప్పుడు ఈ రీమేక్ సంగతేంటో..!

This post was last modified on December 14, 2021 10:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

2 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

3 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

4 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

4 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

5 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

6 hours ago