ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు వ్యవహారంపై చాలాకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు కుదేలైన సినీ రంగంపై టికెట్ల ధరల తగ్గింపు ప్రభావం తీవ్రంగా ఉంటుందని పలువురు సినీ ప్రముఖులు చెప్పినా…ఏపీ ప్రభుత్వం మాత్రం రేట్లను తగ్గిస్తూ ఇటీవలే జీవో నం.35ను జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆ జీవోను సవాల్ చేస్తూ సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు థియేటర్ల యాజమాన్యాలు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు…ఆ జీవోను కొట్టివేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. కొత్త సినిమాల విడుదల సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ యాజమాన్యాలకు ఉంటుందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. టికెట్ ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని వాదనలు వినిపించారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసింది. అంతేకాదు, పాత విధానంలోనే టికెట్ల రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటును థియేటర్ల యజమానులకు కల్పించింది. దీంతో ఇక పై ఏపీలోని సినిమా థియేటర్లలో టికెట్లకున్న పాత రేట్లే అమల్లోకి వస్తాయి. కాగా పుష్ప, RRR సినిమాల విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలపై ఆంక్షలు, టికెట్ రేట్ల తగ్గింపు వ్యవహారంపై ఏపీ ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీకి మధ్య చర్చలు జరుగుతున్నాయి.
ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతలు, దర్శకులు, సినీ పెద్దలు పలుమార్లు చర్చలు జరిపారు. అయితే, ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని సమర్థిస్తున్న సినీ ఇండస్ట్రీ…రేట్ల తగ్గింపుపై మాత్రం పెదవి విరుస్తూనే వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా హైకోర్టు ఉత్తర్వులతో సినీ పరిశ్రమకు ఊరట లభించినట్లయింది.
This post was last modified on December 14, 2021 5:56 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…