అల్లు అర్జున్, సుకుమార్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం ఇంకో మూడు రోజుల్లోనే థియేటర్లలోకి దిగబోతోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ఆలస్యం కావడం వల్ల వివిధ భాషల్లో ఆఫ్ లైన్ ప్రమోషన్లు పెద్దగా చేయడానికి చిత్ర బృందానికి అవకాశం లేకపోయింది. ఇప్పటిదాకా ఆన్ లైన్ ప్రమోషన్లతోనే హోరెత్తిస్తూ వచ్చారు. ఇప్పుడు రిలీజ్ ముంగిట హీరో బన్నీ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాడు.
తెలుగులో ప్రి రిలీజ్ ఈవెంట్ ముగించుకుని అతను చెన్నైలో అడుగు పెట్టాడు. ఈ ఈవెంట్లో బన్నీ పూర్తిగా తమిళంలో, చాలా స్పష్టంగా మాట్లాడి అక్కడి వారిని ఆకట్టుకున్నాడు. యుక్త వయసు వచ్చే వరకు బన్నీ తమిళనాడులోనే పెరిగిన నేపథ్యంలో అతడికి తమిళం రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ మరీ ఇంత స్పష్టంగా అతను తమిళం మాట్లాడగలడని ఎవరూ అనుకోలేదు. అక్కడి మీడియా వాళ్లు కూడా అతను నేటివ్ తమిళియన్ తరహాలో అనర్గళంగా తమిళంలో మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారు.
ఇక తన మూలాలు తమిళనాడులోనే ఉన్నాయని చెబుతూ.. తాను తమిళుడినే అని బన్నీ వ్యాఖ్యానించడం విశేషం. తాను పుట్టింది మద్రాస్లో అని, 20 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇక్కడే ఉన్నానని అతను గుర్తు చేసుకున్నాడు. స్కూల్లో తనతో కలిసి చదువుకున్న బెస్ట్ ఫ్రెండ్స్, తనకు చదువు చెప్పిన గురువులు అంతా ఇక్కడే ఉన్నారని.. ఇక్కడ తన సినిమా బాగా ఆడితే చూడాలన్నది తన కల అని అతను వివరించాడు. తన చిత్రాలు నార్త్ ఇండియాలో అనువాదమై చాలా బాగా ఆడాయని, యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న తొలి రెండు చిత్రాలు తనవే అని.. ఐతే ఉత్తరాదిన ఎంత ఫాలోయింగ్ సంపాదించుకున్నప్పటికీ.. తాను పుట్టి పెరిగిన తమిళనాడులో తన సినిమా బాగా ఆడాలన్నది తన కోరిక అని చెప్పాడు.
ఐతే ఏదో ఒక సినిమాతో తమిళంలో అడుగు పెట్టకూడదన్న ఉద్దేశంతో, సరైన సినిమాతోనే రావాలని ఇంత కాలం ఆగానని.. ‘పుష్ప’ కచ్చితంగా ఇక్కడి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యే సినిమా అని అతనన్నాడు. మామూలుగా నాలుగు చిత్రాలకు పడే కష్టం ఈ ఒక్క సినిమాకు పడ్డామని.. తిరుపతిలో ఎర్రచందనం చుట్టూ తిరిగే కథ కావడంతో తమిళ ప్రేక్షకులు ఈ సినిమాతో రిలేటవుతారని.. తమిళ వెర్షన్ రచయిత, లిరిసిస్ట్ మదన్ కార్కీ కారణంగా మరింత ఎఫెక్టివ్గా తయారైందని, లైకా వాళ్లు పెద్ద ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారని, కచ్చితంగా ఈ చిత్రం ఇక్కడ పెద్ద హిట్టవుతుందని బన్నీ ధీమా వ్యక్తం చేశాడు.
ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…