అక్కినేని నాగచైతన్య లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయాడు. కొంచెం ఫ్యామిలీ టచ్ ఇచ్చాన ఓకే కానీ.. లవ్ స్టోరీలను కాదని వేరే ఏ జానర్ ట్రై చేసినా అతడికి వర్కవుట్ కావట్లేదు. తాను కూడా యాక్షన్ హీరోగా గుర్తింపు సంపాదించి మాస్లో ఫాలోయింగ్ పెంచుకోవాలని, మార్కెట్ను విస్తరించాలని ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ.. ప్రతిసారీ చేదు అనుభవమే ఎదురైంది.
చైతూను కంఫర్ట్ జోన్ నుంచి బయటికి లాగాలని చూసిన దర్శకులందరూ ఫెయిలయ్యారు. ఐతే చైతూకు ‘మనం’ లాంటి మరపురాని సినిమాను అందించిన విక్రమ్ కుమార్.. ఈసారి అతణ్ని కొత్త రూట్లోకి తీసుకెళ్తున్నాడని.. తన ఫస్ట్ హిట్ ‘13 బి’ సీక్వెల్ను చైతూతో చేయబోతున్నాడని.. చైతూ కూడా విక్రమ్ను నమ్మి మరోసారి రిస్క్ చేయడానికి రెడీ అయిపోయాడని వార్తలొచ్చాయి.
ఐతే ఈ ప్రచారం నిజం కాదని తేలిపోయింది. చైతూతో తాను చేయబోయే సినిమా ‘13 బి’కి సీక్వెల్ కాదని.. అదసలు హార్రర్ థ్రిల్లర్ ఎంతమాత్రం కాదని ఓ ఇటర్వ్యూలో స్పష్టత ఇచ్చాడు విక్రమ్. చైతూతో తాను ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నానని.. ఇందులో లవ్ స్టోరీ కూడా ఉంటుందని ఆయన వెల్లడించాడు. అంటే చైతూ మళ్లీ ఎప్పట్లాగే తన కంఫర్ట్ జోన్కే పరిమితం అవుతున్నాడన్నమాట.
‘మనం’ తర్వాత తనపై అంచనాల్ని భారీగా పెంచేసిన విక్రమ్.. హలో, గ్యాంగ్ లీడర్ చిత్రాలతో ఆ అంచనాల్ని అందుకోలేకపోయాడు. అతడికి హిట్ చాలా అవసరం. చైతూ మధ్యలో ఎదురు దెబ్బలు తిన్నా.. ‘మజిలీ’తో కోలుకున్నాడు. ప్రస్తుతం అతను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరి’ చేస్తున్నాడు.
లాక్ డౌన్ తర్వాత ఆ చిత్రాన్ని పూర్తి చేసి.. వెంటనే విక్రమ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తాడు.
This post was last modified on June 8, 2020 4:58 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…