అక్కినేని నాగచైతన్య లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయాడు. కొంచెం ఫ్యామిలీ టచ్ ఇచ్చాన ఓకే కానీ.. లవ్ స్టోరీలను కాదని వేరే ఏ జానర్ ట్రై చేసినా అతడికి వర్కవుట్ కావట్లేదు. తాను కూడా యాక్షన్ హీరోగా గుర్తింపు సంపాదించి మాస్లో ఫాలోయింగ్ పెంచుకోవాలని, మార్కెట్ను విస్తరించాలని ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ.. ప్రతిసారీ చేదు అనుభవమే ఎదురైంది.
చైతూను కంఫర్ట్ జోన్ నుంచి బయటికి లాగాలని చూసిన దర్శకులందరూ ఫెయిలయ్యారు. ఐతే చైతూకు ‘మనం’ లాంటి మరపురాని సినిమాను అందించిన విక్రమ్ కుమార్.. ఈసారి అతణ్ని కొత్త రూట్లోకి తీసుకెళ్తున్నాడని.. తన ఫస్ట్ హిట్ ‘13 బి’ సీక్వెల్ను చైతూతో చేయబోతున్నాడని.. చైతూ కూడా విక్రమ్ను నమ్మి మరోసారి రిస్క్ చేయడానికి రెడీ అయిపోయాడని వార్తలొచ్చాయి.
ఐతే ఈ ప్రచారం నిజం కాదని తేలిపోయింది. చైతూతో తాను చేయబోయే సినిమా ‘13 బి’కి సీక్వెల్ కాదని.. అదసలు హార్రర్ థ్రిల్లర్ ఎంతమాత్రం కాదని ఓ ఇటర్వ్యూలో స్పష్టత ఇచ్చాడు విక్రమ్. చైతూతో తాను ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నానని.. ఇందులో లవ్ స్టోరీ కూడా ఉంటుందని ఆయన వెల్లడించాడు. అంటే చైతూ మళ్లీ ఎప్పట్లాగే తన కంఫర్ట్ జోన్కే పరిమితం అవుతున్నాడన్నమాట.
‘మనం’ తర్వాత తనపై అంచనాల్ని భారీగా పెంచేసిన విక్రమ్.. హలో, గ్యాంగ్ లీడర్ చిత్రాలతో ఆ అంచనాల్ని అందుకోలేకపోయాడు. అతడికి హిట్ చాలా అవసరం. చైతూ మధ్యలో ఎదురు దెబ్బలు తిన్నా.. ‘మజిలీ’తో కోలుకున్నాడు. ప్రస్తుతం అతను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరి’ చేస్తున్నాడు.
లాక్ డౌన్ తర్వాత ఆ చిత్రాన్ని పూర్తి చేసి.. వెంటనే విక్రమ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తాడు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…