అక్కినేని నాగచైతన్య లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయాడు. కొంచెం ఫ్యామిలీ టచ్ ఇచ్చాన ఓకే కానీ.. లవ్ స్టోరీలను కాదని వేరే ఏ జానర్ ట్రై చేసినా అతడికి వర్కవుట్ కావట్లేదు. తాను కూడా యాక్షన్ హీరోగా గుర్తింపు సంపాదించి మాస్లో ఫాలోయింగ్ పెంచుకోవాలని, మార్కెట్ను విస్తరించాలని ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ.. ప్రతిసారీ చేదు అనుభవమే ఎదురైంది.
చైతూను కంఫర్ట్ జోన్ నుంచి బయటికి లాగాలని చూసిన దర్శకులందరూ ఫెయిలయ్యారు. ఐతే చైతూకు ‘మనం’ లాంటి మరపురాని సినిమాను అందించిన విక్రమ్ కుమార్.. ఈసారి అతణ్ని కొత్త రూట్లోకి తీసుకెళ్తున్నాడని.. తన ఫస్ట్ హిట్ ‘13 బి’ సీక్వెల్ను చైతూతో చేయబోతున్నాడని.. చైతూ కూడా విక్రమ్ను నమ్మి మరోసారి రిస్క్ చేయడానికి రెడీ అయిపోయాడని వార్తలొచ్చాయి.
ఐతే ఈ ప్రచారం నిజం కాదని తేలిపోయింది. చైతూతో తాను చేయబోయే సినిమా ‘13 బి’కి సీక్వెల్ కాదని.. అదసలు హార్రర్ థ్రిల్లర్ ఎంతమాత్రం కాదని ఓ ఇటర్వ్యూలో స్పష్టత ఇచ్చాడు విక్రమ్. చైతూతో తాను ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నానని.. ఇందులో లవ్ స్టోరీ కూడా ఉంటుందని ఆయన వెల్లడించాడు. అంటే చైతూ మళ్లీ ఎప్పట్లాగే తన కంఫర్ట్ జోన్కే పరిమితం అవుతున్నాడన్నమాట.
‘మనం’ తర్వాత తనపై అంచనాల్ని భారీగా పెంచేసిన విక్రమ్.. హలో, గ్యాంగ్ లీడర్ చిత్రాలతో ఆ అంచనాల్ని అందుకోలేకపోయాడు. అతడికి హిట్ చాలా అవసరం. చైతూ మధ్యలో ఎదురు దెబ్బలు తిన్నా.. ‘మజిలీ’తో కోలుకున్నాడు. ప్రస్తుతం అతను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరి’ చేస్తున్నాడు.
లాక్ డౌన్ తర్వాత ఆ చిత్రాన్ని పూర్తి చేసి.. వెంటనే విక్రమ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తాడు.
This post was last modified on June 8, 2020 4:58 pm
భారీ అంచనాల మధ్య ఓ పెద్ద హీరో సినిమా రిలీజైందంటే బాక్సాఫీస్ దగ్గర ఉండే సందడే వేరు. ఐతే ఈ…
గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చాలా ఏళ్ల నుంచి అమ్మాయిలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి అలుపెరగని పోరాటం చేస్తున్న…
వివాదాస్పద ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ విచారణలో చేయి చేసుకున్నారన్న…
అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్…
వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో…
``సనాతన ధర్మ బోర్డును సాధ్యమైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.`` తాజాగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి…