కరోనా కారణంగా వెలవెలబోయిన థియేటర్లు సెకెండ్ వేవ్ తర్వాత తెరుచుకున్నాయి. అయితే ప్రేక్షకులు ఆశించిన స్థాయి సినిమా మాత్రం వెంటనే దొరకలేదు. అఖండ వచ్చాకే మాస్ జాతర మొదలైంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలుకొట్టింది. రిలీజై పది రోజులయ్యాక కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్తో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఓవర్సీస్లో సైతం దూకుడు చూపిస్తోంది. ఈమధ్య కాలంలో ఈ రేంజ్లో ఆడిన తెలుగు సినిమా మరొకటి లేదంటూ ఒకటే ప్రశంసలు.
మరి ఇన్ని రికార్డులు సృష్టించిన సినిమాపై బాలీవుడ్ వారి కన్ను పడకుండా ఉంటుందా? ఓ మాదిరి సినిమాలనే పట్టుకుపోయి రీమేక్ చేస్తున్న బీటౌన్ ఫిల్మ్ మేకర్స్ అఖండను మాత్రం వదులుతారా? అందుకే రిలీజైన మూడు నాలుగు రోజులకే హిందీ రీమేక్ టాపిక్ తెరపైకొచ్చింది. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం బేరాలు నడుస్తున్నాయని, పెద్ద పెద్ద సంస్థలన్నీ పోటీ పడుతున్నాయని అన్నారు. ఎట్టకేలకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రైట్స్ చేజిక్కించుకుందని టాక్.
ఈ విషయాన్ని ఇంకా ఎవరూ అఫీషియల్గా అనౌన్స్ చేయకముందే హిందీలో బాలయ్య పాత్రని ఎవరు చేస్తే బాగుంటుంది అనే చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. అజయ్ దేవగన్ కానీ అక్షయ్ కుమార్ కానీ అయితేనే సూపర్గా ఉంటుందనే కంక్లూజన్కి వచ్చారంతా. మాస్ మూవీ కాబట్టి అజయ్ కంటే అక్షయ్ అయితే బెటరని ఎక్కువమంది ఫీలవుతున్నారు. వారిలో ఒకరు ఈ సినిమా చేస్తున్నారని కూడా కన్ఫర్మ్ చేసేస్తున్నారు కొందరు.
ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలీదు కానీ ఇంత బజ్ రావడం చూస్తుంటే అఖండ ఏ రేంజ్లో విజయం సాధించిందనేది మాత్రం అర్థమవుతోంది. బోయపాటి డైరెక్షన్లో బాలకృష్ణ చేసిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందుకే అఖండ కూడా సక్సెస్ అవుతుందని మొదట్నుంచీ నమ్మారంతా. అయితే ఈ రేంజ్ సక్సెస్ని మాత్రం ఊహించలేదు. మొత్తానికి బాలయ్య ఒక్క దెబ్బతో నార్త్ వారిని కూడా తనవైపు తిప్పేసుకున్నాడు.
This post was last modified on December 12, 2021 6:28 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…