కరోనా కారణంగా వెలవెలబోయిన థియేటర్లు సెకెండ్ వేవ్ తర్వాత తెరుచుకున్నాయి. అయితే ప్రేక్షకులు ఆశించిన స్థాయి సినిమా మాత్రం వెంటనే దొరకలేదు. అఖండ వచ్చాకే మాస్ జాతర మొదలైంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలుకొట్టింది. రిలీజై పది రోజులయ్యాక కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్తో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఓవర్సీస్లో సైతం దూకుడు చూపిస్తోంది. ఈమధ్య కాలంలో ఈ రేంజ్లో ఆడిన తెలుగు సినిమా మరొకటి లేదంటూ ఒకటే ప్రశంసలు.
మరి ఇన్ని రికార్డులు సృష్టించిన సినిమాపై బాలీవుడ్ వారి కన్ను పడకుండా ఉంటుందా? ఓ మాదిరి సినిమాలనే పట్టుకుపోయి రీమేక్ చేస్తున్న బీటౌన్ ఫిల్మ్ మేకర్స్ అఖండను మాత్రం వదులుతారా? అందుకే రిలీజైన మూడు నాలుగు రోజులకే హిందీ రీమేక్ టాపిక్ తెరపైకొచ్చింది. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం బేరాలు నడుస్తున్నాయని, పెద్ద పెద్ద సంస్థలన్నీ పోటీ పడుతున్నాయని అన్నారు. ఎట్టకేలకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రైట్స్ చేజిక్కించుకుందని టాక్.
ఈ విషయాన్ని ఇంకా ఎవరూ అఫీషియల్గా అనౌన్స్ చేయకముందే హిందీలో బాలయ్య పాత్రని ఎవరు చేస్తే బాగుంటుంది అనే చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. అజయ్ దేవగన్ కానీ అక్షయ్ కుమార్ కానీ అయితేనే సూపర్గా ఉంటుందనే కంక్లూజన్కి వచ్చారంతా. మాస్ మూవీ కాబట్టి అజయ్ కంటే అక్షయ్ అయితే బెటరని ఎక్కువమంది ఫీలవుతున్నారు. వారిలో ఒకరు ఈ సినిమా చేస్తున్నారని కూడా కన్ఫర్మ్ చేసేస్తున్నారు కొందరు.
ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలీదు కానీ ఇంత బజ్ రావడం చూస్తుంటే అఖండ ఏ రేంజ్లో విజయం సాధించిందనేది మాత్రం అర్థమవుతోంది. బోయపాటి డైరెక్షన్లో బాలకృష్ణ చేసిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందుకే అఖండ కూడా సక్సెస్ అవుతుందని మొదట్నుంచీ నమ్మారంతా. అయితే ఈ రేంజ్ సక్సెస్ని మాత్రం ఊహించలేదు. మొత్తానికి బాలయ్య ఒక్క దెబ్బతో నార్త్ వారిని కూడా తనవైపు తిప్పేసుకున్నాడు.
This post was last modified on December 12, 2021 6:28 pm
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…
అమెరికా ఇటీవల భారత్కు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో పంపిన నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్…
ఇదిగో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే..అదుగో ప్లాంట్ మూసేస్తున్నారు అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏకంగా…
వైసీపీ అధినేత జగన్ నివాసం కమ్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్యాలస్కు గుర్తు తెలియని…
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాపై విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. కానీ…
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు సీఈవో నారా భువనేశ్వరి.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మ్యూజికల్…