‘మహానటి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన నటి కీర్తి సురేష్. ఈ సినిమా తర్వాత ఆమె వరుసగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. అందులో ఒకటి.. పెంగ్విన్. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణంలో ఈశ్వర్ కార్తీక్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రమిది. ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా అమేజాన్ ప్రైమ్లో ఈ నెల 19న విడుదల చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో వివిధ భాషల్లో నలుగురు కథానాయికలు (సమంత, మంజు వారియర్, తాప్సి, త్రిష) ఈ చిత్ర టీజర్ను సోమవారం లాంచ్ చేశారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్కు తగ్గట్లే టీజర్ కూడా ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది హింట్ ఇచ్చింది. ఇది మాతృత్వం మీద నడిచే కథ. ఒక తల్లి తన బిడ్డ కోసం పడే ఆరాటం నేపథ్యంలో కథ నడుస్తుందన్న సంకేతాలు టీజర్ ఇచ్చింది.
కథ మరీ ఎక్కువేమీ రివీల్ చేయకుండా హీరోయిన్ బిడ్డ కోసం తపించే తీరును కొన్ని విజువల్స్ ద్వారా చూపించారు. ప్రతి వ్యక్తి కథ వెనుక ఓ అమ్మ కథ ఉంటుందని.. ఎందుకంటే అందరి కథ అక్కడి నుంచే మొదలవుతుందని చెప్పడం ద్వారా ఈ కథ ఉద్దేశమేంటో కూడా చెప్పే ప్రయత్నం జరిగింది. టీజర్ రెండో అర్ధంలో ఒక క్రిమినల్ ముఖానికి చార్లీ చాప్లిన్ మాస్కు తగిలించుకుని ఒక వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేసే దృశ్యం చూపించారు.
దీన్ని బట్టి సినిమాలో క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉంటుందని.. ఉత్కంఠ రేకెత్తిస్తుందని స్పష్టమవుతోంది. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఇతర టెక్నికల్ అంశాలన్నీ హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాల్ని తలపిస్తున్నాయి. కీర్తిలోని నటికి మంచి అవకాశమిచ్చే సినిమాలాగే కనిపిస్తోంది ‘పెంగ్విన్’. టీజర్లో ఆమె తప్ప మరో నటుడి ముఖం చూపించలేదు.
ఈ నెల 11న ‘పెంగ్విన్’ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. జ్యోతిక నటించిన ‘పొన్ మగల్ వందాల్’ తుస్సుమనిపించిన నేపథ్యంలో డైరెక్ట్ ఓటీటీలో రిలీజవుతున్న ఈ సినిమా అయినా మంచి ఫలితాన్నందుకుంటుందుేమో చూడాలి.
This post was last modified on June 8, 2020 4:41 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…