‘బాహుబలి’ లాంటి సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న మరో విజువల్ వండర్ ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. మిలియన్లలో వ్యూస్ సంపాదిస్తూ.. యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది ఈ ట్రైలర్. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఓ రేంజ్ లో చూపించారు. ఎన్టీఆర్-పులి షాట్ ట్రైలర్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది.
ఈ సినిమాను థియేటర్లో చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 7న సినిమాను విడుదల చేస్తుండడంతో దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే సినిమాలో పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. దానికోసం వరంగల్ సిటీను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో వరంగల్ సిటీకి సంబంధించి ఒక ఎలిమెంట్ ఉంటుందని.. అందుకే అక్కడే ఈవెంట్ ని నిర్వహిస్తున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి.
రియల్ లైఫ్ లో అయితే అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ డిఫరెంట్ టైం జోన్స్ లో కొంతకాలం వరంగల్ లో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. అందుకేనేమో.. రాజమౌళి కూడా వరంగల్ లో ఈవెంట్ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ నుంచి కొందరు గెస్ట్ లుగా హాజరు కాబోతున్నారు.
This post was last modified on December 11, 2021 4:21 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…