‘బాహుబలి’ లాంటి సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న మరో విజువల్ వండర్ ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. మిలియన్లలో వ్యూస్ సంపాదిస్తూ.. యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది ఈ ట్రైలర్. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఓ రేంజ్ లో చూపించారు. ఎన్టీఆర్-పులి షాట్ ట్రైలర్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది.
ఈ సినిమాను థియేటర్లో చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 7న సినిమాను విడుదల చేస్తుండడంతో దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే సినిమాలో పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. దానికోసం వరంగల్ సిటీను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో వరంగల్ సిటీకి సంబంధించి ఒక ఎలిమెంట్ ఉంటుందని.. అందుకే అక్కడే ఈవెంట్ ని నిర్వహిస్తున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి.
రియల్ లైఫ్ లో అయితే అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ డిఫరెంట్ టైం జోన్స్ లో కొంతకాలం వరంగల్ లో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. అందుకేనేమో.. రాజమౌళి కూడా వరంగల్ లో ఈవెంట్ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ నుంచి కొందరు గెస్ట్ లుగా హాజరు కాబోతున్నారు.
This post was last modified on December 11, 2021 4:21 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…