తమిళ దర్శకులు తెలుగు హీరోలతో తెలుగులో సినిమాలు చేయడం మామూలే. మణిరత్నం మొదలుకుని మురుగదాస్ వరకు చాలామంది తమిళ స్టార్ డైరెక్టర్లు తెలుగులో సినిమాలు చేశారు. కానీ తెలుగు దర్శకులు తమిళంలో సినిమాలు చేసిన దాఖలాలు దాదాపు కనిపించవు. అక్కడి హీరోలూ ఇటు వైపు చూడరు. ఇక్కడి దర్శకులు అటు వైపు కన్నేయరు.
ఐతే ధనుష్ లాంటి పెద్ద హీరో మన తెలుగు దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అయితే.. అతను అంగీకరించలేదట. ఈ ఆఫర్ను తిరస్కరించిన దర్శకుడు మరెవరో కాదు.. నీదీ నాదీ ఒకే కథ సినిమాతో పరిచయమైన వేణు ఉడుగుల. అతడి తొలి సినిమానే తమిళంలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి.
సీనియర్ నిర్మాత కలైపులి ఎస్.థాను ధనుష్ హీరోగా నీదీ నాదీ ఒకే కథ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకున్నారు. ఐతే ఈ సినిమా విషయంలో ధనుష్ ఓ కండిషన్ పెట్టాడట. ఒరిజినల్ తీసిన దర్శకుడైతేనే చేస్తానని అన్నాడట. ఈ సినిమా కోసం వేణును అడిగితే.. అతను కుదరదనేశాడట. దీని గురించి వేణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
నీదీ నాదీ ఒకే కథ సినిమా చేయడానికి తనకు మూడేళ్ల సమయం పట్టిందని.. రీమేక్ కోసం మళ్లీ ఒకట్రెండేళ్లు పెట్టాలనిపించలేదని.. అప్పటికే విరాట పర్వం కథ తన మెదడులో తిరుగుతుండటంతో తెలుగులోనే రెండో సినిమా చేయాలని ఫిక్సయ్యానని.. అందుకే ధనుష్తో నీదీ నాదీ ఒకే కథ రీమేక్ చేయడానికి అంగీకరించలేదని చెప్పాడు వేణు.
విరాట పర్వం సినిమా కోసం ముందు తమిళ కథానాయకుడు కార్తిని అనుకున్నానని.. కానీ అతణ్ని సంప్రదించకుండా రానాను అడగడం.. అతను వెంటనే ఓకే చెప్పడంతో సినిమా పట్టాలెక్కడం జరిగాయని వేణు తెలిపాడు.
This post was last modified on June 8, 2020 3:00 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…