తమిళ దర్శకులు తెలుగు హీరోలతో తెలుగులో సినిమాలు చేయడం మామూలే. మణిరత్నం మొదలుకుని మురుగదాస్ వరకు చాలామంది తమిళ స్టార్ డైరెక్టర్లు తెలుగులో సినిమాలు చేశారు. కానీ తెలుగు దర్శకులు తమిళంలో సినిమాలు చేసిన దాఖలాలు దాదాపు కనిపించవు. అక్కడి హీరోలూ ఇటు వైపు చూడరు. ఇక్కడి దర్శకులు అటు వైపు కన్నేయరు.
ఐతే ధనుష్ లాంటి పెద్ద హీరో మన తెలుగు దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అయితే.. అతను అంగీకరించలేదట. ఈ ఆఫర్ను తిరస్కరించిన దర్శకుడు మరెవరో కాదు.. నీదీ నాదీ ఒకే కథ సినిమాతో పరిచయమైన వేణు ఉడుగుల. అతడి తొలి సినిమానే తమిళంలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి.
సీనియర్ నిర్మాత కలైపులి ఎస్.థాను ధనుష్ హీరోగా నీదీ నాదీ ఒకే కథ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకున్నారు. ఐతే ఈ సినిమా విషయంలో ధనుష్ ఓ కండిషన్ పెట్టాడట. ఒరిజినల్ తీసిన దర్శకుడైతేనే చేస్తానని అన్నాడట. ఈ సినిమా కోసం వేణును అడిగితే.. అతను కుదరదనేశాడట. దీని గురించి వేణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
నీదీ నాదీ ఒకే కథ సినిమా చేయడానికి తనకు మూడేళ్ల సమయం పట్టిందని.. రీమేక్ కోసం మళ్లీ ఒకట్రెండేళ్లు పెట్టాలనిపించలేదని.. అప్పటికే విరాట పర్వం కథ తన మెదడులో తిరుగుతుండటంతో తెలుగులోనే రెండో సినిమా చేయాలని ఫిక్సయ్యానని.. అందుకే ధనుష్తో నీదీ నాదీ ఒకే కథ రీమేక్ చేయడానికి అంగీకరించలేదని చెప్పాడు వేణు.
విరాట పర్వం సినిమా కోసం ముందు తమిళ కథానాయకుడు కార్తిని అనుకున్నానని.. కానీ అతణ్ని సంప్రదించకుండా రానాను అడగడం.. అతను వెంటనే ఓకే చెప్పడంతో సినిమా పట్టాలెక్కడం జరిగాయని వేణు తెలిపాడు.
This post was last modified on June 8, 2020 3:00 pm
ఈ నెల 19న జరిగే ఉగాది తర్వాత ఏ క్షణమైనా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన…
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయాలపై జనసేన పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబుకు ఇంకా మక్కువ పోలేదని…
సాధారణంగా జనావాసాలు ఉండే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆయా కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది…
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో…
తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా…
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…