Movie News

ధ‌నుష్‌తో సినిమాను వ‌దులుకున్న తెలుగు ద‌ర్శ‌కుడు

త‌మిళ ద‌ర్శ‌కులు తెలుగు హీరోల‌తో తెలుగులో సినిమాలు చేయ‌డం మామూలే. మ‌ణిర‌త్నం మొద‌లుకుని మురుగ‌దాస్ వ‌ర‌కు చాలామంది త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్లు తెలుగులో సినిమాలు చేశారు. కానీ తెలుగు ద‌ర్శ‌కులు త‌మిళంలో సినిమాలు చేసిన దాఖ‌లాలు దాదాపు క‌నిపించ‌వు. అక్క‌డి హీరోలూ ఇటు వైపు చూడ‌రు. ఇక్క‌డి ద‌ర్శ‌కులు అటు వైపు క‌న్నేయ‌రు.

ఐతే ధ‌నుష్ లాంటి పెద్ద హీరో మ‌న తెలుగు ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌డానికి రెడీ అయితే.. అత‌ను అంగీక‌రించ‌లేద‌ట‌. ఈ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు.. నీదీ నాదీ ఒకే క‌థ సినిమాతో ప‌రిచ‌య‌మైన వేణు ఉడుగుల‌. అత‌డి తొలి సినిమానే త‌మిళంలో రీమేక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి.

సీనియ‌ర్ నిర్మాత క‌లైపులి ఎస్.థాను ధ‌నుష్ హీరోగా నీదీ నాదీ ఒకే క‌థ చిత్రాన్ని రీమేక్ చేయాల‌నుకున్నారు. ఐతే ఈ సినిమా విష‌యంలో ధ‌నుష్ ఓ కండిష‌న్ పెట్టాడ‌ట‌. ఒరిజిన‌ల్ తీసిన ద‌ర్శ‌కుడైతేనే చేస్తాన‌ని అన్నాడ‌ట‌. ఈ సినిమా కోసం వేణును అడిగితే.. అత‌ను కుద‌ర‌ద‌నేశాడ‌ట‌. దీని గురించి వేణు ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు.

నీదీ నాదీ ఒకే క‌థ సినిమా చేయ‌డానికి త‌న‌కు మూడేళ్ల స‌మ‌యం ప‌ట్టింద‌ని.. రీమేక్ కోసం మ‌ళ్లీ ఒక‌ట్రెండేళ్లు పెట్టాల‌నిపించ‌లేద‌ని.. అప్ప‌టికే విరాట ప‌ర్వం క‌థ త‌న మెద‌డులో తిరుగుతుండ‌టంతో తెలుగులోనే రెండో సినిమా చేయాల‌ని ఫిక్స‌య్యాన‌ని.. అందుకే ధ‌నుష్‌తో నీదీ నాదీ ఒకే క‌థ రీమేక్ చేయ‌డానికి అంగీక‌రించ‌లేద‌ని చెప్పాడు వేణు.

విరాట ప‌ర్వం సినిమా కోసం ముందు త‌మిళ క‌థానాయ‌కుడు కార్తిని అనుకున్నాన‌ని.. కానీ అత‌ణ్ని సంప్ర‌దించ‌కుండా రానాను అడ‌గ‌డం.. అత‌ను వెంట‌నే ఓకే చెప్ప‌డంతో సినిమా ప‌ట్టాలెక్క‌డం జ‌రిగాయ‌ని వేణు తెలిపాడు.

This post was last modified on June 8, 2020 3:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago