సెట్స్ మీదికి వెళ్లిన ప్రతి సినిమా పూర్తవుతుందని.. పూర్తయినా విడులవుతుందని చెప్పలేం. ఇలా మధ్యలోనే ఆగిపోయే, విడుదలకు నోచుకోని చిన్న సినిమాలు కోకొల్లలుగా ఉంటాయి. కొన్నిసార్లు పేరున్న హీరోలు నటించిన సినిమాలు సైతం రకరకాల కారణాలతో మరుగున పడిపోతుంటాయి. రానా దగ్గుబాటి కెరీర్లోనూ అలాంటి సినిమా ఒకటుంది.
అదే.. 1945. ‘బాహుబలి’తో మంచి క్రేజ్ తెచ్చుకున్న టైంలో రానా మొదలుపెట్టిన సినిమాల్లో ఇదొకటి. సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాన్ నిర్మాణంలో సత్య శివ అనే కొత్త దర్శకుడితో ఈ చిత్రం మొదలైంది. ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగా వార్తల్లో నిలిచింది. కానీ తర్వాత ఏమైందో ఏమో.. మరుగున పడిపోయింది. సినిమా పూర్తయిందో లేదో కూడా అప్డేట్ లేదు. రిలీజ్ గురించి ఊసే లేదు. ఈ సినిమాను జనాలందరూ పూర్తిగా మరిచిపోయిన టైంలో ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
తాజాగా మీడియాను కలిసిన నిర్మాత సి.కళ్యాణ్.. ‘1945’ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించాడు. అలా అన్న ఒక్క రోజులోనే రిలీజ్ డేట్ పోస్టర్లు బయటికి వచ్చేశాయి. ‘1945’ చిత్రాన్ని డిసెంబరు 31న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా టైటిల్, లేటెస్ట్ పోస్టర్ చూస్తే ఇది స్వాతంత్ర పోరాటం నేపథ్యంలో సాగే సినిమా అని అర్థమవుతోంది. రానా చేతిలో బ్రిటిష్ జెండాకు నిప్పంటించి పట్టుకున్నాడు ఈ పోస్టర్లో.
ఐతే ఇన్నేళ్లుగా వార్తల్లో లేని, జనాలు పూర్తిగా మరిచిపోయిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఉన్నట్లుండి రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారన్నది డౌటు. తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్రాజా మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి ఆకుల శివ మాటలు సమకూర్చాడు. రానా కొత్త చిత్రం ‘విరాట పర్వం’ సైతం చాన్నాళ్ల నుంచి విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఆ చిత్రం ఓటీటీ బాట పడుతున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 10, 2021 9:22 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…