సెట్స్ మీదికి వెళ్లిన ప్రతి సినిమా పూర్తవుతుందని.. పూర్తయినా విడులవుతుందని చెప్పలేం. ఇలా మధ్యలోనే ఆగిపోయే, విడుదలకు నోచుకోని చిన్న సినిమాలు కోకొల్లలుగా ఉంటాయి. కొన్నిసార్లు పేరున్న హీరోలు నటించిన సినిమాలు సైతం రకరకాల కారణాలతో మరుగున పడిపోతుంటాయి. రానా దగ్గుబాటి కెరీర్లోనూ అలాంటి సినిమా ఒకటుంది.
అదే.. 1945. ‘బాహుబలి’తో మంచి క్రేజ్ తెచ్చుకున్న టైంలో రానా మొదలుపెట్టిన సినిమాల్లో ఇదొకటి. సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాన్ నిర్మాణంలో సత్య శివ అనే కొత్త దర్శకుడితో ఈ చిత్రం మొదలైంది. ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగా వార్తల్లో నిలిచింది. కానీ తర్వాత ఏమైందో ఏమో.. మరుగున పడిపోయింది. సినిమా పూర్తయిందో లేదో కూడా అప్డేట్ లేదు. రిలీజ్ గురించి ఊసే లేదు. ఈ సినిమాను జనాలందరూ పూర్తిగా మరిచిపోయిన టైంలో ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
తాజాగా మీడియాను కలిసిన నిర్మాత సి.కళ్యాణ్.. ‘1945’ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించాడు. అలా అన్న ఒక్క రోజులోనే రిలీజ్ డేట్ పోస్టర్లు బయటికి వచ్చేశాయి. ‘1945’ చిత్రాన్ని డిసెంబరు 31న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా టైటిల్, లేటెస్ట్ పోస్టర్ చూస్తే ఇది స్వాతంత్ర పోరాటం నేపథ్యంలో సాగే సినిమా అని అర్థమవుతోంది. రానా చేతిలో బ్రిటిష్ జెండాకు నిప్పంటించి పట్టుకున్నాడు ఈ పోస్టర్లో.
ఐతే ఇన్నేళ్లుగా వార్తల్లో లేని, జనాలు పూర్తిగా మరిచిపోయిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఉన్నట్లుండి రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారన్నది డౌటు. తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్రాజా మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి ఆకుల శివ మాటలు సమకూర్చాడు. రానా కొత్త చిత్రం ‘విరాట పర్వం’ సైతం చాన్నాళ్ల నుంచి విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఆ చిత్రం ఓటీటీ బాట పడుతున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 10, 2021 9:22 am
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…