బాలయ్య అభిమానులెవరూ నందమూరి సింహపై తమకున్న అభిమానాన్ని దాచుకోలేరు. జై బాలయ్య అని మనసారా అనకుండా ఉండలేదు. అదే వారికి తారకమంత్రం.. పాపం.. వైఎస్ఆర్ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఓ విద్యార్థి బాలయ్యపై ఉన్న అభిమానాన్ని దాచుకోలేక తడబడి చివరికి బోర్లాపడ్డాడు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థి, వైసీపీ-టీడీపీ వైరం కూడా మర్చిపోయి ప్రత్యర్థి పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ పేరెత్తాడు. జై బాలయ్యా అంటూ అలవాటులో పొరపాటుగా అనేశాడు. ఇంకేముందు ర్యాలీలో పాల్గొన్న అందరూ బిత్తరపోయారు.
మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నాయకుడు, ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్నిశ్చల్ సూచనలతో హిందూపురంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురువారం హిందూపురంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని విజయవంతం చేసేందుకు వివిధ కళాశాల నుంచి విద్యార్థులను సమీకరించారు. ర్యాలీ ప్రారంభానికి ముందే మూడు రాజధానులు కావాలంటూ నినాదాలు చేయాలని వైసీపీ నాయకులు విద్యార్థులకు సూచించారు.
విద్యార్థుల కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. హిందూపురంలోని చిన్నమార్కెట్ నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదుగా ర్యాలీ సాగింది. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఓ విద్యార్థి మాత్రం వారి మాట కాదని జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో నిర్వాహకులతో పాటు విద్యార్థులు కంగుతిన్నారు. ర్యాలీ చూసినవారు ఆశ్చర్యానికి గురై వైసీపీ చేపట్టిన ర్యాలీలో బాలయ్య నినాదాలు ఏంటని చర్చించుకోవడం హిందూపురంలో హాట్టాపిక్గా మారింది. అంతేకాదు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ర్యాలీ అనంతరం వైసీపీ నాయకులు తహసీల్దార్ కు వినతిపత్రం అందించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి ఎంతో ప్రయోజనమని వైసీపీ నేతలు చెప్పారు.
యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. అమరావతే రాజదానిగా కొనసాగించాలని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర ప్రస్తుతం రాయలసీమలో కొనసాగుతోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. రాయలసీమలో ఈ పాదయాత్రకు పెద్దగా మద్దతు వస్తున్నట్లు కనిపించడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఇక్కడి మేధావుల అభిప్రాయం. అనేక సందర్భాల్లో ఇదే విషయాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on December 10, 2021 11:11 am
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…