2019లో మూడు సినిమాలతో పలకరించాడు నందమూరి బాలకృష్ణ. అందులో ఒకటి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యన్.టి.ఆర్: కథానాయకుడు కాగా.. ఇంకోటి యన్.టి.ఆర్: మహానాయకుడు. మూడోదేమో రూలర్. ‘యన్.టి.ఆర్’ ఫెయిలవడానికి సినిమా కోణంతో పాటు వేరే అంశాలు కూడా ఉన్నాయి.
తెలుగుదేశం ప్రభుత్వం మీద అప్పటికి జనాల్లో ఉన్న వ్యతిరేకత, ఈ బయోపిక్ను తమకు అనుకూలంగా కన్వీనియెంట్గా తీయడం.. రకరకాల కారణాలు తోడై ఆ సినిమాలు రెండూ ఒకదాన్ని మించి ఒకటి ఘోర పరాజయాన్ని చవిచూశాయి. బాలయ్య స్టార్ పవర్ ఎంత మాత్రమూ ఆ సినిమాలకు ఉపయోగపడలేదు. వాటిని పక్కన పెట్టేస్తే ‘రూలర్’ సినిమా అయినా నందమూరి అభిమానులకు ఉపశమనాన్ని అందిస్తుందేమో అనుకుంటే అది కూడా పెద్ద డిజాస్టరే అయింది.
కేవలం 12.5 కోట్ల గ్రాస్, 7.5 కోట్ల షేర్ మాత్రమే వచ్చిందా చిత్రానికి.ఐతే ఇప్పుడు బాలయ్య కొత్త చిత్రం ‘అఖండ’ కేవలం వారం రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఫుల్ రన్లో రూ.60 కోట్ల షేర్ మార్కును కూడా ఈజీగానే అందుకునేలా ఉందీ చిత్రం. ఐతే ‘రూలర్’కు డిజాస్టర్ టాక్ రాగా.. ‘అఖండ’కు కూడా అంత గొప్ప టాక్ ఏమీ రాలేదు. టాక్ పరంగా చూసుకుంటే యావరేజ్ అనే చెప్పాలి. ఐతే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మరీ ఏడున్నర కోట్ల షేర్ రావడం బాలయ్యకు ఒక రకంగా పరాభవంగానే చెప్పాలి.
ఇప్పుడు యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాతో రూ.60 కోట్ల షేర్ మార్కు దిశగా దూసుకెళ్లడం కూడా బాలయ్యకే చెల్లింది. వరుసగా రిలీజైన రెండు చిత్రాలతో ఇంత వైరుధ్యం అనూహ్యమైన విషయం. వేరే స్టార్లతో పోలిస్తే బాలయ్యను భిన్నంగా నిలిపేది ఇదే. వేరే హీరోల సినిమాలకు నెగెటివ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్, ఓ మోస్తరు వసూళ్లు ఉంటాయి. కానీ బాలయ్య చిత్రానికి తేడా వస్తే వాషౌటే. అదే సమయంలో బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొస్తే బాలయ్య ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తాడో చెప్పడానికి ‘అఖండ’ సాక్ష్యంగా నిలుస్తోంది.
ఏపీ రాజధాని అమరావతికి అంత భూమి ఎందుకు? ఇంత భూమి ఎందుకు? ఏం చేసుకుంటారు.? 500 ఎకరాలు చాలవా? వెయ్యి…
ఫాం హౌస్లో కేడీ- ఢిల్లీలో మోడీ.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో అభివృద్ధిని ఆపలేరు అని సీఎం రేవంత్…
ఈ నెల 25 నుంచి టీడీపీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ.. పేరుతో ఓ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు…
రాజమౌళి, మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో రామాయణం నేపథ్యంలో ఒక అరగంట యుద్ధ సన్నివేశాలు ఉంటాయని…
జూన్ 19 మా ఇంటి బంగారం విడుదలకు రెడీ అవుతోంది. శాకుంతలం, ఖుషి తర్వాత సమంతకు బాగా గ్యాప్ వచ్చేసింది.…
ఆ పాఠశాలలో సంప్రదాయ విద్యా విధానం లేదు.. సహచర విద్యార్థుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటారు… ఈ ప్రత్యేకతలు ఉన్న పాఠశాలను…