2019లో మూడు సినిమాలతో పలకరించాడు నందమూరి బాలకృష్ణ. అందులో ఒకటి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యన్.టి.ఆర్: కథానాయకుడు కాగా.. ఇంకోటి యన్.టి.ఆర్: మహానాయకుడు. మూడోదేమో రూలర్. ‘యన్.టి.ఆర్’ ఫెయిలవడానికి సినిమా కోణంతో పాటు వేరే అంశాలు కూడా ఉన్నాయి.
తెలుగుదేశం ప్రభుత్వం మీద అప్పటికి జనాల్లో ఉన్న వ్యతిరేకత, ఈ బయోపిక్ను తమకు అనుకూలంగా కన్వీనియెంట్గా తీయడం.. రకరకాల కారణాలు తోడై ఆ సినిమాలు రెండూ ఒకదాన్ని మించి ఒకటి ఘోర పరాజయాన్ని చవిచూశాయి. బాలయ్య స్టార్ పవర్ ఎంత మాత్రమూ ఆ సినిమాలకు ఉపయోగపడలేదు. వాటిని పక్కన పెట్టేస్తే ‘రూలర్’ సినిమా అయినా నందమూరి అభిమానులకు ఉపశమనాన్ని అందిస్తుందేమో అనుకుంటే అది కూడా పెద్ద డిజాస్టరే అయింది.
కేవలం 12.5 కోట్ల గ్రాస్, 7.5 కోట్ల షేర్ మాత్రమే వచ్చిందా చిత్రానికి.ఐతే ఇప్పుడు బాలయ్య కొత్త చిత్రం ‘అఖండ’ కేవలం వారం రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఫుల్ రన్లో రూ.60 కోట్ల షేర్ మార్కును కూడా ఈజీగానే అందుకునేలా ఉందీ చిత్రం. ఐతే ‘రూలర్’కు డిజాస్టర్ టాక్ రాగా.. ‘అఖండ’కు కూడా అంత గొప్ప టాక్ ఏమీ రాలేదు. టాక్ పరంగా చూసుకుంటే యావరేజ్ అనే చెప్పాలి. ఐతే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మరీ ఏడున్నర కోట్ల షేర్ రావడం బాలయ్యకు ఒక రకంగా పరాభవంగానే చెప్పాలి.
ఇప్పుడు యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాతో రూ.60 కోట్ల షేర్ మార్కు దిశగా దూసుకెళ్లడం కూడా బాలయ్యకే చెల్లింది. వరుసగా రిలీజైన రెండు చిత్రాలతో ఇంత వైరుధ్యం అనూహ్యమైన విషయం. వేరే స్టార్లతో పోలిస్తే బాలయ్యను భిన్నంగా నిలిపేది ఇదే. వేరే హీరోల సినిమాలకు నెగెటివ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్, ఓ మోస్తరు వసూళ్లు ఉంటాయి. కానీ బాలయ్య చిత్రానికి తేడా వస్తే వాషౌటే. అదే సమయంలో బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొస్తే బాలయ్య ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తాడో చెప్పడానికి ‘అఖండ’ సాక్ష్యంగా నిలుస్తోంది.
This post was last modified on December 10, 2021 11:12 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…