2019లో మూడు సినిమాలతో పలకరించాడు నందమూరి బాలకృష్ణ. అందులో ఒకటి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యన్.టి.ఆర్: కథానాయకుడు కాగా.. ఇంకోటి యన్.టి.ఆర్: మహానాయకుడు. మూడోదేమో రూలర్. ‘యన్.టి.ఆర్’ ఫెయిలవడానికి సినిమా కోణంతో పాటు వేరే అంశాలు కూడా ఉన్నాయి.
తెలుగుదేశం ప్రభుత్వం మీద అప్పటికి జనాల్లో ఉన్న వ్యతిరేకత, ఈ బయోపిక్ను తమకు అనుకూలంగా కన్వీనియెంట్గా తీయడం.. రకరకాల కారణాలు తోడై ఆ సినిమాలు రెండూ ఒకదాన్ని మించి ఒకటి ఘోర పరాజయాన్ని చవిచూశాయి. బాలయ్య స్టార్ పవర్ ఎంత మాత్రమూ ఆ సినిమాలకు ఉపయోగపడలేదు. వాటిని పక్కన పెట్టేస్తే ‘రూలర్’ సినిమా అయినా నందమూరి అభిమానులకు ఉపశమనాన్ని అందిస్తుందేమో అనుకుంటే అది కూడా పెద్ద డిజాస్టరే అయింది.
కేవలం 12.5 కోట్ల గ్రాస్, 7.5 కోట్ల షేర్ మాత్రమే వచ్చిందా చిత్రానికి.ఐతే ఇప్పుడు బాలయ్య కొత్త చిత్రం ‘అఖండ’ కేవలం వారం రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఫుల్ రన్లో రూ.60 కోట్ల షేర్ మార్కును కూడా ఈజీగానే అందుకునేలా ఉందీ చిత్రం. ఐతే ‘రూలర్’కు డిజాస్టర్ టాక్ రాగా.. ‘అఖండ’కు కూడా అంత గొప్ప టాక్ ఏమీ రాలేదు. టాక్ పరంగా చూసుకుంటే యావరేజ్ అనే చెప్పాలి. ఐతే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మరీ ఏడున్నర కోట్ల షేర్ రావడం బాలయ్యకు ఒక రకంగా పరాభవంగానే చెప్పాలి.
ఇప్పుడు యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాతో రూ.60 కోట్ల షేర్ మార్కు దిశగా దూసుకెళ్లడం కూడా బాలయ్యకే చెల్లింది. వరుసగా రిలీజైన రెండు చిత్రాలతో ఇంత వైరుధ్యం అనూహ్యమైన విషయం. వేరే స్టార్లతో పోలిస్తే బాలయ్యను భిన్నంగా నిలిపేది ఇదే. వేరే హీరోల సినిమాలకు నెగెటివ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్, ఓ మోస్తరు వసూళ్లు ఉంటాయి. కానీ బాలయ్య చిత్రానికి తేడా వస్తే వాషౌటే. అదే సమయంలో బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొస్తే బాలయ్య ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తాడో చెప్పడానికి ‘అఖండ’ సాక్ష్యంగా నిలుస్తోంది.
This post was last modified on December 10, 2021 11:12 am
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…
రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవిపై మోజులేదు. నేనే చెప్పి ఒప్పించా. వచ్చే ఎన్నికల్లోనే రాహుల్ ను ప్రదానిని చేసేందుకు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఘన విజయం సాధించింది. ఫలితంగా సినిమాల్లో…
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చిపట్టిన, ప్రమాదకరంగా మారిన కుక్కలకు…
తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా కచ్చితంగా ఉంటుంది. లెజెండరీ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు కెరీర్ పీక్స్లో ఉండగా…
ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో సోమవారం ఓ కీలక భేటీ జరిగింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు…