Movie News

ఏదైనా బాలయ్యకే చెల్లు

2019లో మూడు సినిమాలతో పలకరించాడు నందమూరి బాలకృష్ణ. అందులో ఒకటి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యన్.టి.ఆర్: కథానాయకుడు కాగా.. ఇంకోటి యన్.టి.ఆర్: మహానాయకుడు. మూడోదేమో రూలర్. ‘యన్.టి.ఆర్’ ఫెయిలవడానికి సినిమా కోణంతో పాటు వేరే అంశాలు కూడా ఉన్నాయి.

తెలుగుదేశం ప్రభుత్వం మీద అప్పటికి జనాల్లో ఉన్న వ్యతిరేకత, ఈ బయోపిక్‌ను తమకు అనుకూలంగా కన్వీనియెంట్‌గా తీయడం.. రకరకాల కారణాలు తోడై ఆ సినిమాలు రెండూ ఒకదాన్ని మించి ఒకటి ఘోర పరాజయాన్ని చవిచూశాయి. బాలయ్య స్టార్ పవర్ ఎంత మాత్రమూ ఆ సినిమాలకు ఉపయోగపడలేదు. వాటిని పక్కన పెట్టేస్తే ‘రూలర్’ సినిమా అయినా నందమూరి అభిమానులకు ఉపశమనాన్ని అందిస్తుందేమో అనుకుంటే అది కూడా పెద్ద డిజాస్టరే అయింది.

కేవలం 12.5 కోట్ల గ్రాస్, 7.5 కోట్ల షేర్ మాత్రమే వచ్చిందా చిత్రానికి.ఐతే ఇప్పుడు బాలయ్య కొత్త చిత్రం ‘అఖండ’ కేవలం వారం రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఫుల్ రన్లో రూ.60 కోట్ల షేర్ మార్కును కూడా ఈజీగానే అందుకునేలా ఉందీ చిత్రం. ఐతే ‘రూలర్’కు డిజాస్టర్ టాక్ రాగా.. ‘అఖండ’కు కూడా అంత గొప్ప టాక్ ఏమీ రాలేదు. టాక్ పరంగా చూసుకుంటే యావరేజ్ అనే చెప్పాలి. ఐతే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మరీ ఏడున్నర కోట్ల షేర్ రావడం బాలయ్యకు ఒక రకంగా పరాభవంగానే చెప్పాలి.

ఇప్పుడు యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాతో రూ.60 కోట్ల షేర్ మార్కు దిశగా దూసుకెళ్లడం కూడా బాలయ్యకే చెల్లింది. వరుసగా రిలీజైన రెండు చిత్రాలతో ఇంత వైరుధ్యం అనూహ్యమైన విషయం. వేరే స్టార్లతో పోలిస్తే బాలయ్యను భిన్నంగా నిలిపేది ఇదే. వేరే హీరోల సినిమాలకు నెగెటివ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్, ఓ మోస్తరు వసూళ్లు ఉంటాయి. కానీ బాలయ్య చిత్రానికి తేడా వస్తే వాషౌటే. అదే సమయంలో బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొస్తే బాలయ్య ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తాడో చెప్పడానికి ‘అఖండ’ సాక్ష్యంగా నిలుస్తోంది.

This post was last modified on December 10, 2021 11:12 am

Share
Show comments

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

2 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

5 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

6 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

8 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

8 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

9 hours ago