థియేట్రికల్ ట్రైలర్ ప్రధాన ఉద్దేశం.. సినిమా కథేంటో చూచాయిగా చెప్పడం. సినిమాలోని హైలైట్లను చూపించడంతో పాటు కథ మీద ప్రేక్షకుడికి ఒక ఐడియా వచ్చేలా చేస్తుంటారు ఫిలిం మేకర్స్ ట్రైలర్ ద్వారా. కొందరు ఈ సూత్రాన్ని పాటించరు కానీ.. రాజమౌళి మాత్రం దాన్ని పక్కాగా ఫాలో అవుతాడు. జక్కన్న ఏ సినిమా చూసినా.. ట్రైలర్ చూస్తే కథేంటో అర్థమైపోతుంది. కథను దాచి పెట్టి ప్రేక్షకులను భ్రమల్లో ఉంచాలని రాజమౌళి అనుకోడు. ‘ఆర్ఆర్ఆర్’ విషయానికి వస్తే సినిమా ఆరంభ దశలోనే కథ గురించి కొంచెం హింట్ ఇచ్చాడు.
కానీ తర్వాత వచ్చిన ప్రోమోలు కొంత గందరగోళానికి గురి చేశాయి. ఐతే తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్తో జక్కన్న కథ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేశాడనే చెప్పాలి. మొదట్నుంచి ఆరంభం వరకు కథ ఇలా ఉండొచ్చు అనే అంచనాకు వచ్చేలా ట్రైలర్ సాగింది. దీని ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ కథ ఎలా ఉండొచ్చంటే..ముందుగా భారతీయులపై బ్రిటిష్ వారి అరాచకాల్ని చూపించడంతో కథ మొదలవుతుంది.
ఒక గోండు అమ్మాయిని బ్రిటిష్ అధికారి బలవంతంగా తనతో పాటు తీసుకుపోవడంతో ఆ వర్గానికి రక్షకుడిగా ఉన్న భీమ్ (ఎన్టీఆర్) రంగంలోకి దిగుతాడు. బ్రిటిష్ వారిని ఎదిరిస్తాడు. తమను దెబ్బ కొట్టిన భీమ్ను పట్టుకోవడం చేత కాక పోలీస్ అయిన రామరాజును రంగంలోకి దింపుతారు. అతను తాను పోలీస్ అనే విషయం చెప్పకుండా భీమ్తో స్నేహం చేస్తాడు.
అతణ్ని నమ్మించి బ్రిటిష్ వారికి పట్టిస్తాడు. ఐతే అప్పటి వరకు దేశ భక్తి భావం లేని అతను.. తర్వాత భీమ్ గురించిన వాస్తవాలు తెలుసుకుని, దేశం కోసం పోరాడే స్ఫూర్తిని పొందుతాడు. ఈ విషయంలో అజయ్ దేవగణ్ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ఆ తర్వాత భీమ్తో కలిసి రామరాజు బ్రిటిష్ వారి మీద పోరాటానికి సిద్ధమవుతాడు. వీళ్లిద్దరూ బ్రిటిష్ వారిని గట్టి దెబ్బ తీసి.. అమరులవడంతో కథ ముగుస్తుంది. ట్రైలర్ చూస్తే ‘ఆర్ఆర్ఆర్’ కథపై కలిగిన అంచనా ఇది. ఇంతకుముందు సినిమాలో జక్కన్న ఏం చూపిస్తాడో చూడాలి మరి.
This post was last modified on December 9, 2021 9:51 pm
సిద్ధరామయ్య గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నేత. అంతేనా... కర్ణాటకకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేత. ఇప్పుడే కాదు... గతంలోనూ ఆయన కర్ణాటకకు సీఎంగా…
తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్.. ఈ రోజు భారత మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను అందుకున్నాడు.…
గత కొన్నేళ్లలో యూత్లో బాగా ఫాలోయింగ్ సంపాదించిన టాలీవుడ్ యువ నటుల్లో శ్రీ విష్ణు ఒకడు. సరదాగా సాగే తన…
భవిష్యత్తులో ఐపీఎల్ మరింత పెద్దది కానుందా? ఇప్పుడీ చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఇచ్చిన…
ప్రపంచం వేగంగా మారుతోంది. టెక్నాలజీ అభివృద్ధి ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI),…
రుచిగా ఉంటాయి. సులభంగా దొరుకుతాయి. వేడి చేసి నిమిషాల్లో తినవచ్చు. కానీ రెడీ-టు-ఈట్, రెడీ-టు-హీట్ ఆహారాల ముసుగులో మన ఆరోగ్యాన్ని…