థియేట్రికల్ ట్రైలర్ ప్రధాన ఉద్దేశం.. సినిమా కథేంటో చూచాయిగా చెప్పడం. సినిమాలోని హైలైట్లను చూపించడంతో పాటు కథ మీద ప్రేక్షకుడికి ఒక ఐడియా వచ్చేలా చేస్తుంటారు ఫిలిం మేకర్స్ ట్రైలర్ ద్వారా. కొందరు ఈ సూత్రాన్ని పాటించరు కానీ.. రాజమౌళి మాత్రం దాన్ని పక్కాగా ఫాలో అవుతాడు. జక్కన్న ఏ సినిమా చూసినా.. ట్రైలర్ చూస్తే కథేంటో అర్థమైపోతుంది. కథను దాచి పెట్టి ప్రేక్షకులను భ్రమల్లో ఉంచాలని రాజమౌళి అనుకోడు. ‘ఆర్ఆర్ఆర్’ విషయానికి వస్తే సినిమా ఆరంభ దశలోనే కథ గురించి కొంచెం హింట్ ఇచ్చాడు.
కానీ తర్వాత వచ్చిన ప్రోమోలు కొంత గందరగోళానికి గురి చేశాయి. ఐతే తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్తో జక్కన్న కథ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేశాడనే చెప్పాలి. మొదట్నుంచి ఆరంభం వరకు కథ ఇలా ఉండొచ్చు అనే అంచనాకు వచ్చేలా ట్రైలర్ సాగింది. దీని ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ కథ ఎలా ఉండొచ్చంటే..ముందుగా భారతీయులపై బ్రిటిష్ వారి అరాచకాల్ని చూపించడంతో కథ మొదలవుతుంది.
ఒక గోండు అమ్మాయిని బ్రిటిష్ అధికారి బలవంతంగా తనతో పాటు తీసుకుపోవడంతో ఆ వర్గానికి రక్షకుడిగా ఉన్న భీమ్ (ఎన్టీఆర్) రంగంలోకి దిగుతాడు. బ్రిటిష్ వారిని ఎదిరిస్తాడు. తమను దెబ్బ కొట్టిన భీమ్ను పట్టుకోవడం చేత కాక పోలీస్ అయిన రామరాజును రంగంలోకి దింపుతారు. అతను తాను పోలీస్ అనే విషయం చెప్పకుండా భీమ్తో స్నేహం చేస్తాడు.
అతణ్ని నమ్మించి బ్రిటిష్ వారికి పట్టిస్తాడు. ఐతే అప్పటి వరకు దేశ భక్తి భావం లేని అతను.. తర్వాత భీమ్ గురించిన వాస్తవాలు తెలుసుకుని, దేశం కోసం పోరాడే స్ఫూర్తిని పొందుతాడు. ఈ విషయంలో అజయ్ దేవగణ్ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ఆ తర్వాత భీమ్తో కలిసి రామరాజు బ్రిటిష్ వారి మీద పోరాటానికి సిద్ధమవుతాడు. వీళ్లిద్దరూ బ్రిటిష్ వారిని గట్టి దెబ్బ తీసి.. అమరులవడంతో కథ ముగుస్తుంది. ట్రైలర్ చూస్తే ‘ఆర్ఆర్ఆర్’ కథపై కలిగిన అంచనా ఇది. ఇంతకుముందు సినిమాలో జక్కన్న ఏం చూపిస్తాడో చూడాలి మరి.
This post was last modified on December 9, 2021 9:51 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…