థియేట్రికల్ ట్రైలర్ ప్రధాన ఉద్దేశం.. సినిమా కథేంటో చూచాయిగా చెప్పడం. సినిమాలోని హైలైట్లను చూపించడంతో పాటు కథ మీద ప్రేక్షకుడికి ఒక ఐడియా వచ్చేలా చేస్తుంటారు ఫిలిం మేకర్స్ ట్రైలర్ ద్వారా. కొందరు ఈ సూత్రాన్ని పాటించరు కానీ.. రాజమౌళి మాత్రం దాన్ని పక్కాగా ఫాలో అవుతాడు. జక్కన్న ఏ సినిమా చూసినా.. ట్రైలర్ చూస్తే కథేంటో అర్థమైపోతుంది. కథను దాచి పెట్టి ప్రేక్షకులను భ్రమల్లో ఉంచాలని రాజమౌళి అనుకోడు. ‘ఆర్ఆర్ఆర్’ విషయానికి వస్తే సినిమా ఆరంభ దశలోనే కథ గురించి కొంచెం హింట్ ఇచ్చాడు.
కానీ తర్వాత వచ్చిన ప్రోమోలు కొంత గందరగోళానికి గురి చేశాయి. ఐతే తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్తో జక్కన్న కథ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేశాడనే చెప్పాలి. మొదట్నుంచి ఆరంభం వరకు కథ ఇలా ఉండొచ్చు అనే అంచనాకు వచ్చేలా ట్రైలర్ సాగింది. దీని ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ కథ ఎలా ఉండొచ్చంటే..ముందుగా భారతీయులపై బ్రిటిష్ వారి అరాచకాల్ని చూపించడంతో కథ మొదలవుతుంది.
ఒక గోండు అమ్మాయిని బ్రిటిష్ అధికారి బలవంతంగా తనతో పాటు తీసుకుపోవడంతో ఆ వర్గానికి రక్షకుడిగా ఉన్న భీమ్ (ఎన్టీఆర్) రంగంలోకి దిగుతాడు. బ్రిటిష్ వారిని ఎదిరిస్తాడు. తమను దెబ్బ కొట్టిన భీమ్ను పట్టుకోవడం చేత కాక పోలీస్ అయిన రామరాజును రంగంలోకి దింపుతారు. అతను తాను పోలీస్ అనే విషయం చెప్పకుండా భీమ్తో స్నేహం చేస్తాడు.
అతణ్ని నమ్మించి బ్రిటిష్ వారికి పట్టిస్తాడు. ఐతే అప్పటి వరకు దేశ భక్తి భావం లేని అతను.. తర్వాత భీమ్ గురించిన వాస్తవాలు తెలుసుకుని, దేశం కోసం పోరాడే స్ఫూర్తిని పొందుతాడు. ఈ విషయంలో అజయ్ దేవగణ్ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ఆ తర్వాత భీమ్తో కలిసి రామరాజు బ్రిటిష్ వారి మీద పోరాటానికి సిద్ధమవుతాడు. వీళ్లిద్దరూ బ్రిటిష్ వారిని గట్టి దెబ్బ తీసి.. అమరులవడంతో కథ ముగుస్తుంది. ట్రైలర్ చూస్తే ‘ఆర్ఆర్ఆర్’ కథపై కలిగిన అంచనా ఇది. ఇంతకుముందు సినిమాలో జక్కన్న ఏం చూపిస్తాడో చూడాలి మరి.
This post was last modified on December 9, 2021 9:51 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…