థియేట్రికల్ ట్రైలర్ ప్రధాన ఉద్దేశం.. సినిమా కథేంటో చూచాయిగా చెప్పడం. సినిమాలోని హైలైట్లను చూపించడంతో పాటు కథ మీద ప్రేక్షకుడికి ఒక ఐడియా వచ్చేలా చేస్తుంటారు ఫిలిం మేకర్స్ ట్రైలర్ ద్వారా. కొందరు ఈ సూత్రాన్ని పాటించరు కానీ.. రాజమౌళి మాత్రం దాన్ని పక్కాగా ఫాలో అవుతాడు. జక్కన్న ఏ సినిమా చూసినా.. ట్రైలర్ చూస్తే కథేంటో అర్థమైపోతుంది. కథను దాచి పెట్టి ప్రేక్షకులను భ్రమల్లో ఉంచాలని రాజమౌళి అనుకోడు. ‘ఆర్ఆర్ఆర్’ విషయానికి వస్తే సినిమా ఆరంభ దశలోనే కథ గురించి కొంచెం హింట్ ఇచ్చాడు.
కానీ తర్వాత వచ్చిన ప్రోమోలు కొంత గందరగోళానికి గురి చేశాయి. ఐతే తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్తో జక్కన్న కథ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేశాడనే చెప్పాలి. మొదట్నుంచి ఆరంభం వరకు కథ ఇలా ఉండొచ్చు అనే అంచనాకు వచ్చేలా ట్రైలర్ సాగింది. దీని ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ కథ ఎలా ఉండొచ్చంటే..ముందుగా భారతీయులపై బ్రిటిష్ వారి అరాచకాల్ని చూపించడంతో కథ మొదలవుతుంది.
ఒక గోండు అమ్మాయిని బ్రిటిష్ అధికారి బలవంతంగా తనతో పాటు తీసుకుపోవడంతో ఆ వర్గానికి రక్షకుడిగా ఉన్న భీమ్ (ఎన్టీఆర్) రంగంలోకి దిగుతాడు. బ్రిటిష్ వారిని ఎదిరిస్తాడు. తమను దెబ్బ కొట్టిన భీమ్ను పట్టుకోవడం చేత కాక పోలీస్ అయిన రామరాజును రంగంలోకి దింపుతారు. అతను తాను పోలీస్ అనే విషయం చెప్పకుండా భీమ్తో స్నేహం చేస్తాడు.
అతణ్ని నమ్మించి బ్రిటిష్ వారికి పట్టిస్తాడు. ఐతే అప్పటి వరకు దేశ భక్తి భావం లేని అతను.. తర్వాత భీమ్ గురించిన వాస్తవాలు తెలుసుకుని, దేశం కోసం పోరాడే స్ఫూర్తిని పొందుతాడు. ఈ విషయంలో అజయ్ దేవగణ్ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ఆ తర్వాత భీమ్తో కలిసి రామరాజు బ్రిటిష్ వారి మీద పోరాటానికి సిద్ధమవుతాడు. వీళ్లిద్దరూ బ్రిటిష్ వారిని గట్టి దెబ్బ తీసి.. అమరులవడంతో కథ ముగుస్తుంది. ట్రైలర్ చూస్తే ‘ఆర్ఆర్ఆర్’ కథపై కలిగిన అంచనా ఇది. ఇంతకుముందు సినిమాలో జక్కన్న ఏం చూపిస్తాడో చూడాలి మరి.
This post was last modified on December 9, 2021 9:51 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…