బాహుబలి కోసం ఐదేళ్లు వెచ్చించాడు ప్రభాస్. ఆ తర్వాతి చిత్రం సాహో కూడా బాగానే ఆలస్యమైంది. దీని తర్వాత ప్రభాస్ కొత్త సినిమా రాధేశ్యామ్ కోసం సుదీర్ఘ కాలం నుంచే నిరీక్షిస్తున్నారు అభిమానులు. కరోనా, ఇతర కారణాల వల్ల ఈ చిత్రం ఆలస్యమై.. చివరికి 2022 సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది.
మేకింగ్ టైంలో సరైన అప్డేట్స్ ఇవ్వకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. సినిమాకు ఆశించినంత బజ్ కూడా రాలేదు. ఐతే రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందంలో కదలిక వచ్చింది. వరుసగా సినిమా నుంచి ఒక్కో పాట రిలీజ్ చేస్తున్నారు.
ఈ పాటలు సినిమా పట్ల పాజిటివిటీని పెంచుతున్నాయి. ఇటు సౌత్ వెర్షన్ల పాటలు.. అటు హిందీ వెర్షన్ సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇది రాధేశ్యామ్ టీంలో ఉత్సాహం పెంచుతోంది. ఈ ప్రేమకథ విషయంలో ప్రేక్షకుల్లో సరైన మూడ్ క్రియేట్ చేయడంలో పాటలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఐతే రాధేశ్యామ్ విషయంలో సౌత్ ఫ్యాన్స్లో ఒక రకమైన నెగెటివ్ ఫీలింగ్ ఉంది. ఇది పక్కా బాలీవుడ్ మూవీ లాగా కనిపిస్తోంది. అచ్చంగా ఆషికి-2 తరహా ఉన్నాయి ప్రోమోలన్నీ. దీని వల్ల దక్షిణాది ప్రేక్షకుల్లో ఇది మన సినిమా కాదు అనే ఫీలింగ్ వస్తోంది. బేసిగ్గా రాధేశ్యామ్ తెలుగు చిత్రం అయినా.. మన వాళ్లకు ఇది మన సినిమా అనిపించట్లేదు.
మన నేటివిటీ ఎక్కడా లేదు. అలాగని హిందీ ప్రేక్షకులు కూడా పూర్తిగా ఈ చిత్రాన్ని ఓన్ చేసుకుంటారా అనే విషయంలోనూ సందేహాలున్నాయి. అక్కడ క్లాస్ లవ్ స్టోరీలను ఇష్టపడే మల్టీప్లెక్స్ ఆడియన్స్ అయితే ప్రోమోలతో బాగా కనెక్ట్ అవుతున్నారు. కానీ ప్రభాస్కు నార్త్లో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నది మాస్లోనే. సాహో సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ.. యూపీ, బీహార్ లాంటి మాస్ ఏరియాల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఎ సెంటర్లలో ఆ సినిమాను పెద్దగా ఆదరించలేదు. మాస్ చూడబట్టే ఆ చిత్రానికి రూ.150 కోట్ల వసూళ్లు వచ్చి బాక్సాఫీస్ సక్సెస్ అనిపించుకుంది. మరి రాధేశ్యామ్ లాంటి క్లాస్ లవ్ స్టోరీ విషయంలో హిందీ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఒక దిగ్గజంసెలవు తీసుకున్నారు. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి తెలుగులోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకులు…
వర్షాకాలం ఇంకా ప్రారంభం కానే లేదు. అప్పుడే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్…
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…