Movie News

జ‌బ‌ర్ద‌స్త్ నుంచి సుధీర్ టీమ్ నిజంగానే..?

తెలుగు టెలివిజ‌న్ చ‌రిత్ర‌లో జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ఒక ట్రెండ్ సెట్ట‌ర్. ఎన్నో ఏళ్ల నుంచి అపూర్వ‌మైన ఆద‌ర‌ణ‌తో సాగిపోతోందీ షో. ఇందులో కామెడీ గురించి ఓ వ‌ర్గం నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతుంటాయి కానీ.. మెజారిటీ ప్రేక్ష‌కులు ఈ షోకు బాగా క‌నెక్ట్ అయిపోయారు. జ‌బర్ద‌స్త్, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ అంటూ గురు, శుక్ర‌వారాల్లో రెండు రోజుల పాటు ప్ర‌సారం అయ్యే ఈ షోలో సుడిగాలి సుధీర్ టీంకు ఉన్న ఆద‌ర‌ణ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు.

ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌కు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ ఈ టీమే. ఈ టీంలో లీడ‌ర్ సుధీర్‌తో పాటు రాంప్ర‌సాద్, గెట‌ప్ శీను, స‌న్నీ క‌లిసి చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. ఐతే సుధీర్, అత‌డి టీం జ‌బ‌ర్ద‌స్త్ షోను విడిచి వెళ్లిపోనున్న‌ట్లు కొన్ని రోజులుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు షోలోనే ఈ విష‌యాన్ని సుధీర్ టీం స్వ‌యంగా వెల్ల‌డించింది.

ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ కొత్త ఎపిసోడ్ తాలూకు ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. అందులో ఈ వారం సుధీర్ టీం చేసిన స్కిట్ దృశ్యాల‌ను చూపించి.. చివ‌ర‌గా వాళ్లు ఈ షో నుంచి వెళ్లిపోతున్న విష‌యాన్ని వెల్ల‌డించారు. తాము జ‌బ‌ర్ద‌స్త్‌ను వ‌దిలి వెళ్తున్నందుకు క్ష‌మించాల‌ని సుధీర్, రామ్ ప్ర‌సాద్, శ్రీను విన్న‌వించారు. ఈ విష‌యాన్ని ఒక ఇంట‌ర్వ్యూ ద్వారా వెల్ల‌డించాల‌ని అనుకున్నామ‌ని.. కానీ జ‌బ‌ర్ద‌స్త్ షోలోనే ఈ విష‌యం చెబుతున్నామ‌ని ఆ ముగ్గురూ అన్నారు.

ఈ సంద‌ర్భంగా ముగ్గురూ ఎమోష‌న‌ల్ అయ్యారు. బ్రేక్ డౌన్ అయ్యారు. అలాగే జ‌డ్జీలైన రోజా, మ‌నో.. యాంక‌ర్ ర‌ష్మి సైతం ఉద్వేగానికి గుర‌య్యారు. ఐతే జ‌బ‌ర్ద‌స్త్ షోలో గ‌త అనుభ‌వాల దృష్ట్యా.. సుధీర్ టీం నిజంగానే షోను వదిలి వెళ్లిపోతుందా.. లేక బ‌య‌ట జ‌రుగుతున్న ప్ర‌చారానికి కౌంట‌ర్‌గా ఇలా చేసి కామెడీ చేశారా.. ప్రోమో ఇలా క‌ట్ చేసి, చివ‌రికి అస‌లు షోలో అంద‌రినీ ఫూల్స్‌ను చేస్తారా అన్న‌దే అనుమానంగా ఉంది.

This post was last modified on December 8, 2021 10:49 am

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

3 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

3 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

4 hours ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

4 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

4 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

5 hours ago