తెలుగు టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ కామెడీ షో ఒక ట్రెండ్ సెట్టర్. ఎన్నో ఏళ్ల నుంచి అపూర్వమైన ఆదరణతో సాగిపోతోందీ షో. ఇందులో కామెడీ గురించి ఓ వర్గం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి కానీ.. మెజారిటీ ప్రేక్షకులు ఈ షోకు బాగా కనెక్ట్ అయిపోయారు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ గురు, శుక్రవారాల్లో రెండు రోజుల పాటు ప్రసారం అయ్యే ఈ షోలో సుడిగాలి సుధీర్ టీంకు ఉన్న ఆదరణ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
ఎక్స్ట్రా జబర్దస్త్కు ప్రధాన ఆకర్షణ ఈ టీమే. ఈ టీంలో లీడర్ సుధీర్తో పాటు రాంప్రసాద్, గెటప్ శీను, సన్నీ కలిసి చేసే సందడి అంతా ఇంతా కాదు. ఐతే సుధీర్, అతడి టీం జబర్దస్త్ షోను విడిచి వెళ్లిపోనున్నట్లు కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు షోలోనే ఈ విషయాన్ని సుధీర్ టీం స్వయంగా వెల్లడించింది.
ఎక్స్ట్రా జబర్దస్త్ కొత్త ఎపిసోడ్ తాలూకు ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. అందులో ఈ వారం సుధీర్ టీం చేసిన స్కిట్ దృశ్యాలను చూపించి.. చివరగా వాళ్లు ఈ షో నుంచి వెళ్లిపోతున్న విషయాన్ని వెల్లడించారు. తాము జబర్దస్త్ను వదిలి వెళ్తున్నందుకు క్షమించాలని సుధీర్, రామ్ ప్రసాద్, శ్రీను విన్నవించారు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించాలని అనుకున్నామని.. కానీ జబర్దస్త్ షోలోనే ఈ విషయం చెబుతున్నామని ఆ ముగ్గురూ అన్నారు.
ఈ సందర్భంగా ముగ్గురూ ఎమోషనల్ అయ్యారు. బ్రేక్ డౌన్ అయ్యారు. అలాగే జడ్జీలైన రోజా, మనో.. యాంకర్ రష్మి సైతం ఉద్వేగానికి గురయ్యారు. ఐతే జబర్దస్త్ షోలో గత అనుభవాల దృష్ట్యా.. సుధీర్ టీం నిజంగానే షోను వదిలి వెళ్లిపోతుందా.. లేక బయట జరుగుతున్న ప్రచారానికి కౌంటర్గా ఇలా చేసి కామెడీ చేశారా.. ప్రోమో ఇలా కట్ చేసి, చివరికి అసలు షోలో అందరినీ ఫూల్స్ను చేస్తారా అన్నదే అనుమానంగా ఉంది.
This post was last modified on December 8, 2021 10:49 am
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…