లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం వయసు 64 ఏళ్లు. ఐతే ఆయన సినిమాలు చూస్తే.. తనకు ఇంత వయసు ఉంటుందని అనిపించదు. కాలానికి తగ్గట్లు అప్ డేట్ అవడం ఆయన స్పెషాలిటీ. ఆయన దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు నడుస్తున్న కాలాని కంటే చాలా ముందుంటాయి. సినిమా ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ మణిరత్నం ఔట్ డేటెడ్ అని ఎప్పుడూ అనిపించుకోలేదు. ట్రెండీగానే సినిమాలు తీస్తారు.
ఇప్పుడు వెబ్ సిరీస్ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లు మణిరత్నం తనను తాను అప్ డేట్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు. మణిరత్నం ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం వెబ్ సిరీస్ తీయబోతున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఫ్లాట్ ఫామ్ అమేజాన్ ప్రైమ్ అని వెల్లడైంది. దీని కోసం పెద్ద బడ్జెట్లో ఒక ప్రాజెక్టు బాధ్యతల్ని మణిరత్నం నెత్తికెత్తుకున్నారట.
తొమ్మిది ఎపిసోడ్లతో నడిచే ఈ వెబ్ సిరీస్ ఓ చారిత్రక కథాంశం నేపథ్యంలో నడుస్తుందట. తొమ్మిది ఎపిసోడ్లను వేర్వేరు దర్శకులు తీస్తారని సమాచారం. మణిరత్నం ఒకటి రెండు ఎపిసోడ్లు తీసే అవకాశముంది. మొత్తంగా ప్రాజెక్టు పర్యవేక్షణ అంతా మణిదే. ఈ సిరీస్ కోసం ఆయన తమిళంతో పాటు తెలుగు దర్శకులను కూడా తీసుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం వేట సాగిస్తున్నారట. తన కథాంశానికి తగ్గ దర్శకులు ఎవరు అని ఆయన టాలీవుడ్ దర్శకుల వైపు చూస్తున్నారట. ఇక్కడి పరిచయస్థులతో చర్చలు కూడా జరుపుతున్నారట.
మరి మణిరత్నం పర్యవేక్షణలో ఆయన తీస్తున్న తొలి వెబ్ సిరీస్లో ఎపిసోడ్లను డైరెక్ట్ చేసే అరుదైన అవకాశం అందుకునే తెలుగు దర్శకులు ఎవరో చూడాలి. మరోవైపు మణిరత్నం తన కలల ప్రాజెక్టు ‘పొన్నియన్ సెల్వన్’ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల దానికి బ్రేక్ పడింది.
This post was last modified on June 8, 2020 10:35 am
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…