టైటిల్ కోసం పెద్ద పెద్ద వివాదాలే చెలరేగిన సందర్భాలున్నాయి. దాన్ని మొదట మేం రిజిస్టర్ చేశామంటే మేం చేశామంటూ ఫిల్మ్ మేకర్స్ చాలామంది చాలాసార్లు గొడవపడ్డారు. ఇండస్ట్రీ పెద్దలు, కోర్టులు కల్పించుకోవాల్సిన పరిస్థితులూ ఏర్పడ్డాయి. ఇప్పుడు ధనుష్ నటించిన హిందీ సినిమా టైటిల్ విషయంలోనూ సమస్య వచ్చింది. కానీ అది ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా సమసిపోయింది.
ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ‘అత్రంగీరే’ అనే సినిమా చేశాడు ధనుష్. సారా అలీఖాన్ హీరోయిన్. అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటించాడు. రీసెంట్గా ట్రైలర్ రిలీజై మెప్పించింది. ఈ నెల 24న మూవీ విడుదల కాబోతోంది. ప్రమోషన్స్లో భాగంగా ఇప్పుడో ఇంటర్వ్యూ ఇచ్చాడు దర్శకుడు ఆనంద్. అందులో ఓ ఇంటరెస్టింగ్ విషయం చెప్పాడు. ‘అత్రంగీరే’తో పాటు అక్షయ్ కుమార్ హీరోగా ‘రక్షాబంధన్’ కూడా తీస్తున్నాడు ఆనంద్.
ఈ రెండు సినిమాల టైటిల్స్నీ రిజిస్టర్ చేయడానికి వెళ్లినప్పుడు ఓ సమస్య వచ్చిందట. ‘రక్షాబంధన్’ని రిజిస్టర్ చేశారు కానీ ‘అత్రంగీరే’ని చేయడానికి కుదరదు అన్నారట. అది సల్మాన్ ఖాన్ ఆల్రెడీ రిజిస్టర్ చేయించాడని, అతనికే దానిపై రైట్స్ ఉన్నాయని అడ్డుకున్నారట. వెంటనే వాళ్లు సల్మాన్కి ఫోన్ చేసి విషయం చెబితే.. ఆ టైటిల్ తనదని, ఎవరికీ దానిపై రైట్ లేదని సల్లూ అన్నాడట.
కాకపోతే ఆనంద్ ఎల్ రాయ్ అడిగితే మాత్రం ఇవ్వండి, తనకి తప్ప ఎవ్వరికీ ఇవ్వడానికి వీల్లేదని చెప్పాడట. దాంతో వాళ్లు ఆ టైటిల్ని ఆనంద్కి ఇచ్చారట. ‘నాకు మాత్రమే ఇవ్వమని సల్మాన్ ఎందుకు అన్నారో తెలీదు, ఆయనకి నామీద అంత అభిమానం ఉన్నందుకు ఆనందంగా ఉంది. ఆయన నో అంటే నేను టైటిల్ మార్చుకోవాల్సి వచ్చేది’ అని చెప్పుకొచ్చాడు ఆనంద్. ఏదైతేనేం.. ఏ గొడవా జరక్కుండా ప్రాబ్లెమ్ సాల్వ్ అయ్యింది. సల్మాన్ టైటిల్ ధనుష్ సినిమాకి దక్కింది.
This post was last modified on December 5, 2021 1:57 pm
దేశ భద్రతపై మళ్లీ శాంతిభంగం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. శనివారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…