బాలీవుడ్ వాళ్లకు కొన్నేళ్ల నుంచి సౌత్ సినిమాల రీమేక్ల పట్ల ఉన్న మోజు ఎలాంటిదో సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ అంతకంతకూ పెరుగుతోంది. దక్షిణాదిన ఏ భాషలో సినిమా హిట్టయినా దాని మీద వాళ్లు కర్చీఫ్ వేసేస్తున్నారు. ప్రధానంగా వాళ్ల కళ్లు తెలుగు, తమిళ చిత్రాల మీదే ఉంటాయి. గత కొన్నేళ్లలో పదుల సంఖ్యలో తెలుగు చిత్రాలు రీమేక్ కావడం విశేషం.
కొత్త సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నా, వసూళ్లు రాబడుతున్నా బాలీవుడ్ నిర్మాతలు ఆలస్యం చేయట్లేదు. సాధ్యమైనంత త్వరగా రీమేక్ హక్కులు కొనేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అఖండ మీద కూడా వారి చూపు పడ్డట్లు సమాచారం. అఖండ కథ పరంగా చూసుకుంటే అంత గొప్పగా ఏమీ ఉండదు. కానీ ఇలాంటి మసాలా సినిమాలనే సాజిద్ నడియాడ్ వాలా లాంటి నిర్మాతలు టేకప్ చేసి, బాలీవుడ్ టచ్ ఇచ్చి వసూళ్ల పంట పండించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే సాజిద్ సహా కొందరు నిర్మాతల దృష్టి అఖండ మీద పడ్డట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ వాళ్లు అఖండ విషయంలో బాగా కనెక్టయ్యే విషయం ఇంకోటుంది. ఇందులో దేవాలయాల పరిరక్షణ గురించి, హిందుత్వం గురించి చాలా బలంగా చెప్పారు. ఇదే ఇప్పుడు నార్త్ ఇండియన్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో చాలా చోట్ల దీని గురించి చర్చ జరుగుతోంది.
ఎప్పుడూ హిందుత్వాన్ని కించ పరుస్తూ.. వేరే మతాలకు మద్దతుగా సినిమాలు తీసే బాలీవుడ్ ఫిలిం మేకర్స్ అఖండ లాంటి సినిమాలను చూసి నేర్చుకోవాలని కౌంటర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖండ మూవీలో అఖండ పాత్రను తీసుకుని.. మిగతా కథలో కొంచెం మార్పులు చేర్పులు చేస్తే మంచి కమర్షియల్ సక్సెస్ అందుకోవడానికి అవకాశముంటుందని.. అజయ్ దేవగణ్ లాంటి హీరో అయితే దీనికి పర్ఫెక్ట్గా సెట్ అవుతాడని.. అక్షయ్ కుమార్ అయినా ఓకే అని భావిస్తున్నారట. ఈ సినిమాను రీమేక్ చేస్తే బ్యాకప్ ఇవ్వడానికి బీజేపీ నేతలు కొందరు సిద్ధంగా ఉన్నట్లు కూడా వార్తలొస్తుండటం విశేషం.
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…