శోభా డే అని ఉత్తరాదిన పేరుమోసిన కాలమిస్ట్, నావలిస్ట్. సామాజిక అంశాలపై చాలా చురుగ్గా స్పందిస్తుంటుంది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. ఆమె చేసిన ఓ పని ఇప్పుడు ట్విట్టర్లో మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఒళ్లు మండేలా చేసింది. ఆదివారం ఉదయం కన్నడ హీరో, సీనియర్ నటుడు అర్జున్ మేనల్లుడు అయిన చిరంజీవి సర్జా గుండెపోటుతో హఠాన్మరణం పాలైన సంగతి తెలిసిందే.
ఐతే చిరంజీవి అనే పేరు చూసి అది మన మెగాస్టార్ అనుకున్న శోభా డే.. కనీసం వెరిఫై చేసుకోకుండా ట్వీట్ పెట్టేసింది. ఆయన ఫొటో కూడా పెట్టేసి.. భారతీయ సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయిందంటూ ట్వీట్ వేసేసింది.
ఈ మధ్యే ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి లెజెండ్స్ మృతి చెందిన నేపథ్యంలో ఈ కోవలో చిరంజీవి పేరు చేర్చేసింది. ఐతే మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండియా మొత్తం ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి అప్ డేట్ ఇస్తున్నపుడు కొంచెం కూడా జాగ్రత్త పడకపోవడం దారుణం.
ఆయన ఫొటో పెట్టడం చూసి మెగాస్టార్ అభిమానులకు ఒళ్లు మండిపోయింది. ఆమెపై విరుచుకుపడ్డారు. ఐతే త్వరగానే తప్పును గుర్తించి ఆమె ట్వీట్ను డెలీట్ చేసింది. ఐతే ఈ విషయంలో ఆమె నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తుండటంతో మెగా అభిమానుల ఆగ్రహం తగ్గట్లేదు. ఆమెను తిడుతూనే ఉన్నారు.
This post was last modified on June 8, 2020 7:34 am
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…
గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…