శోభా డే అని ఉత్తరాదిన పేరుమోసిన కాలమిస్ట్, నావలిస్ట్. సామాజిక అంశాలపై చాలా చురుగ్గా స్పందిస్తుంటుంది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. ఆమె చేసిన ఓ పని ఇప్పుడు ట్విట్టర్లో మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఒళ్లు మండేలా చేసింది. ఆదివారం ఉదయం కన్నడ హీరో, సీనియర్ నటుడు అర్జున్ మేనల్లుడు అయిన చిరంజీవి సర్జా గుండెపోటుతో హఠాన్మరణం పాలైన సంగతి తెలిసిందే.
ఐతే చిరంజీవి అనే పేరు చూసి అది మన మెగాస్టార్ అనుకున్న శోభా డే.. కనీసం వెరిఫై చేసుకోకుండా ట్వీట్ పెట్టేసింది. ఆయన ఫొటో కూడా పెట్టేసి.. భారతీయ సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయిందంటూ ట్వీట్ వేసేసింది.
ఈ మధ్యే ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి లెజెండ్స్ మృతి చెందిన నేపథ్యంలో ఈ కోవలో చిరంజీవి పేరు చేర్చేసింది. ఐతే మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండియా మొత్తం ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి అప్ డేట్ ఇస్తున్నపుడు కొంచెం కూడా జాగ్రత్త పడకపోవడం దారుణం.
ఆయన ఫొటో పెట్టడం చూసి మెగాస్టార్ అభిమానులకు ఒళ్లు మండిపోయింది. ఆమెపై విరుచుకుపడ్డారు. ఐతే త్వరగానే తప్పును గుర్తించి ఆమె ట్వీట్ను డెలీట్ చేసింది. ఐతే ఈ విషయంలో ఆమె నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తుండటంతో మెగా అభిమానుల ఆగ్రహం తగ్గట్లేదు. ఆమెను తిడుతూనే ఉన్నారు.
This post was last modified on June 8, 2020 7:34 am
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…
తెలంగాణలోని అదికార కాంగ్రెస్ లో తిరుగుబాటు బావుటా ఎగిరిందని, ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ…
ఒకప్పుడు అంటే పాతిక ముప్పై సంవత్సరాల క్రితం ప్రేక్షకులు పాటలు వినాలంటే ఆడియో క్యాసెట్లు ఎక్కువగా చెలామణిలో ఉండేవి. అంతకు…