ఈ ఏడాది ఇండియాలో నెటిజన్లు ఎక్కువ సార్లు సెర్చ్ చేసిన లిస్ట్ లో టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్, సమంత టాప్ లో ఉండడం విశేషం. ప్రతి ఏడాది మోస్ట్ సెర్చ్డ్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్ ను అనౌన్స్ చేస్తుంటుంది యాహూ సంస్థ. ఈ ఏడాది దేశవ్యాప్తంగా అత్యధిక సార్లు సెర్చ్ అయిన వాళ్లలో అల్లు అర్జున్ పేరు మూడో స్థానంలో ఉంది. మేల్ సెలబ్రిటీల లిస్ట్ లో ముందుగా నటుడు సిద్ధార్థ్ శుక్లా పేరు ఉంది. చిన్న వయసులో హార్ట్ ఎటాక్ తో మరణించారు సిద్ధార్థ్ శుక్లా. ఆయన గురించి తెలుసుకోవడానికి ఎక్కువ మంది అతడి పేరుని సెర్చ్ చేశారు.
రెండో స్థానం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు దక్కింది. ఇక సల్మాన్ ఖాన్ తరువాత మూడో స్థానంలో అల్లు అర్జున్ నిలిచారు. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ క్రేజ్ బాగా పెరిగింది. డబ్బింగ్ సినిమాల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆయన నటిస్తోన్న ‘పుష్ప’ పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది.
అల్లు అర్జున్ తరువాతి స్థానంలో దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ నిలిచారు. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఏడో స్థానంలో నిలిచారు. ఇక ఫిమేల్ సెలబ్రిటీల విషయానికొస్తే.. మొదటిస్థానంలో కరీనా కపూర్, రెండో స్థానంలో కత్రినా కైఫ్, మూడో స్థానంలో ప్రియాంక చోప్రా, ఆ తరువాత స్థానాల్లో అలియా భట్, దీపికా పదుకోన్ నిలిచారు. ఈ లిస్ట్ లో సమంత పదో స్థానంలో నిలిచింది. విడాకుల వార్తలతో సమంత హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అందుకే ఆమె గురించి ఎక్కువ మంది సెర్చ్ బార్ లో టైప్ చేశారు.
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…