ఈ ఏడాది ఇండియాలో నెటిజన్లు ఎక్కువ సార్లు సెర్చ్ చేసిన లిస్ట్ లో టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్, సమంత టాప్ లో ఉండడం విశేషం. ప్రతి ఏడాది మోస్ట్ సెర్చ్డ్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్ ను అనౌన్స్ చేస్తుంటుంది యాహూ సంస్థ. ఈ ఏడాది దేశవ్యాప్తంగా అత్యధిక సార్లు సెర్చ్ అయిన వాళ్లలో అల్లు అర్జున్ పేరు మూడో స్థానంలో ఉంది. మేల్ సెలబ్రిటీల లిస్ట్ లో ముందుగా నటుడు సిద్ధార్థ్ శుక్లా పేరు ఉంది. చిన్న వయసులో హార్ట్ ఎటాక్ తో మరణించారు సిద్ధార్థ్ శుక్లా. ఆయన గురించి తెలుసుకోవడానికి ఎక్కువ మంది అతడి పేరుని సెర్చ్ చేశారు.
రెండో స్థానం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు దక్కింది. ఇక సల్మాన్ ఖాన్ తరువాత మూడో స్థానంలో అల్లు అర్జున్ నిలిచారు. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ క్రేజ్ బాగా పెరిగింది. డబ్బింగ్ సినిమాల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆయన నటిస్తోన్న ‘పుష్ప’ పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది.
అల్లు అర్జున్ తరువాతి స్థానంలో దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ నిలిచారు. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఏడో స్థానంలో నిలిచారు. ఇక ఫిమేల్ సెలబ్రిటీల విషయానికొస్తే.. మొదటిస్థానంలో కరీనా కపూర్, రెండో స్థానంలో కత్రినా కైఫ్, మూడో స్థానంలో ప్రియాంక చోప్రా, ఆ తరువాత స్థానాల్లో అలియా భట్, దీపికా పదుకోన్ నిలిచారు. ఈ లిస్ట్ లో సమంత పదో స్థానంలో నిలిచింది. విడాకుల వార్తలతో సమంత హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అందుకే ఆమె గురించి ఎక్కువ మంది సెర్చ్ బార్ లో టైప్ చేశారు.
This post was last modified on December 4, 2021 4:10 pm
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…