ఈ ఏడాది ఇండియాలో నెటిజన్లు ఎక్కువ సార్లు సెర్చ్ చేసిన లిస్ట్ లో టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్, సమంత టాప్ లో ఉండడం విశేషం. ప్రతి ఏడాది మోస్ట్ సెర్చ్డ్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్ ను అనౌన్స్ చేస్తుంటుంది యాహూ సంస్థ. ఈ ఏడాది దేశవ్యాప్తంగా అత్యధిక సార్లు సెర్చ్ అయిన వాళ్లలో అల్లు అర్జున్ పేరు మూడో స్థానంలో ఉంది. మేల్ సెలబ్రిటీల లిస్ట్ లో ముందుగా నటుడు సిద్ధార్థ్ శుక్లా పేరు ఉంది. చిన్న వయసులో హార్ట్ ఎటాక్ తో మరణించారు సిద్ధార్థ్ శుక్లా. ఆయన గురించి తెలుసుకోవడానికి ఎక్కువ మంది అతడి పేరుని సెర్చ్ చేశారు.
రెండో స్థానం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు దక్కింది. ఇక సల్మాన్ ఖాన్ తరువాత మూడో స్థానంలో అల్లు అర్జున్ నిలిచారు. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ క్రేజ్ బాగా పెరిగింది. డబ్బింగ్ సినిమాల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆయన నటిస్తోన్న ‘పుష్ప’ పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది.
అల్లు అర్జున్ తరువాతి స్థానంలో దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ నిలిచారు. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఏడో స్థానంలో నిలిచారు. ఇక ఫిమేల్ సెలబ్రిటీల విషయానికొస్తే.. మొదటిస్థానంలో కరీనా కపూర్, రెండో స్థానంలో కత్రినా కైఫ్, మూడో స్థానంలో ప్రియాంక చోప్రా, ఆ తరువాత స్థానాల్లో అలియా భట్, దీపికా పదుకోన్ నిలిచారు. ఈ లిస్ట్ లో సమంత పదో స్థానంలో నిలిచింది. విడాకుల వార్తలతో సమంత హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అందుకే ఆమె గురించి ఎక్కువ మంది సెర్చ్ బార్ లో టైప్ చేశారు.
This post was last modified on December 4, 2021 4:10 pm
మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము.…
నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…