ఈ ఏడాది ఇండియాలో నెటిజన్లు ఎక్కువ సార్లు సెర్చ్ చేసిన లిస్ట్ లో టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్, సమంత టాప్ లో ఉండడం విశేషం. ప్రతి ఏడాది మోస్ట్ సెర్చ్డ్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్ ను అనౌన్స్ చేస్తుంటుంది యాహూ సంస్థ. ఈ ఏడాది దేశవ్యాప్తంగా అత్యధిక సార్లు సెర్చ్ అయిన వాళ్లలో అల్లు అర్జున్ పేరు మూడో స్థానంలో ఉంది. మేల్ సెలబ్రిటీల లిస్ట్ లో ముందుగా నటుడు సిద్ధార్థ్ శుక్లా పేరు ఉంది. చిన్న వయసులో హార్ట్ ఎటాక్ తో మరణించారు సిద్ధార్థ్ శుక్లా. ఆయన గురించి తెలుసుకోవడానికి ఎక్కువ మంది అతడి పేరుని సెర్చ్ చేశారు.
రెండో స్థానం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు దక్కింది. ఇక సల్మాన్ ఖాన్ తరువాత మూడో స్థానంలో అల్లు అర్జున్ నిలిచారు. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ క్రేజ్ బాగా పెరిగింది. డబ్బింగ్ సినిమాల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆయన నటిస్తోన్న ‘పుష్ప’ పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది.
అల్లు అర్జున్ తరువాతి స్థానంలో దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ నిలిచారు. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఏడో స్థానంలో నిలిచారు. ఇక ఫిమేల్ సెలబ్రిటీల విషయానికొస్తే.. మొదటిస్థానంలో కరీనా కపూర్, రెండో స్థానంలో కత్రినా కైఫ్, మూడో స్థానంలో ప్రియాంక చోప్రా, ఆ తరువాత స్థానాల్లో అలియా భట్, దీపికా పదుకోన్ నిలిచారు. ఈ లిస్ట్ లో సమంత పదో స్థానంలో నిలిచింది. విడాకుల వార్తలతో సమంత హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అందుకే ఆమె గురించి ఎక్కువ మంది సెర్చ్ బార్ లో టైప్ చేశారు.
This post was last modified on December 4, 2021 4:10 pm
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…