టాలీవుడ్ లో శిల్పా చౌదరి అనే పేరు బాగా వినిపిస్తోంది. సమాజంలో చాలా మంది ప్రముఖులను మోసం చేయడంతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు వ్యక్తులను టార్గెట్ చేసింది. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు వంద నుంచి రెండొందల కోట్ల వరకు జనాల నుంచి డబ్బు తీసుకొని మోసం చేసింది. అధిక వడ్డీ ఇప్పిస్తానని.. స్థలాలు అమ్ముతానని ఇలా రకరకాల కారణాలతో అందరినీ బుట్టలో వేసుకుంది. ఈమె బాధితుల్లో మహేష్ బాబు సోదరి కూడా ఉంది. ఆమె దగ్గర నుంచి రూ.2.9 కోట్లు లాగేసింది శిల్పా.
ఇప్పుడు ఈమె బాధితుల్లో మరో యంగ్ హీరో కూడా ఉన్నాడని తేలింది. ఆయన ఎవరంటే.. హర్ష్ కనుమిల్లి. ‘సెహరి’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు హర్ష్. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఈవెంట్ లో బాలయ్య కూడా పాల్గొనడంతో అప్పట్లో కాస్త బజ్ వచ్చింది. అయితే ఈ సినిమా సమయంలో హర్ష్ తో స్నేహం చేసుకుంది శిల్పా. స్థలంగా పేరు చెప్పి కొంత డబ్బు, అప్పుగా ఇంకొంత ఇలా దాదాపు రూ.3 కోట్లు వరకు తీసుకుంది.
ఇప్పుడు ఆ మూడు కోట్లు పోయినట్లే. శిల్పా చేతిలో మోసపోయిన వారిలో టాలీవుడ్ కి చెందిన అగ్రహీరో కూడా ఉన్నాడని టాక్. ఆయన, శిల్పా కలిసి తీసుకున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమెపై కేసు పెట్టడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. తెర వెనుక నుంచే ఈ ఇష్యూని సెటిల్ చేసుకొని.. డబ్బు వెనక్కి రాబట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి శిల్పా వ్యవహారం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తుందనే చెప్పాలి.
This post was last modified on December 3, 2021 11:56 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ ప్రపంచ శాంతి పురస్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన విషయం తెలిసిందే.…