టాలీవుడ్ లో శిల్పా చౌదరి అనే పేరు బాగా వినిపిస్తోంది. సమాజంలో చాలా మంది ప్రముఖులను మోసం చేయడంతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు వ్యక్తులను టార్గెట్ చేసింది. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు వంద నుంచి రెండొందల కోట్ల వరకు జనాల నుంచి డబ్బు తీసుకొని మోసం చేసింది. అధిక వడ్డీ ఇప్పిస్తానని.. స్థలాలు అమ్ముతానని ఇలా రకరకాల కారణాలతో అందరినీ బుట్టలో వేసుకుంది. ఈమె బాధితుల్లో మహేష్ బాబు సోదరి కూడా ఉంది. ఆమె దగ్గర నుంచి రూ.2.9 కోట్లు లాగేసింది శిల్పా.
ఇప్పుడు ఈమె బాధితుల్లో మరో యంగ్ హీరో కూడా ఉన్నాడని తేలింది. ఆయన ఎవరంటే.. హర్ష్ కనుమిల్లి. ‘సెహరి’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు హర్ష్. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఈవెంట్ లో బాలయ్య కూడా పాల్గొనడంతో అప్పట్లో కాస్త బజ్ వచ్చింది. అయితే ఈ సినిమా సమయంలో హర్ష్ తో స్నేహం చేసుకుంది శిల్పా. స్థలంగా పేరు చెప్పి కొంత డబ్బు, అప్పుగా ఇంకొంత ఇలా దాదాపు రూ.3 కోట్లు వరకు తీసుకుంది.
ఇప్పుడు ఆ మూడు కోట్లు పోయినట్లే. శిల్పా చేతిలో మోసపోయిన వారిలో టాలీవుడ్ కి చెందిన అగ్రహీరో కూడా ఉన్నాడని టాక్. ఆయన, శిల్పా కలిసి తీసుకున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమెపై కేసు పెట్టడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. తెర వెనుక నుంచే ఈ ఇష్యూని సెటిల్ చేసుకొని.. డబ్బు వెనక్కి రాబట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి శిల్పా వ్యవహారం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తుందనే చెప్పాలి.
This post was last modified on December 3, 2021 11:56 am
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…