టాలీవుడ్ లో శిల్పా చౌదరి అనే పేరు బాగా వినిపిస్తోంది. సమాజంలో చాలా మంది ప్రముఖులను మోసం చేయడంతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు వ్యక్తులను టార్గెట్ చేసింది. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు వంద నుంచి రెండొందల కోట్ల వరకు జనాల నుంచి డబ్బు తీసుకొని మోసం చేసింది. అధిక వడ్డీ ఇప్పిస్తానని.. స్థలాలు అమ్ముతానని ఇలా రకరకాల కారణాలతో అందరినీ బుట్టలో వేసుకుంది. ఈమె బాధితుల్లో మహేష్ బాబు సోదరి కూడా ఉంది. ఆమె దగ్గర నుంచి రూ.2.9 కోట్లు లాగేసింది శిల్పా.
ఇప్పుడు ఈమె బాధితుల్లో మరో యంగ్ హీరో కూడా ఉన్నాడని తేలింది. ఆయన ఎవరంటే.. హర్ష్ కనుమిల్లి. ‘సెహరి’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు హర్ష్. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఈవెంట్ లో బాలయ్య కూడా పాల్గొనడంతో అప్పట్లో కాస్త బజ్ వచ్చింది. అయితే ఈ సినిమా సమయంలో హర్ష్ తో స్నేహం చేసుకుంది శిల్పా. స్థలంగా పేరు చెప్పి కొంత డబ్బు, అప్పుగా ఇంకొంత ఇలా దాదాపు రూ.3 కోట్లు వరకు తీసుకుంది.
ఇప్పుడు ఆ మూడు కోట్లు పోయినట్లే. శిల్పా చేతిలో మోసపోయిన వారిలో టాలీవుడ్ కి చెందిన అగ్రహీరో కూడా ఉన్నాడని టాక్. ఆయన, శిల్పా కలిసి తీసుకున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమెపై కేసు పెట్టడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. తెర వెనుక నుంచే ఈ ఇష్యూని సెటిల్ చేసుకొని.. డబ్బు వెనక్కి రాబట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి శిల్పా వ్యవహారం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తుందనే చెప్పాలి.
2024 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన విశ్వంభర టీజర్ మీద నెగటివ్ రియాక్షన్లు చాలా వచ్చాయి. ట్రోలింగ్ జరిగింది. దెబ్బకు…
టాలీవుడ్ బాక్సాఫీస్ జూన్ నెల నుంచి ఊపందుకుంది. ఓవర్సీస్, నార్త్ పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల వరకు పెద్ది బ్లాక్ బస్టర్…
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…