టాలీవుడ్ లో శిల్పా చౌదరి అనే పేరు బాగా వినిపిస్తోంది. సమాజంలో చాలా మంది ప్రముఖులను మోసం చేయడంతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు వ్యక్తులను టార్గెట్ చేసింది. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు వంద నుంచి రెండొందల కోట్ల వరకు జనాల నుంచి డబ్బు తీసుకొని మోసం చేసింది. అధిక వడ్డీ ఇప్పిస్తానని.. స్థలాలు అమ్ముతానని ఇలా రకరకాల కారణాలతో అందరినీ బుట్టలో వేసుకుంది. ఈమె బాధితుల్లో మహేష్ బాబు సోదరి కూడా ఉంది. ఆమె దగ్గర నుంచి రూ.2.9 కోట్లు లాగేసింది శిల్పా.
ఇప్పుడు ఈమె బాధితుల్లో మరో యంగ్ హీరో కూడా ఉన్నాడని తేలింది. ఆయన ఎవరంటే.. హర్ష్ కనుమిల్లి. ‘సెహరి’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు హర్ష్. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఈవెంట్ లో బాలయ్య కూడా పాల్గొనడంతో అప్పట్లో కాస్త బజ్ వచ్చింది. అయితే ఈ సినిమా సమయంలో హర్ష్ తో స్నేహం చేసుకుంది శిల్పా. స్థలంగా పేరు చెప్పి కొంత డబ్బు, అప్పుగా ఇంకొంత ఇలా దాదాపు రూ.3 కోట్లు వరకు తీసుకుంది.
ఇప్పుడు ఆ మూడు కోట్లు పోయినట్లే. శిల్పా చేతిలో మోసపోయిన వారిలో టాలీవుడ్ కి చెందిన అగ్రహీరో కూడా ఉన్నాడని టాక్. ఆయన, శిల్పా కలిసి తీసుకున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమెపై కేసు పెట్టడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. తెర వెనుక నుంచే ఈ ఇష్యూని సెటిల్ చేసుకొని.. డబ్బు వెనక్కి రాబట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి శిల్పా వ్యవహారం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తుందనే చెప్పాలి.
This post was last modified on December 3, 2021 11:56 am
తీన్మార్ మల్లన్న. నిత్యం మీడియాలో ఉంటూ..తనదైన శైలిలో గత కేసీఆర్ సర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింతపండు నవీన్ గురించి…
ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్…
తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…
ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు కొన్ని బాగానే వర్కౌట్ చేసుకున్న నేపథ్యంలో బాక్ అరణ్మనై 4 మీద కాస్తో కూస్తో…
తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్లలో పాలు పంచుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు మంచి ఫాలోయింగ్…
ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి…