ఇప్పుడు రాజకీయాల్లో, వ్యాపార రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్న చాలామంది ఒకప్పుడు సినిమా పిచ్చోళ్లే. వాళ్లకు ఆరాధ్య నటీనటులుండేవాళ్లు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇందుకు మినహాయింపు కాదని అంటారు. ఆయన నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని అని చెబుతారు. అప్పట్లో బాలయ్య కోసం బేనర్లు కట్టేవాడని.. అభిమాన సంఘాన్ని నడిపించేవాడని కూడా ఓ ప్రచారం ఉంది. ఇదెంత వరకు నిజమన్నది తెలియదు. దీనిపై జగన్ ఎప్పుడూ స్పందించింది లేదు.
ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో బాలయ్య వద్ద ఇదే విషయం ప్రస్తావిస్తే ఆ విషయం నిజమే అన్నాడు. కడప జిల్లాలో తన అభిమాన సంఘం ప్రెసిడెంట్గా జగన్ ఉండేవాడని బాలయ్య వ్యాఖ్యానించడం విశేషం. ఈ వ్యాఖ్య చేసి ఇదేమంత ఆశ్చర్యపడాల్సిన విషయం కాదన్నట్లుగా బాలయ్య మాట్లాడాడు.
ఒకప్పుడు ఎన్టీఆర్కు అభిమాని కాని వాళ్లు ఎవరైనా ఉండేవాళ్లా అని ప్రశ్నించాడు బాలయ్య. ఆయన కాంగ్రెస్ పార్టీ మీద పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ పెట్టారని.. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో 30 శాతం మంది నాయకులు ఎన్టీఆర్కు వీరాభిమానులని అన్నాడు బాలయ్య.
ఒకప్పుడు ‘సమరసింహారెడ్డి’ సంచలన విజయం సాధించిన సందర్భంగా బాలయ్యకు శుభాకాంక్షలు చెబుతూ జగన్ ఇచ్చినట్లుగా ఒక యాడ్ ఆ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అప్పుడు జగన్ పేరు కింద కడప జిల్లా బాలయ్య అభిమానుల సంఘం అధ్యక్షుడనే వేశారు. ఐతే అది ఒరిజినల్ కాదని.. ఫేక్ అని.. కొందరు జగన్ అభిమానులు వాదించారు.
దానికి పేరడీగా అనేక కొత్త యాడ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆ యాడ్ ఒరిజినలా కాదా అన్నది జనాలకు అర్థం కాలేదు. మరి నిజంగా జగన్ బాలయ్యకు వీరాభిమానా కాదా అన్నది ఆయన సన్నిహితులే చెప్పాలి.
This post was last modified on June 7, 2020 4:41 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…