హీరో శర్వానంద్ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి సరికొత్త కథలను ఎన్నుకుంటూ టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఒక్క హిట్టు కూడా కొట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ‘మహానుభావుడు’ సినిమా తరువాత ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా లేదు.
ఆయన నటించిన ‘పడి పడి లేచే మనసు’, ‘రణరంగం’, ‘జాను’, ‘శ్రీకారం’, ‘మహాసముద్రం’ ఇవన్నీ కూడా ఫ్లాపులే. ఒకటి కాదు రెండు కాదు.. వరుసగా ఐదు ఫ్లాప్ లు రావడంతో శర్వా కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది.
శర్వానంద్ ను ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథల్లో చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడతారు. అందుకే ఈసారి ఫ్యామిలీ కథతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాలో నటిస్తున్నాడు శర్వానంద్. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. తన అదృష్టంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది రష్మిక. వరుస విజయాలతో కెరీర్ లో దూసుకుపోతుంది.
ఆమెకి ఉన్న క్రేజ్, లక్ కలిసొచ్చి ఈ సినిమా గనుక ఆడితే.. శర్వానంద్ కి హిట్ వస్తుంది. మరి రష్మిక లక్ శర్వాను కాపాడుతుందో లేదో చూద్దాం. ఇక ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్నారు. గతంలో ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ వంటి హిట్టు సినిమాలను తీశారాయన. మరోసారి ఈ సినిమాతో హిట్ అందుకోవాలని చూస్తున్నారు!
This post was last modified on November 29, 2021 5:18 pm
ఉత్తరాది హారర్ కామెడీ అనే జానర్ కు కమర్షియల్ రేంజ్ తీసుకొచ్చిన ఘనత లారెన్స్ రాఘవేంద్రకే దక్కుతుంది. ముని సినిమా…
కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్పటి వరకు వైసీపీ కొంత మేరకు హవా చెలాయిస్తున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు…
దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయకుడు అయినా.. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…