హీరో శర్వానంద్ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి సరికొత్త కథలను ఎన్నుకుంటూ టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఒక్క హిట్టు కూడా కొట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ‘మహానుభావుడు’ సినిమా తరువాత ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా లేదు.
ఆయన నటించిన ‘పడి పడి లేచే మనసు’, ‘రణరంగం’, ‘జాను’, ‘శ్రీకారం’, ‘మహాసముద్రం’ ఇవన్నీ కూడా ఫ్లాపులే. ఒకటి కాదు రెండు కాదు.. వరుసగా ఐదు ఫ్లాప్ లు రావడంతో శర్వా కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది.
శర్వానంద్ ను ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథల్లో చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడతారు. అందుకే ఈసారి ఫ్యామిలీ కథతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాలో నటిస్తున్నాడు శర్వానంద్. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. తన అదృష్టంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది రష్మిక. వరుస విజయాలతో కెరీర్ లో దూసుకుపోతుంది.
ఆమెకి ఉన్న క్రేజ్, లక్ కలిసొచ్చి ఈ సినిమా గనుక ఆడితే.. శర్వానంద్ కి హిట్ వస్తుంది. మరి రష్మిక లక్ శర్వాను కాపాడుతుందో లేదో చూద్దాం. ఇక ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్నారు. గతంలో ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ వంటి హిట్టు సినిమాలను తీశారాయన. మరోసారి ఈ సినిమాతో హిట్ అందుకోవాలని చూస్తున్నారు!
This post was last modified on November 29, 2021 5:18 pm
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…