హీరో శర్వానంద్ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి సరికొత్త కథలను ఎన్నుకుంటూ టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఒక్క హిట్టు కూడా కొట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ‘మహానుభావుడు’ సినిమా తరువాత ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా లేదు.
ఆయన నటించిన ‘పడి పడి లేచే మనసు’, ‘రణరంగం’, ‘జాను’, ‘శ్రీకారం’, ‘మహాసముద్రం’ ఇవన్నీ కూడా ఫ్లాపులే. ఒకటి కాదు రెండు కాదు.. వరుసగా ఐదు ఫ్లాప్ లు రావడంతో శర్వా కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది.
శర్వానంద్ ను ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథల్లో చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడతారు. అందుకే ఈసారి ఫ్యామిలీ కథతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాలో నటిస్తున్నాడు శర్వానంద్. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. తన అదృష్టంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది రష్మిక. వరుస విజయాలతో కెరీర్ లో దూసుకుపోతుంది.
ఆమెకి ఉన్న క్రేజ్, లక్ కలిసొచ్చి ఈ సినిమా గనుక ఆడితే.. శర్వానంద్ కి హిట్ వస్తుంది. మరి రష్మిక లక్ శర్వాను కాపాడుతుందో లేదో చూద్దాం. ఇక ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్నారు. గతంలో ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ వంటి హిట్టు సినిమాలను తీశారాయన. మరోసారి ఈ సినిమాతో హిట్ అందుకోవాలని చూస్తున్నారు!
This post was last modified on November 29, 2021 5:18 pm
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…