సల్మాన్ ఖాన్ సినిమాలకు టాక్తో సంబంధం లేకుండా వసూళ్ల మోత మోగడం మామూలే. తొలి రోజు అలవోకగా పదుల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుంటాయి ఆయన సినిమాలు. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న రేస్-3, దబంగ్-3 చిత్రాలకు కూడా ఓపెనింగ్స్ వరకు ఢోకా లేకపోయింది. కొవిడ్ వల్ల బాలీవుడ్ సినిమాలకు గట్టి దెబ్బ తగలడంతో ఆయన చివరి సినిమా ‘రాధె’ను ఓటీటీలో రిలీజ్ చేసి బయటపడిపోయారు. కానీ ఈ మధ్యే మహారాష్ట్ర సహా నార్త్ మార్కెట్లో పూర్తిగా థియేటర్లు పున:ప్రారంభమై బాగానే నడుస్తుండటంతో సల్మాన్ కొత్త చిత్రం ‘అంతిమ్’ను ఈ శుక్రవారం ధైర్యంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.
ఐతే ఈ సినిమాకు ఆశించినంత మంచి టాక్ రాలేదు. రివ్యూలు మిక్స్డ్గా వచ్చాయి. అలాగని దీన్ని చెత్త సినిమా అని కూడా అనలేం. కాగా ఈ చిత్రానికి తొలి రోజు వచ్చిన వసూళ్లు షాకింగ్గా ఉన్నాయి.ఇండియాలో తొలి రోజు నాలుగున్నర కోట్ల లోపు గ్రాస్ రాబట్టింది ‘అంతిమ్’. సల్మాన్ కెరీర్లో గద పదేళ్లలో ఏ సినిమాకూ ఇంత తక్కువ వసూళ్లు రాలేదు. భాయ్ ఎంత చెత్త సినిమా చేసినా కనీసం రూ.15 కోట్ల గ్రాస్ గ్యారెంటీ అన్నట్లుండేది. అలాంటిది ‘అంతిమ్’కు మరీ ఇంత నామమాత్రపు వసూళ్లు రావడం చిత్ర బృందానికి జీర్ణం కావడం లేదు.
కొవిడ్ను సాకుగా చూపిద్దామంటే.. గత నెలలో రిలీజైన అక్షయ్ కుమార్ మూవీ ‘సూర్యవంశీ’ తొలి రోజు రూ.20 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ చిత్రం ఆల్రెడీ రూ.200 కోట్ల క్లబ్లో చేరింది కూడా. ఈ సినిమా మూడో వీకెండ్లో సాధించిన వసూళ్లను కూడా ‘అంతిమ్’ అందుకునేలా కనిపించడం లేదు. ‘అంతిమ్’ సినిమాను ప్రధానంగా తన బావమరిది ఆయుష్ శర్మను ప్రమోట్ చేయడానికి, అతడి కెరీర్ను నిలబెట్టడానికి చేశాడు సల్మాన్. ఇందులో ఆయనది పూర్తి స్థాయి పాత్ర కాదు. సినిమాలో లేటుగా ఎంట్రీ ఇస్తుందా క్యారెక్టర్. వసూళ్లు మరీ తక్కువగా ఉండటంతో ఇది సల్మాన్ సినిమా కాదని, ఆయన ఇందులో ఎక్స్టెండెడ్ క్యామియో చేశాడని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయనకు అండగా నిలిచే పీఆర్వోలు, ట్రేడ్ పండిట్లు.
This post was last modified on November 28, 2021 2:03 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…