సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించడం అంత తేలికైన విషయం కాదు. దీని వల్ల జరిగే మంచి కంటే ఎదురయ్యే చెడే ఎక్కువ అన్నది ఆ స్థానంలో ఉన్న వారికే తెలుస్తుంది. చేసిన ఎంతో మంచిని గుర్తించే వాళ్ల కంటే ఏదైనా ప్రతికూల విషయం జరిగితే దాన్ని పట్టుకుని రచ్చ చేసేవాళ్లే ఎక్కువ. దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణానంతరం ఖాళీ అయిన ఆ స్థానంలోకి సినీ పెద్దలెవ్వరూ రావడానికి అంతగా ఇష్టపడలేదు.
అందుక్కారణం.. ఏ సమస్య వచ్చినా ముందుకొచ్చి పరిష్కరించడానికి బాధ్యత తీసుకోవాలి. సాయం కోరే ప్రతి ఒక్కరినీ ఆదుకోవాలి. అవసరం లేని పంచాయితీల్లో తలదూర్చాలి. అందుకే చాలామంది సీనియర్లు దీనికి దూరంగా ఉండిపోయారు. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ స్థానంలోకి రావడానికి ఇష్టం లేకపోయినా కొందరి బలవంతం మేరకో, ఇండస్ట్రీకి సాయం చేయాలన్న తలంపుతోనో బాధ్యత తీసుకున్నారు. ఇదేమీ అధికారిక హోదా కాకపోయినా చిరంజీవి ఎంత బాధ్యతతో వ్యవహరించాడో కొన్నేళ్ల నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు. కరోనా టైంలో ఆయన చేసిన సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇక సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం కొన్ని వేదికల మీద రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను చేతులు జోడించి వేడుకున్న సంస్కారం ఆయనది. సినీ పరిశ్రమలోని వ్యక్తులకు కష్టాలు వస్తే చేతికి ఎముక లేనట్లు సాయం అందజేస్తున్న చిరు.. తాజాగా శివశంకర్ మాస్టర్ కొవిడ్ వల్ల విషమ స్థితికి చేరుకున్నారని తెలిసి ఆయన కొడుకుని పిలిపించి రూ.3 లక్షల సాయం అందజేశారు. ఐతే చిరు అనధికారిక సినీ పెద్దగా ఇంత బాధ్యతతో వ్యవహరిస్తుంటే.. ఈ స్థానం ఖాళీగా ఉందని, అందులోకి మోహన్ బాబు రావాలని ‘మా’ ఎన్నికల టైంలో నరేష్ వ్యాఖ్యానించడం ఇక్కడ ప్రస్తావనార్హం.
ఓపెన్గా మాట్లాడాలంటే ఇప్పుడు శివశంకర్ మాస్టర్ కష్టంలో ఉంటే చిరు కాకుండా ఎవరైనా ఇండస్ట్రీలో స్పందించి ఇలా సాయం అందించారా అన్నది చూడాలి. అసలు ఏపీలో టికెట్ల రేట్ల నియంత్రణ వల్ల తీరని నష్టం జరుగుతున్నా, ఇండస్ట్రీనే సంక్షోభంలో పడే పరిస్థితి ఉన్నా ఇండస్ట్రీలో ఎవ్వరూ నోరు మెదపట్లేదు. చిరు మాత్రమే ఈ విషయంలోనూ స్పందించారు. రేట్లు మార్చాలని కోరారు. హోదాను అనుభవించడం వేరు.. ఇలా అవసరమైతే సాయానికి ముందుకు రావడం, ఇండస్ట్రీ కోసం మాట్లాడ్డం వేరు. ఈ విషయంలో చిరుకు, మిగతా వాళ్లకు ఏమైనా పోలిక ఉందా?
This post was last modified on November 27, 2021 6:19 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…