అద్భుతమైన టెక్నికల్ వేల్యూస్తో, భారీ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్తో కూడిన సినిమాలను కూడా కొన్ని నెలల్లో తీసేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. అయినా కానీ బాలీవుడ్లో ఓ సినిమా నాలుగేళ్లుగా తెరకెక్కుతోంది. వచ్చే యేడు కానీ ప్రేక్షకుల ముందుకు రావడం కుదరదంటోంది. అసలు అప్పుడైనా వస్తుందో రాదోననే డౌట్ అందరినీ వెంటాడుతోంది. ఆ సినిమాయే.. బ్రహ్మాస్త్ర.
రణ్బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రం తెలుగువారికి కూడా ప్రత్యేకమే. ఎందుకంటే చాలాకాలం తర్వాత నాగార్జున నటిస్తున్న హిందీ చిత్రమిది. అజయ్ వశిష్ఠ్ అనే ఆర్కియాలజిస్ట్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. అందుకే తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ వెయిటింగ్ వయసు ఇప్పటికి నాలుగేళ్లు.
2017 అక్టోబర్లో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు కరణ్. అది కూడా ఒక సినిమా కాదు. ట్రయాలజీగా తీసుకు రానున్నట్టు చెప్పాడు. మొదటి పార్ట్ షూటింగ్ 2018 జనవరిలో మొదలైంది. అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. పోనీ కరోనా వల్ల ఓ అర్ధ సంవత్సరమో, మరీ కాదంటే ఓ సంవత్సరం పోయిందనుకున్నా.. ఒక సినిమా తీయడానికి ఇది చాలా ఎక్కువ కాలం కిందే లెక్క. 2019 ఆగస్ట్లో రిలీజ్ చేస్తామని మొదటే ప్రకటించినా.. అప్పటికి సినిమా పావువంతు కూడా పూర్తి కాలేదు. దాంతో వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కొత్త డేట్కి ఫిక్సయ్యారు. వచ్చే యేడు సెప్టెంబర్ 9న రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
అంటే ఐదేళ్లకి బ్రహ్మాస్త్ర బైటికొస్తోందన్నమాట. ఇదొక సూపర్ హీరో ఫిల్మ్. సూపర్ నేచురల్ ఫార్మాట్లో ఉండే రొమాంటిక్ ఫెయిరీ టేల్. అయాన్ ముఖర్జీ ఈ సినిమా స్క్రిప్ట్ మీద ఆరేళ్లు కూర్చున్నాడట. మూడు పార్ట్స్ తీయడానికి పదేళ్లు పట్టొచ్చని ముందే ఫిక్సయ్యాడట. కానీ మొదటి భాగానికే ఇన్నేళ్లు పట్టింది. మరి మిగతా రెండు పార్ట్స్ ఎప్పటికి వస్తాయో దేవుడికెరుక.
This post was last modified on November 27, 2021 12:57 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…