సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల ‘అన్నాత్తే’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా ‘పెద్దన్న’ అనే పేరుతో తెలుగులో విడుదలైంది. తెలుగులో ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికీ.. తమిళంలో మాత్రం భారీ వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లో లాస్ట్ సినిమా అని.. ఆయన సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారంటూ ఊహాగానాలు వినిపించాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది.
రీసెంట్ గా రజినీకాంత్ మరో సినిమా సైన్ చేసినట్లు సమాచారం. ‘అన్నాత్తే’ సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ తో రజినీకాంత్ కి ఓ అగ్రిమెంట్ ఉందట. అదే బ్యానర్ లో మరో సినిమా చేయడానికి తలైవా ఓకే చెప్పారట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి దర్శకుడు కూడా సెట్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు పాండిరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారట.
పాండిరాజ్ స్క్రిప్ట్ రజినీకాంత్ కి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలానే ‘అన్నాత్తే’ సినిమాను డైరెక్ట్ చేసిన శివ.. రజినీకాంత్ తో మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ డిస్కషన్ స్టేజ్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ కూడా ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. పాలిటిక్స్ నుంచి తప్పుకున్న రజినీకాంత్ ఇప్పుడు పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు.
This post was last modified on November 25, 2021 2:42 pm
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…