ఉదయ్ కిరణ్ పేరెత్తితే చాలు.. జనాల నోట్లో అయ్యో పాపం అన్న మాటొస్తుంది. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి వరుస విజయాలతో చూస్తుండగానే స్టార్ అయిపోయాడతను. మనలో ఒకడిలా అనిపించే కుర్రాడు అలా హీరోగా ఎదుగుతుంటే అందరికీ చాలా ఆనందమేసింది. హీరోగా ఇంకా పెద్ద స్థాయికి వెళ్తాడనుకుంటే.. అనూహ్యంగా వరుస పరాజాలు చుట్టుముట్టి వెనుకబడిపోయాడు. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డట్లే కనిపించాడు కానీ.. ఏం జరిగిందో ఏమో.. ఆత్మహత్య చేసుకుని అర్ధంతరంగా తనువు చాలించేశాడు.
ఉదయ్ చనిపోయి ఏడేళ్లు దాటినా ఇంకా తన మరణం అభిమానులను బాధ పెడుతూనే ఉంది. ఉదయ్ ఇలా చేసి ఉండాల్సింది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో అతడికి అంత కష్టం ఏమొచ్చిందో అన్న ఆలోచనా అభిమానుల్లో కలుగుతోంది. ఉదయ్ ఆత్మహత్యకు పాల్పడ్డ సమయంలో అందుకు కారణాలేంటో లేఖలాంటిదేమీ రాసినట్లు వార్తలేమీ రాలేదు.
కానీ ఉదయ్ చనిపోయి ఏడేళ్ల తర్వాత అతడి సుసైడ్ నోట్ గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో తిరుగుతోంది. తన భార్యనుద్దేశించి ఉదయ్ రాసిన లేఖగా దీన్ని భావిస్తున్నారు. ఇది నిజంగా ఉదయ్ రాసిందా.. ఎవరైనా క్రియేట్ చేశారా అన్నది తెలియదు కానీ.. ఈ లేఖ సారాంశం ఏంటో ఒకసారి చూద్దాం పదండి.
‘‘విషితా మా అమ్మ అంటే ఎంత ఇష్టమో.. ఆ తర్వాత అంతగా నేను ప్రేమించిన అమ్మాయివి నువ్వు. అయితే మన మధ్య గొడవల కారణంగా అంకుల్, ఆంటీ చాలా బాధ పడుతున్నారు. వారికి ఈ బాధ ఉండకూడదు. నువ్వు అతడు మంచివాడు అని అనుకుంటున్నావు.. కానీ అతను అస్సలు మంచివాడు కాదు. నా మాట విను. నువ్వు నిజం తెలుసుకునే రోజు వస్తుంది. కానీ అప్పుడు ఉదయ్ ఉండడు. నువ్వు ఒకసారి అమెరికా వెళ్లి వైద్యం చేయించుకో. నాకు సినీ ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదురయ్యాయి. నన్ను ఓ మ్యాడ్గా చిత్రీకరించి ఆడుకుంది. మన మధ్య గొడవల కారణంగా చాలా మంది బాధ పడుతున్నారు. అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకు ఇవ్వు. వాటిని తను జాగ్రత్తగా దాచుకుంటుంది. అమ్మా నిన్ను ఓసారి కౌగిలించుకుని ఏడ్వాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వస్తున్నా’’.. ఇదీ ఉదయ్ రాసిన లేఖలో ఉన్నట్లుగా చెబుతున్న సారాంశం. ఇదే నిజమైతే చనిపోవడానికి ముందు భార్యతో ఉదయ్కి గొడవలున్నాయని స్పష్టమవుతోంది.
This post was last modified on November 24, 2021 3:36 pm
https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA రెగ్యులర్ కాన్సెప్ట్స్ జోలికి వెళ్లకుండా విభిన్నంగా ట్రై చేసే హీరోగా సుహాస్ కి మంచి గుర్తింపు ఉంది. ఒక్కో…
విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారా…
రెండేళ్ల నిరీక్షణకు తగ్గట్టు టిల్లు స్క్వేర్ రూపంలో అద్భుత ఫలితం అందుకున్న సిద్ధూ జొన్నలగడ్డ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో…
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం…
సినిమా విడుదల ప్లానింగ్ సమయంలో పోటీ ఎంత ఉందనేది చూసుకోవడం చాలా ముఖ్యం. ఊరికే డేట్ వేసుకున్నామని తొందరపడితే బ్రేక్…
శాసనసభ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నది. నాలుగు నెలల కాంగ్రెస్ వైఫల్యాలను…