Prabhas
కొన్నేళ్ల ముందు వరకు బాలీవుడ్ సూపర్ స్టార్లు ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల దాకా పారితోషకం తీసుకుంటున్నారంటే ఔరా అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు మన తెలుగు స్టార్ హీరోలే దాదాపు 50 కోట్ల మేర పారితోషకాలు పుచ్చుకుంటున్నారు. బాలీవుడ్ హీరోల రేంజ్ దానికి డబుల్ అయింది. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలు వంద కోట్ల రెమ్యూనరేన్ క్లబ్లో ఉన్నారు. వీరిలో కొందరు లాభాల్లో వాటా కింద వంద కోట్లకు మించి కూడా ఒక్కో సినిమాకు ఆదాయం పొందుతున్న దాఖలాలున్నాయి. వీళ్లందరి నెక్స్ట్ టార్గెట్ రూ.150 కోట్లే.
ఐతే ఈ మార్కును బాలీవుడ్ స్టార్లు కాకుండా ఒక తెలుగు హీరో అందుకోబోతున్నాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆ హీరో ప్రభాస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్.. తన సినిమాల బడ్జెట్లు, పారితోషకాల విషయంలో కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాడు.
ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోయ సినిమాకు గాను ప్రభాస్ రూ.150 కోట్లతో రికార్డు పారితోషకం అందుకోబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ప్రభాస్తో సినిమా చేయాలని ఎప్పట్నుంచో చూస్తున్న టీ సిరీస్ సంస్థ.. ఈమేర రికార్డు రెమ్యూనరేషన్ ఆఫర్తో అతడిని సినిమాకు ఒప్పించినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే ఎక్కువ కాల్ షీట్స్ ఇవ్వడానికి కూడా ప్రభాస్ రెడీ అయ్యాడట.
ఈ సినిమాను ఈ మధ్యే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇది పట్టాలెక్కడానికి ఇంకో రెండేళ్ల సమయం పట్టే అవకాశముంది. ఆలోపు రాధేశ్యామ్ సలార్, ఆదిపురుష్ లాంటి భారీ సినిమాలు రిలీజై ఉంటాయి. ప్రాజెక్ట్ కే కూడా పూర్తి కావస్తుంది. కాబట్టి ప్రభాస్ రేంజ్ ఇంకా పెరిగే అవకాశముంది. మార్కెట్ లెక్కలు కూడా మారుతుంటాయి కాబట్టి ఈ చిత్రానికి ప్రభాస్ రూ.150 కోట్ల పారితోషకం తీసుకోబోతున్నాడంటే మరీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
This post was last modified on November 24, 2021 9:45 am
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…