Prabhas
కొన్నేళ్ల ముందు వరకు బాలీవుడ్ సూపర్ స్టార్లు ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల దాకా పారితోషకం తీసుకుంటున్నారంటే ఔరా అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు మన తెలుగు స్టార్ హీరోలే దాదాపు 50 కోట్ల మేర పారితోషకాలు పుచ్చుకుంటున్నారు. బాలీవుడ్ హీరోల రేంజ్ దానికి డబుల్ అయింది. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలు వంద కోట్ల రెమ్యూనరేన్ క్లబ్లో ఉన్నారు. వీరిలో కొందరు లాభాల్లో వాటా కింద వంద కోట్లకు మించి కూడా ఒక్కో సినిమాకు ఆదాయం పొందుతున్న దాఖలాలున్నాయి. వీళ్లందరి నెక్స్ట్ టార్గెట్ రూ.150 కోట్లే.
ఐతే ఈ మార్కును బాలీవుడ్ స్టార్లు కాకుండా ఒక తెలుగు హీరో అందుకోబోతున్నాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆ హీరో ప్రభాస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్.. తన సినిమాల బడ్జెట్లు, పారితోషకాల విషయంలో కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాడు.
ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోయ సినిమాకు గాను ప్రభాస్ రూ.150 కోట్లతో రికార్డు పారితోషకం అందుకోబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ప్రభాస్తో సినిమా చేయాలని ఎప్పట్నుంచో చూస్తున్న టీ సిరీస్ సంస్థ.. ఈమేర రికార్డు రెమ్యూనరేషన్ ఆఫర్తో అతడిని సినిమాకు ఒప్పించినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే ఎక్కువ కాల్ షీట్స్ ఇవ్వడానికి కూడా ప్రభాస్ రెడీ అయ్యాడట.
ఈ సినిమాను ఈ మధ్యే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇది పట్టాలెక్కడానికి ఇంకో రెండేళ్ల సమయం పట్టే అవకాశముంది. ఆలోపు రాధేశ్యామ్ సలార్, ఆదిపురుష్ లాంటి భారీ సినిమాలు రిలీజై ఉంటాయి. ప్రాజెక్ట్ కే కూడా పూర్తి కావస్తుంది. కాబట్టి ప్రభాస్ రేంజ్ ఇంకా పెరిగే అవకాశముంది. మార్కెట్ లెక్కలు కూడా మారుతుంటాయి కాబట్టి ఈ చిత్రానికి ప్రభాస్ రూ.150 కోట్ల పారితోషకం తీసుకోబోతున్నాడంటే మరీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
This post was last modified on November 24, 2021 9:45 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…