Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మరపురాని చిత్రాల్లో విజేత ఒకటి. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఒకప్పటి అగ్ర దర్శకుడు కోదండరామిరెడ్డి కలయికలో చిరంజీవి ఈ సినిమా చేశాడు. అదిపోయే డ్యాన్సులు, ఫైట్లతో అలరిస్తూ.. హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యే యాక్షన్ ప్రధాన సినిమాలతో సాగిపోతున్న టైంలో.. చిరు కొంచెం రూటు మార్చి ఒక ఉదాత్త కథాంశంతో తెరకెక్కిన విజేత చిత్రంలో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
కుటుంబం కోసం తండ్రి పడుతున్న కష్టం చూసి, తోడబుట్టిన మిగతా వాళ్లంతా బాధ్యత మరిస్తే, తనకెంతో ఇష్టమైన ఫుట్బాల్ మీద ఆశ చంపుకుని కిడ్నీ అమ్మి వచ్చిన డబ్బుతో చెల్లెలి పెళ్లి చేసే కుర్రాడి పాత్రను పోషించాడు చిరు ఈ చిత్రంలో. తాను ఒక విభిన్నమైన, గొప్ప ప్రయత్నం చేశానని.. దీన్ని ఆదరించాలని చిరు కోరే దృశ్యం కూడా ఉంటుంది టైటిల్స్లో. కమర్షియల్గా ఓ మోస్తరు ఫలితాన్నందుకున్నప్పటికీ చిరు కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమాల్లో ఇదొకటి.
ఇప్పుడు విజేత గురించి ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే.. ఈ క్లాసిక్కు చిరు ఇప్పుడు సీక్వెల్ చేయబోతున్నాడట. చిరు ఫ్యూచర్ ప్రాజెక్టుల లిస్టులో దీన్ని కూడా చూపిస్తున్నారు. యన్.టి.ఆర్, 83, తలైవి లాంటి సినిమాలను నిర్మించిన విష్ణువర్ధన్ ఇందూరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాడట. సైమా అవార్డులను నిర్వహించే విష్ణుకు చిరుతో మంచి అనుబంధమే ఉంది. తనకో సినిమా చేయాలని చిరు అడగ్గా.. ఆయన అంగీకరించారని, చిరు సినిమాల్లో తనకెంతో నచ్చిన విజేత మూవీకి సీక్వెల్ తీయాలని విష్ణు భావిస్తున్నారని.. ఇంకా ఈ చిత్రానికి దర్శకుడు ఖరారు కాలేదని.. కథ, దర్శకుడు రెడీ అయ్యాక చిరుతో ఈ సినిమాను పట్టాలెక్కిస్తారని..
ఈ ప్రాజెక్టుకు చిరు కమిట్మెంట్ అయితే ఇచ్చారని అంటున్నారు. మరి 36 ఏళ్ల ముందు వచ్చిన ఈ సినిమాకు కొనసాగింపుగా ఇప్పుడు ఎలాంటి కథ రెడీ చేసి సినిమా తీస్తారో చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…