Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మరపురాని చిత్రాల్లో విజేత ఒకటి. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఒకప్పటి అగ్ర దర్శకుడు కోదండరామిరెడ్డి కలయికలో చిరంజీవి ఈ సినిమా చేశాడు. అదిపోయే డ్యాన్సులు, ఫైట్లతో అలరిస్తూ.. హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యే యాక్షన్ ప్రధాన సినిమాలతో సాగిపోతున్న టైంలో.. చిరు కొంచెం రూటు మార్చి ఒక ఉదాత్త కథాంశంతో తెరకెక్కిన విజేత చిత్రంలో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
కుటుంబం కోసం తండ్రి పడుతున్న కష్టం చూసి, తోడబుట్టిన మిగతా వాళ్లంతా బాధ్యత మరిస్తే, తనకెంతో ఇష్టమైన ఫుట్బాల్ మీద ఆశ చంపుకుని కిడ్నీ అమ్మి వచ్చిన డబ్బుతో చెల్లెలి పెళ్లి చేసే కుర్రాడి పాత్రను పోషించాడు చిరు ఈ చిత్రంలో. తాను ఒక విభిన్నమైన, గొప్ప ప్రయత్నం చేశానని.. దీన్ని ఆదరించాలని చిరు కోరే దృశ్యం కూడా ఉంటుంది టైటిల్స్లో. కమర్షియల్గా ఓ మోస్తరు ఫలితాన్నందుకున్నప్పటికీ చిరు కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమాల్లో ఇదొకటి.
ఇప్పుడు విజేత గురించి ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే.. ఈ క్లాసిక్కు చిరు ఇప్పుడు సీక్వెల్ చేయబోతున్నాడట. చిరు ఫ్యూచర్ ప్రాజెక్టుల లిస్టులో దీన్ని కూడా చూపిస్తున్నారు. యన్.టి.ఆర్, 83, తలైవి లాంటి సినిమాలను నిర్మించిన విష్ణువర్ధన్ ఇందూరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాడట. సైమా అవార్డులను నిర్వహించే విష్ణుకు చిరుతో మంచి అనుబంధమే ఉంది. తనకో సినిమా చేయాలని చిరు అడగ్గా.. ఆయన అంగీకరించారని, చిరు సినిమాల్లో తనకెంతో నచ్చిన విజేత మూవీకి సీక్వెల్ తీయాలని విష్ణు భావిస్తున్నారని.. ఇంకా ఈ చిత్రానికి దర్శకుడు ఖరారు కాలేదని.. కథ, దర్శకుడు రెడీ అయ్యాక చిరుతో ఈ సినిమాను పట్టాలెక్కిస్తారని..
ఈ ప్రాజెక్టుకు చిరు కమిట్మెంట్ అయితే ఇచ్చారని అంటున్నారు. మరి 36 ఏళ్ల ముందు వచ్చిన ఈ సినిమాకు కొనసాగింపుగా ఇప్పుడు ఎలాంటి కథ రెడీ చేసి సినిమా తీస్తారో చూడాలి.
This post was last modified on November 24, 2021 9:41 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…