ఒకప్పుడు ఒక మేల్ సింగ్, ఒక లేడీ సింగర్ కలిసి సినిమాలో మొత్తం పాటలు పాడేసేవారు. ఆ తర్వాత సినిమాలో ఒక్కో పాటను ఒక్కో సింగర్తో పాడించడం మొదలైంది. ఇప్పుడు ఒక పాటనే ఇద్దరు ముగ్గురు పాడే సంస్కృతి కూడా చూస్తున్నాం. ఐతే అలా సింగర్స్ సంఖ్య ఎంత పెరిగినా కూడా ఒక సినిమాకు మొత్తంగా మహా అయితే పది మంది సింగర్స్ పని చేస్తే ఎక్కువ.
ఒకవేళ కోరస్ పాడే సింగర్స్ను కూడా కలిపితే ఈ సంఖ్య డబులో ట్రిపులో కావచ్చేమో. కానీ ఒక సినిమా కోసం ఏకంగా 120 మంది గాయనీ గాయకులు పని చేశారంటే నమ్మగలమా? ఇది ఒక తెలుగు సినిమా విషయంలోనే జరిగింది. ఆ సినిమా నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో తెరకెక్కిన అఖండ కావడం విశేషం. ఈ ఒక్క సినిమా కోసం 120 మంది సింగర్స్ పని చేసిన విషయాన్ని స్వయంగా సంగీత దర్శకుడు తమన్ వెల్లడించాడు.
ఇటీవలే విడుదలై అందరినీ ఆకట్టుకున్న అఖండ టైటిల్ సాంగ్ కోసం పదుల సంఖ్యలో సింగర్స్ పని చేసినట్లు తమన్ వెల్లడించాడు. మిగతా పాటలకు కూడా కోరస్ సింగర్స్ చాలా మంది అవసరం పడ్డారని.. సినిమాలో ఒక్కో పాట కోసం ఇద్దరు ముగ్గురు ప్రముఖ గాయనీ గాయకులు పని చేశారని.. అలా మొత్తం సింగర్స్ సంఖ్య 120కి చేరిందని తమన్ తెలిపాడు. తాను క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడనని.. ఏ పాట ఎవరు పాడాలో వారు పాడితేనే బాగుంటుందని.. అందుకే శివుడి మీద నడిచే అఖండ టైటిల్ సాంగ్ను శంకర్ మహదేవన్ పాడితేనే బాగుంటుందని ఆయన్ని తీసుకొచ్చామని తమన్ తెలిపాడు.
ఈ ఒక్క పాటకే నెల రోజుల సమయం తీసుకున్నామని.. అఘోరాల గురించి ఎంతో రీసెర్చ్ చేసి ఈ సాంగ్ రికార్డ్ చేశామని తమన్ వెల్లడించాడు. అఖండ లాంటి సినిమా ఇండియన్ స్క్రీన్ మీద రాలేదని.. తన కెరీర్లోనే సంగీత పరంగా టాప్లో ఉండే సినిమాల్లో ఇదొకటని తమన్ అభిప్రాయపడ్డాడు.
This post was last modified on November 23, 2021 10:45 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…