ఒకప్పుడు ఒక మేల్ సింగ్, ఒక లేడీ సింగర్ కలిసి సినిమాలో మొత్తం పాటలు పాడేసేవారు. ఆ తర్వాత సినిమాలో ఒక్కో పాటను ఒక్కో సింగర్తో పాడించడం మొదలైంది. ఇప్పుడు ఒక పాటనే ఇద్దరు ముగ్గురు పాడే సంస్కృతి కూడా చూస్తున్నాం. ఐతే అలా సింగర్స్ సంఖ్య ఎంత పెరిగినా కూడా ఒక సినిమాకు మొత్తంగా మహా అయితే పది మంది సింగర్స్ పని చేస్తే ఎక్కువ.
ఒకవేళ కోరస్ పాడే సింగర్స్ను కూడా కలిపితే ఈ సంఖ్య డబులో ట్రిపులో కావచ్చేమో. కానీ ఒక సినిమా కోసం ఏకంగా 120 మంది గాయనీ గాయకులు పని చేశారంటే నమ్మగలమా? ఇది ఒక తెలుగు సినిమా విషయంలోనే జరిగింది. ఆ సినిమా నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో తెరకెక్కిన అఖండ కావడం విశేషం. ఈ ఒక్క సినిమా కోసం 120 మంది సింగర్స్ పని చేసిన విషయాన్ని స్వయంగా సంగీత దర్శకుడు తమన్ వెల్లడించాడు.
ఇటీవలే విడుదలై అందరినీ ఆకట్టుకున్న అఖండ టైటిల్ సాంగ్ కోసం పదుల సంఖ్యలో సింగర్స్ పని చేసినట్లు తమన్ వెల్లడించాడు. మిగతా పాటలకు కూడా కోరస్ సింగర్స్ చాలా మంది అవసరం పడ్డారని.. సినిమాలో ఒక్కో పాట కోసం ఇద్దరు ముగ్గురు ప్రముఖ గాయనీ గాయకులు పని చేశారని.. అలా మొత్తం సింగర్స్ సంఖ్య 120కి చేరిందని తమన్ తెలిపాడు. తాను క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడనని.. ఏ పాట ఎవరు పాడాలో వారు పాడితేనే బాగుంటుందని.. అందుకే శివుడి మీద నడిచే అఖండ టైటిల్ సాంగ్ను శంకర్ మహదేవన్ పాడితేనే బాగుంటుందని ఆయన్ని తీసుకొచ్చామని తమన్ తెలిపాడు.
ఈ ఒక్క పాటకే నెల రోజుల సమయం తీసుకున్నామని.. అఘోరాల గురించి ఎంతో రీసెర్చ్ చేసి ఈ సాంగ్ రికార్డ్ చేశామని తమన్ వెల్లడించాడు. అఖండ లాంటి సినిమా ఇండియన్ స్క్రీన్ మీద రాలేదని.. తన కెరీర్లోనే సంగీత పరంగా టాప్లో ఉండే సినిమాల్లో ఇదొకటని తమన్ అభిప్రాయపడ్డాడు.
This post was last modified on November 23, 2021 10:45 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…