ఒకప్పుడు ఒక మేల్ సింగ్, ఒక లేడీ సింగర్ కలిసి సినిమాలో మొత్తం పాటలు పాడేసేవారు. ఆ తర్వాత సినిమాలో ఒక్కో పాటను ఒక్కో సింగర్తో పాడించడం మొదలైంది. ఇప్పుడు ఒక పాటనే ఇద్దరు ముగ్గురు పాడే సంస్కృతి కూడా చూస్తున్నాం. ఐతే అలా సింగర్స్ సంఖ్య ఎంత పెరిగినా కూడా ఒక సినిమాకు మొత్తంగా మహా అయితే పది మంది సింగర్స్ పని చేస్తే ఎక్కువ.
ఒకవేళ కోరస్ పాడే సింగర్స్ను కూడా కలిపితే ఈ సంఖ్య డబులో ట్రిపులో కావచ్చేమో. కానీ ఒక సినిమా కోసం ఏకంగా 120 మంది గాయనీ గాయకులు పని చేశారంటే నమ్మగలమా? ఇది ఒక తెలుగు సినిమా విషయంలోనే జరిగింది. ఆ సినిమా నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో తెరకెక్కిన అఖండ కావడం విశేషం. ఈ ఒక్క సినిమా కోసం 120 మంది సింగర్స్ పని చేసిన విషయాన్ని స్వయంగా సంగీత దర్శకుడు తమన్ వెల్లడించాడు.
ఇటీవలే విడుదలై అందరినీ ఆకట్టుకున్న అఖండ టైటిల్ సాంగ్ కోసం పదుల సంఖ్యలో సింగర్స్ పని చేసినట్లు తమన్ వెల్లడించాడు. మిగతా పాటలకు కూడా కోరస్ సింగర్స్ చాలా మంది అవసరం పడ్డారని.. సినిమాలో ఒక్కో పాట కోసం ఇద్దరు ముగ్గురు ప్రముఖ గాయనీ గాయకులు పని చేశారని.. అలా మొత్తం సింగర్స్ సంఖ్య 120కి చేరిందని తమన్ తెలిపాడు. తాను క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడనని.. ఏ పాట ఎవరు పాడాలో వారు పాడితేనే బాగుంటుందని.. అందుకే శివుడి మీద నడిచే అఖండ టైటిల్ సాంగ్ను శంకర్ మహదేవన్ పాడితేనే బాగుంటుందని ఆయన్ని తీసుకొచ్చామని తమన్ తెలిపాడు.
ఈ ఒక్క పాటకే నెల రోజుల సమయం తీసుకున్నామని.. అఘోరాల గురించి ఎంతో రీసెర్చ్ చేసి ఈ సాంగ్ రికార్డ్ చేశామని తమన్ వెల్లడించాడు. అఖండ లాంటి సినిమా ఇండియన్ స్క్రీన్ మీద రాలేదని.. తన కెరీర్లోనే సంగీత పరంగా టాప్లో ఉండే సినిమాల్లో ఇదొకటని తమన్ అభిప్రాయపడ్డాడు.
This post was last modified on November 23, 2021 10:45 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…