ఒకప్పుడు పవర్ఫుల్ రోల్స్తో రఫ్పాడించిన రాజశేఖర్.. మధ్యలో కొన్నాళ్లపాటు సరైన సక్సెస్లు రాక స్ట్రగులయ్యాడు. చాలా గ్యాప్ తర్వాత ‘గరుడవేగ’ మూవీ చేసి ఓ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ‘కల్కి’గా వచ్చాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోయినా ఆయన స్పీడుకి బ్రేకులైతే వేయలేదు. ఆ హుషారులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకి కమిటైన ఆయన.. ఆమధ్య తన పుట్టినరోజుకి మూడు సినిమాలని అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశాడు. వాటిలో ‘శేఖర్’ ఒకటి.
లలిత్ దర్శకత్వంలో ఎంఎల్వీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ చూసి అందరూ ఇంప్రెస్ అయిపోయారు. నెరిసిన గడ్డం, మీసాలు, ముఖంపై గాటుతో చాలా డెప్త్ ఉన్న లుక్లో కనిపించాడు రాజశేఖర్. ఇప్పుడు సినిమా ఎలా ఉంటుందో రుచి చూపించడానికి రెడీ అయ్యాడు. ఈ నెల 25న ఫస్ట్ గ్లింప్స్ను రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశాడు యాంగ్రీ స్టార్.
2018లో విడుదలైన మలయాళ సూపర్ హిట్ ‘జోసెఫ్’కి రీమేక్ ఇది. జోజు జార్జ్ నటిస్తూ నిర్మించాడు. బెన్యామీన్ రాసిన ‘శరీరశాస్త్రం’ అనే నవల థీమ్తో ఈ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు ఎం.పద్మకుమార్. మంచి క్రైమ్ థ్రిల్లర్. ఆర్గన్ ట్రేడ్ చుట్టూ తిరుగుతుంది. రిటైర్డ్ పోలీసాఫీరుగా అద్భుతంగా నటించినందుకు కేరళ స్టేట్ అవార్డుతో పాటు నేషనల్ అవార్డును కూడా అందుకున్నాడు జోజు జార్జ్.
అంత గొప్ప సినిమాకి రీమేక్ కావడంతో అందరి దృష్టీ ఈ సినిమాపై ఉంది. లుక్ చూశాక రాజశేఖర్ కూడా జోజు చేసిన పాత్రకి పర్ఫెక్ట్ అనిపిస్తున్నారు. లలిత్ ఎలా తీస్తున్నాడనేదాన్ని బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజశేఖర్కి ఓ సాలిడ్ హిట్ అయితే అవసరం. అది ఈ సినిమాతో దక్కుతుందో లేదో చూడాలి.
This post was last modified on November 22, 2021 8:43 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…