యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మధ్యనే అమెరికాకు వెళ్లి ఇండియా తిరిగొచ్చారు కమల్. ఆ తరువాత ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దగ్గు బాగా వస్తుండడంతో పరీక్షలు చేయించారు. అందులో కరోనా పాజిటివ్ అని తేలింది. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు.
తమిళంలో ట్వీట్ చేసిన ఆయన.. అమెరికా నుంచి తిరిగొచ్చిన తరువాత దగ్గు, జలుబు వచ్చిందని, దీంతో వెంటనే టెస్ట్ చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలిందని.. ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఐసోలేషన్ లో ఉన్నట్లు చెప్పారు. పాండమిక్ ప్రభావం ఇంకా తగ్గలేదని.. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కమల్ హాసన్ రిక్వెస్ట్ చేశారు.
విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ పోస్ట్ లు పెడుతున్నారు. రీసెంట్ గా కమల్ హాసన్ అమెరికాలో బట్టల బిజినెస్ మొదలుపెట్టారు. తన బ్రాండ్ క్లాత్ ఓపెనింగ్ వేడుకలో భాగంగా అమెరికాకు వెళ్లారు. ఇక సినిమాల విషయానికొస్తే.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే సినిమాలో నటిస్తున్నారు కమల్ హాసన్. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 22, 2021 4:44 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…