యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మధ్యనే అమెరికాకు వెళ్లి ఇండియా తిరిగొచ్చారు కమల్. ఆ తరువాత ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దగ్గు బాగా వస్తుండడంతో పరీక్షలు చేయించారు. అందులో కరోనా పాజిటివ్ అని తేలింది. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు.
తమిళంలో ట్వీట్ చేసిన ఆయన.. అమెరికా నుంచి తిరిగొచ్చిన తరువాత దగ్గు, జలుబు వచ్చిందని, దీంతో వెంటనే టెస్ట్ చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలిందని.. ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఐసోలేషన్ లో ఉన్నట్లు చెప్పారు. పాండమిక్ ప్రభావం ఇంకా తగ్గలేదని.. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కమల్ హాసన్ రిక్వెస్ట్ చేశారు.
విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ పోస్ట్ లు పెడుతున్నారు. రీసెంట్ గా కమల్ హాసన్ అమెరికాలో బట్టల బిజినెస్ మొదలుపెట్టారు. తన బ్రాండ్ క్లాత్ ఓపెనింగ్ వేడుకలో భాగంగా అమెరికాకు వెళ్లారు. ఇక సినిమాల విషయానికొస్తే.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే సినిమాలో నటిస్తున్నారు కమల్ హాసన్. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 22, 2021 4:44 pm
ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…