Movie News

ట్రైలర్ టాక్: అన్నాచెల్లెళ్ల స్టోరీ సరికొత్తగా

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకుని నాలుగు నెలలు కావస్తోంది. అయినా సరే.. అప్పుడప్పుడూ ఓ సినిమా ఓటీటీలో రిలీజవుతూనే ఉంది. ఈ వారాంతంలో కూడా ‘అద్భుతం’ అనే చిత్రం హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వచ్చే వారం విక్టరీ వెంకటేష్ చిత్రం ‘దృశ్యం-3’ అమేజాన్ ప్రైమ్‌లో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నవంబరు 25న విడుదలవుతుంది. దీనికి తోడు వచ్చేవారం ఇంకో సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. అదే.. బ్రో. నవీన్ చంద్ర, అవికా గోర్ కీలక పాత్రలు పోషించిన ‘బ్రో’ను సోనీ లివ్ రిలీజ్ చేస్తోంది.

ఈ మధ్యే తెలుగు మార్కెట్ మీద కన్నేసిన సోనీ లివ్.. వివాహ భోజనంబు, ఆకాశవాణి చిత్రాలను నేరుగా తమ ఓటీటీలో విడుదల చేసింది. ఇప్పుడు ‘బ్రో’ సినిమా స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ సందర్భంగా ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. అది ఇంప్రెసివ్‌గానే అనిపిస్తోంది.

ట్రైలర్ చూస్తే అన్నాచెల్లెళ్ల మధ్య సాగే క్యూట్ స్టోరీలా కనిపిస్తోంది ‘బ్రో’. అన్నాచెల్లెళ్ల మధ్య నడిచే కథ అనగానే ఎన్నో సెంటిమెంట్ సినిమాలు కళ్ల ముందు కదలాడతాయి. కానీ ‘బ్రో’ వాటికి భిన్నమైన సినిమాలా కనిపిస్తోంది.

అన్నాచెల్లెళ్ల మధ్య నడిచే గిల్లిగజ్జాలు, స్వీట్ మూమెంట్స్ మధ్య నడిచే సినిమాలా ఉందిది. చిన్నపుడు చెల్లెలితో చాలా సరదాగా గడిపిన అన్న.. తర్వాత చదువు, ఉద్యోగం కోసమని దూరంగా వెళ్లిపోయి.. చాలా ఏళ్లకు తిరిగి రావడం.. వచ్చాక చెల్లెలు చేసే పనులకు ఉక్కిరి బిక్కిరి కావడం.. ముందు ఆమె చర్యలకు కోపం వచ్చినా తర్వాత తనకు చేరువ కావడం.. ఈ నేపథ్యంలో కథ నడిచి.. చివరగా హృద్యమైన సన్నివేశాలతో ముగిసేలా కనిపిస్తోంది. ట్రైలర్ వరకు చూస్తే ‘బ్రో’లో ఒక క్లాసిక్ టచ్ కనిపించింది. సినిమాగా ఎలా ఉంటుందో చూడాలి మరి. కార్తీక్ తురుపాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జేజేఆర్ రవిచంద్ నిర్మించాడు.

This post was last modified on November 20, 2021 10:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

1 hour ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

5 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

6 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

7 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

7 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

9 hours ago