తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకుని నాలుగు నెలలు కావస్తోంది. అయినా సరే.. అప్పుడప్పుడూ ఓ సినిమా ఓటీటీలో రిలీజవుతూనే ఉంది. ఈ వారాంతంలో కూడా ‘అద్భుతం’ అనే చిత్రం హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వచ్చే వారం విక్టరీ వెంకటేష్ చిత్రం ‘దృశ్యం-3’ అమేజాన్ ప్రైమ్లో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నవంబరు 25న విడుదలవుతుంది. దీనికి తోడు వచ్చేవారం ఇంకో సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. అదే.. బ్రో. నవీన్ చంద్ర, అవికా గోర్ కీలక పాత్రలు పోషించిన ‘బ్రో’ను సోనీ లివ్ రిలీజ్ చేస్తోంది.
ఈ మధ్యే తెలుగు మార్కెట్ మీద కన్నేసిన సోనీ లివ్.. వివాహ భోజనంబు, ఆకాశవాణి చిత్రాలను నేరుగా తమ ఓటీటీలో విడుదల చేసింది. ఇప్పుడు ‘బ్రో’ సినిమా స్ట్రీమింగ్కు రెడీ అయింది. ఈ సందర్భంగా ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. అది ఇంప్రెసివ్గానే అనిపిస్తోంది.
ట్రైలర్ చూస్తే అన్నాచెల్లెళ్ల మధ్య సాగే క్యూట్ స్టోరీలా కనిపిస్తోంది ‘బ్రో’. అన్నాచెల్లెళ్ల మధ్య నడిచే కథ అనగానే ఎన్నో సెంటిమెంట్ సినిమాలు కళ్ల ముందు కదలాడతాయి. కానీ ‘బ్రో’ వాటికి భిన్నమైన సినిమాలా కనిపిస్తోంది.
అన్నాచెల్లెళ్ల మధ్య నడిచే గిల్లిగజ్జాలు, స్వీట్ మూమెంట్స్ మధ్య నడిచే సినిమాలా ఉందిది. చిన్నపుడు చెల్లెలితో చాలా సరదాగా గడిపిన అన్న.. తర్వాత చదువు, ఉద్యోగం కోసమని దూరంగా వెళ్లిపోయి.. చాలా ఏళ్లకు తిరిగి రావడం.. వచ్చాక చెల్లెలు చేసే పనులకు ఉక్కిరి బిక్కిరి కావడం.. ముందు ఆమె చర్యలకు కోపం వచ్చినా తర్వాత తనకు చేరువ కావడం.. ఈ నేపథ్యంలో కథ నడిచి.. చివరగా హృద్యమైన సన్నివేశాలతో ముగిసేలా కనిపిస్తోంది. ట్రైలర్ వరకు చూస్తే ‘బ్రో’లో ఒక క్లాసిక్ టచ్ కనిపించింది. సినిమాగా ఎలా ఉంటుందో చూడాలి మరి. కార్తీక్ తురుపాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జేజేఆర్ రవిచంద్ నిర్మించాడు.
This post was last modified on November 20, 2021 10:35 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…