జూబ్లీహిల్స్ ప్రధాన రోడ్డును అనుకొని ఉండే కేబీఆర్ పార్కులో ఆదివారం రాత్రి అనూహ్య సంఘటన జరగటం తెలిసిందే. నటి సాలూ చౌరాసియా వాకింగ్ చేస్తున్న వేళ.. ఆమె మొబైల్ ఫోన్ దొంగలించే ప్రయత్నం చేయటం.. ఆ సందర్భంగా ఆమెపైన దాడికి పాల్పడటం.. పెద్ద రాయితో ఆమెను గాయపరిచే యత్నాన్ని త్రుటిలో తప్పించుకోవటం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ దాడి కమ్ చోరీ నేరంలో నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు పడిన కష్టం అంతా ఇంతా కాదు. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన వేళ.. చోరీ దొంగను పట్టుకోవటం చాలా సులువైంది.
కాకుంటే.. కేబీఆర్ పార్కు చుట్టుపక్కల ఉన్న 60కు పైగా సీసీ కెమేరాలు పని చేయకపోవటంతో పోలీసులకు చిక్కుగా మారింది. దీంతో.. భారీ ఎత్తున డేటాను వడబోయటంతో పాటు.. పోలీస్ టెక్నిక్ లను ఉపయోగించి.. ఎట్టకేలకు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడెవరన్న వివరాలతో పాటు.. అతడిపై గతంలో నమోదైన కేసుల గురించి ఆరాతీశారు. శనివారం మధ్యాహ్నం నిందితుడ్ని మీడియా ముందుకు తీసుకొచ్చిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వివరాల్ని వెల్లడించారు.
నిందితుడుమహబూబ్ నగర్ జిల్లా కు కుల్కచర్ల చెందిన కొమ్ము బాబు గా గుర్తించారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చిన అతను.. సినిమా షూటింగ్ లలో సెట్ వర్కర్ గా పని చేస్తుండేవాడు. ప్రస్తుతం నగరంలోని ఇందిరానగర్ లో ఉండే ఇతడు.. సినిమా షూటింగ్ లలో పని అవకాశాలు తగ్గటంతో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాడు. వీటిని అధిగమించేందుకు చోరీలకు పాల్పడటం మొదలు పెట్టాడు. ఇందుకు కేబీఆర్ పార్కు ఔటర్ ట్రాక్ ను అడ్డాగా ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో షాలూ చౌరాసియాపై దాడి చేసి ఆమె మొబైల్ అపహరించుకెళ్లాడు. ఆమెపై దాడి చేసి.. ఫోన్ చోరీ చేసేందుకు అతను పక్కాగా రెక్కీ నిర్వహించాడు.
ముందుగా వేసుకున్న ప్లాన్ లో భాగంగా ఆమె చీకటి ప్రదేశానికి వచ్చిన వెంటనే ఆమెను వెనుక నుంచి గట్టిగా పట్టుకొని ఆమె నోరు అరవకుండా మూసేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆమె బలంగా ప్రతిఘటిస్తున్నవేళ.. ఆమె తలను బండరాయితో కొట్టే ప్రయత్నం చేసినా.. ఆమె తప్పించుకోవటంతో బతికిపోయింది. ఆమెపై దాడి చేసి ఐఫోన్ దొంగలించాడు. అతడి ప్రైవేట్ పార్ట్ మీద కొట్టిన ఆమె అతడి చెర నుంచి తప్పించుకుంది. నిందితుడు సైతం చోరీ తర్వాత పారిపోయాడు. సీసీ కెమేరాలు పని చేయకపోవటంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకోవటం ఆలస్యమైంది. అయితే.. బంజారాహిల్స్ పోలీసులకు టాస్కు ఫోర్సు పోలీసులు జతకావటంతో ఈ కేసును త్వరగా కొలిక్కి తీసుకు రావటానికి అవకాశం ఏర్పడింది.
నిందితుడ్ని గుర్తించేందుకు గతంలో ఇలాంటి చోరీలు చేసే వారి డేటా తెప్పించి.. అందులో 80 మందిని అనుమానితుల కింద తేల్చి.. ఒక్కొక్కరిగా విచారించిన తర్వాత నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్పారు. గతంలోనే ఇలాంటి నేరాలు చేసినట్లుగా నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలోనూ చోరీ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన చరిత్ర ఉందని పోలీసులు గుర్తించారు.
This post was last modified on November 20, 2021 10:08 pm
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…
గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…