ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యంగా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంట్లో కాలుజారి పడ్డారు. దాంతో ఆయన్ను హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ అందించారు. అనంతరం కోలుకొని డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన ఆరోగ్యం తిరగబడిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన్ను అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం.
వయసురీత్యా ఆయన కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. బయటకు కూడా రావడం లేదు. ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు కొందరు ప్రముఖులు ఆయన్ను ఇంటికి వెళ్లి కలిసొస్తున్నారు. మొన్నామధ్య చిరంజీవి దంపతులు వెళ్లొచ్చారు. 1959లో ‘సిపాయి కూతురు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు కైకాల సత్యనారాయణ. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించారు.
నవరస నట సార్వభౌమగా తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. తనదైన నటనతో అభిమానులను సొంతం చేసుకున్నారు. తన కెరీర్ లో 700కి పైగా చిత్రాల్లో నటించారు. 1935లో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో జూలై 25న కైకాల జన్మించారు. పాతికేళ్ల వయసులో నాగేశ్వరమ్మని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నలుగురు సంతానం.
35 రోజులంటే థియేటర్ రన్ పరంగా చూసుకుంటే మంచి నెంబర్ అనిపిస్తుంది కానీ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అని…
వయస్సు కేవలం నెంబర్ మాత్రమే అనే పదం ఇప్పుడు చాలా మంది అలా ఈజీగా వాడేస్తున్నారు. పూర్వకాలంలో మనిషి దీర్ఘాయుష్సుతో…
కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీకి భారత ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ప్రస్తుతం "టీఆర్ఎస్" పేరును…
నిన్న విడుదలైన సినిమాల్లో నాగబంధంకే రివ్యూలు, సోషల్ మీడియా టాక్స్ ఎక్కువ నెగటివ్ కనిపించాయి. కానీ అనూహ్యంగా గ్రౌండ్ లెవెల్…
నటుడిగా తనలో ఎంత వర్సటాలిటీ ఉందో సత్యదేవ్ చాలాసార్లు నిరూపించాడు. కాకపోతే తన కమర్షియల్ మార్కెట్ పెంచే దర్శకుడు ఇప్పటిదాకా…
అగ్ర నిర్మాత గా ఆదిత్య చోప్రాకున్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షారుఖ్ ఖాన్ కు 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే'…