ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యంగా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంట్లో కాలుజారి పడ్డారు. దాంతో ఆయన్ను హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ అందించారు. అనంతరం కోలుకొని డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన ఆరోగ్యం తిరగబడిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన్ను అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం.
వయసురీత్యా ఆయన కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. బయటకు కూడా రావడం లేదు. ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు కొందరు ప్రముఖులు ఆయన్ను ఇంటికి వెళ్లి కలిసొస్తున్నారు. మొన్నామధ్య చిరంజీవి దంపతులు వెళ్లొచ్చారు. 1959లో ‘సిపాయి కూతురు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు కైకాల సత్యనారాయణ. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించారు.
నవరస నట సార్వభౌమగా తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. తనదైన నటనతో అభిమానులను సొంతం చేసుకున్నారు. తన కెరీర్ లో 700కి పైగా చిత్రాల్లో నటించారు. 1935లో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో జూలై 25న కైకాల జన్మించారు. పాతికేళ్ల వయసులో నాగేశ్వరమ్మని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నలుగురు సంతానం.
This post was last modified on November 20, 2021 2:00 pm
ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్, అగ్ర కథానాయిక నయనతార.. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా…
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో…
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…