స్క్విడ్ గేమ్.. స్క్విడ్ గేమ్.. కొన్ని నెలల నుంచి ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియుల నోళ్లలో నానుతున్న మాట ఇది. ఈ పేరుతో వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులు దోచింది. నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఉర్రూతలూగించి.. అపూర్వమైన ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడీ సిరీస్ సాధించిన ఓ సంచలన రికార్డు గురించి తెలిసి అంతా ఔరా అంటున్నారు.
ఇప్పటిదాకా వెబ్ సిరీస్ల చరిత్రలోనే అత్యధిక సమయం ప్రేక్షకులు వీక్షించిన సిరీస్గా స్క్విడ్ గేమ్ రికార్డు సృష్టించింది. ఆ సమయం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు. ఇప్పటిదాకా నెట్ ఫ్లిక్స్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సిరీస్ను చూసిన సమయం ఏకంగా 1.65 బిలియన్ గంటలట. అంటే మన కాలమానంలోకి మారిస్తే అది ఒక లక్షా 82 వేల సంవత్సరాల సమయమట.
ఈ గణాంకాల్ని బట్టి స్క్విడ్ గేమ్ ఏ స్థాయిలో ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం కూడా లేదు. థ్రిల్లర్ జానర్లో టాప్ క్వాలిటీ సినిమాలు, వెబ్ సిరీస్లకు కొరియన్ ఫిలిం మేకర్స్ పెట్టింది పేరు. అక్కడి ఫిలిం మేకర్ హువాంగ్ డాంగ్ హ్యుక్ నెట్ ఫ్లిక్స్ కోసమే ఈ సిరీస్ను క్రియేట్ చేశాడు. ఇదొక సర్వైవల్ డ్రామా నేపథ్యంలో నడిచే వెబ్ సిరీస్. స్క్విడ్ గేమ్కు సెకండ్ సీజన్ కూడా ఉంటుందని అంటున్నారు.
కాగా ఇటీవలే భారీ అంచనాలతో నెట్ ఫ్లిక్స్లో రిలీజైన మరో సిరీస్ రెడ్ నోటీస్కు కూడా అపూర్వమైన ఆదరణ దక్కుతోంది. ఇప్పటిదాకా ఆ సిరీస్ను 148.7 మిలియన్ గంటల పాటు వీక్షించారట ప్రేక్షకులు. మరో పాపులర్ సిరీస్ మెక్సికో మూడో సీజన్కు కూడా నెట్ ఫ్లిక్స్లో మంచి రెస్పాన్స్ వస్తున్నట్లుగా గణాంకాల్ని బట్టి అర్థమవుతోంది.
This post was last modified on November 18, 2021 9:07 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…