స్క్విడ్ గేమ్.. స్క్విడ్ గేమ్.. కొన్ని నెలల నుంచి ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియుల నోళ్లలో నానుతున్న మాట ఇది. ఈ పేరుతో వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులు దోచింది. నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఉర్రూతలూగించి.. అపూర్వమైన ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడీ సిరీస్ సాధించిన ఓ సంచలన రికార్డు గురించి తెలిసి అంతా ఔరా అంటున్నారు.
ఇప్పటిదాకా వెబ్ సిరీస్ల చరిత్రలోనే అత్యధిక సమయం ప్రేక్షకులు వీక్షించిన సిరీస్గా స్క్విడ్ గేమ్ రికార్డు సృష్టించింది. ఆ సమయం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు. ఇప్పటిదాకా నెట్ ఫ్లిక్స్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సిరీస్ను చూసిన సమయం ఏకంగా 1.65 బిలియన్ గంటలట. అంటే మన కాలమానంలోకి మారిస్తే అది ఒక లక్షా 82 వేల సంవత్సరాల సమయమట.
ఈ గణాంకాల్ని బట్టి స్క్విడ్ గేమ్ ఏ స్థాయిలో ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం కూడా లేదు. థ్రిల్లర్ జానర్లో టాప్ క్వాలిటీ సినిమాలు, వెబ్ సిరీస్లకు కొరియన్ ఫిలిం మేకర్స్ పెట్టింది పేరు. అక్కడి ఫిలిం మేకర్ హువాంగ్ డాంగ్ హ్యుక్ నెట్ ఫ్లిక్స్ కోసమే ఈ సిరీస్ను క్రియేట్ చేశాడు. ఇదొక సర్వైవల్ డ్రామా నేపథ్యంలో నడిచే వెబ్ సిరీస్. స్క్విడ్ గేమ్కు సెకండ్ సీజన్ కూడా ఉంటుందని అంటున్నారు.
కాగా ఇటీవలే భారీ అంచనాలతో నెట్ ఫ్లిక్స్లో రిలీజైన మరో సిరీస్ రెడ్ నోటీస్కు కూడా అపూర్వమైన ఆదరణ దక్కుతోంది. ఇప్పటిదాకా ఆ సిరీస్ను 148.7 మిలియన్ గంటల పాటు వీక్షించారట ప్రేక్షకులు. మరో పాపులర్ సిరీస్ మెక్సికో మూడో సీజన్కు కూడా నెట్ ఫ్లిక్స్లో మంచి రెస్పాన్స్ వస్తున్నట్లుగా గణాంకాల్ని బట్టి అర్థమవుతోంది.
This post was last modified on November 18, 2021 9:07 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…