స్క్విడ్ గేమ్.. స్క్విడ్ గేమ్.. కొన్ని నెలల నుంచి ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియుల నోళ్లలో నానుతున్న మాట ఇది. ఈ పేరుతో వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులు దోచింది. నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఉర్రూతలూగించి.. అపూర్వమైన ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడీ సిరీస్ సాధించిన ఓ సంచలన రికార్డు గురించి తెలిసి అంతా ఔరా అంటున్నారు.
ఇప్పటిదాకా వెబ్ సిరీస్ల చరిత్రలోనే అత్యధిక సమయం ప్రేక్షకులు వీక్షించిన సిరీస్గా స్క్విడ్ గేమ్ రికార్డు సృష్టించింది. ఆ సమయం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు. ఇప్పటిదాకా నెట్ ఫ్లిక్స్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సిరీస్ను చూసిన సమయం ఏకంగా 1.65 బిలియన్ గంటలట. అంటే మన కాలమానంలోకి మారిస్తే అది ఒక లక్షా 82 వేల సంవత్సరాల సమయమట.
ఈ గణాంకాల్ని బట్టి స్క్విడ్ గేమ్ ఏ స్థాయిలో ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం కూడా లేదు. థ్రిల్లర్ జానర్లో టాప్ క్వాలిటీ సినిమాలు, వెబ్ సిరీస్లకు కొరియన్ ఫిలిం మేకర్స్ పెట్టింది పేరు. అక్కడి ఫిలిం మేకర్ హువాంగ్ డాంగ్ హ్యుక్ నెట్ ఫ్లిక్స్ కోసమే ఈ సిరీస్ను క్రియేట్ చేశాడు. ఇదొక సర్వైవల్ డ్రామా నేపథ్యంలో నడిచే వెబ్ సిరీస్. స్క్విడ్ గేమ్కు సెకండ్ సీజన్ కూడా ఉంటుందని అంటున్నారు.
కాగా ఇటీవలే భారీ అంచనాలతో నెట్ ఫ్లిక్స్లో రిలీజైన మరో సిరీస్ రెడ్ నోటీస్కు కూడా అపూర్వమైన ఆదరణ దక్కుతోంది. ఇప్పటిదాకా ఆ సిరీస్ను 148.7 మిలియన్ గంటల పాటు వీక్షించారట ప్రేక్షకులు. మరో పాపులర్ సిరీస్ మెక్సికో మూడో సీజన్కు కూడా నెట్ ఫ్లిక్స్లో మంచి రెస్పాన్స్ వస్తున్నట్లుగా గణాంకాల్ని బట్టి అర్థమవుతోంది.
This post was last modified on November 18, 2021 9:07 am
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…