2022 సంక్రాంతి సినిమాల విషయంలో విపరీతమైన చర్చ నడుస్తోంది కొన్ని రోజులుగా. అనుకోకుండా పండుగ రేసులోకి వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’కు ఎదురెళ్లడం ఎందుకని మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ను వేసవికి వాయిదా వేసేశారు. ఇదే బాటలో పవన్ కళ్యాణ్ చిత్రం ‘భీమ్లా నాయక్’ కూడా నడుస్తుందని అనుకున్నారు కానీ అలాంటిదేమీ జరగలేదు. రాజమౌళి టీం నుంచి విన్నపం వెళ్లినా ‘భీమ్లా నాయక్’ నిర్మాతలు తగ్గలేదని తెలుస్తోంది.
సంక్రాంతి కాదంటే మళ్లీ వేసవి వరకు ఎదురు చూడాలని.. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాను అంత కాలం ఆపలేమని.. వేరే రోజుల్లో రిలీజ్ చేస్తే ఆశించిన వసూళ్లు రావని.. అందుకే సంక్రాంతికే తమ చిత్రాన్ని విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాబట్టే తాము తగ్గేది లేదంటూ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
ఐతే ‘ఆర్ఆర్ఆర్’లో చాలామంది స్టేక్స్ ఉన్నాయి. దిల్ రాజు సహా టాలీవుడ్లో టాప్ డిస్ట్రిబ్యూటర్లు వివిధ ఏరియాలకు ఈ సినిమా హక్కులు తీసుకున్నారు. ‘భీమ్లా నాయక్’ రేసులో ఉంటే కచ్చితంగా థియేటర్ల సమస్య ఎదురవుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజైన ఐదు రోజులకే థియేటర్లలో బాగా కోత తప్పదు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’పై భారీ పెట్టుబడులు పెట్టిన బయ్యర్లకు రికవరీ కష్టమవుతుంది. ‘రాధేశ్యామ్’ వచ్చాక ఎలాగూ థియేటర్లు తగ్గించాల్సిందే కానీ.. అంతకు రెండు రోజుల ముందే మరిన్ని థియేటర్లు పవన్ సినిమాకు కూడా ఇవ్వాలంటే కష్టమే.
అన్నింటికీ మించి ‘బాహుబలి’ లాగే ‘ఆర్ఆర్ఆర్’ కూడా తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలుస్తుందన్న అంచనాల నేపథ్యంలో అలాంటి చిత్రానికి అడ్డంకులు రాకుండా చూసుకోవాలన్న అభిప్రాయం ఇండస్ట్రీ నుంచి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు నేతృత్వంలోని ప్రొడ్యూసర్ గిల్డ్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ‘భీమ్లా నాయక్’ చిత్ర బృందంతో రాజు అండ్ కో చర్చలు జరుపుతున్నారట. ఎలాగైనా సినిమాను వాయిదా వేయించాలని.. తర్వాత ఎప్పుడు వచ్చినా సినిమాకు పూర్తి సహకారం ఉంటుందని, కావాల్సినన్ని థియేటర్లు దక్కేలా చూస్తామని.. ఇండస్ట్రీ మంచి కోసం వాయిదాకు ఒప్పుకోవాలని రాజు బృందం సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on November 17, 2021 1:36 pm
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…