2022 సంక్రాంతి సినిమాల విషయంలో విపరీతమైన చర్చ నడుస్తోంది కొన్ని రోజులుగా. అనుకోకుండా పండుగ రేసులోకి వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’కు ఎదురెళ్లడం ఎందుకని మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ను వేసవికి వాయిదా వేసేశారు. ఇదే బాటలో పవన్ కళ్యాణ్ చిత్రం ‘భీమ్లా నాయక్’ కూడా నడుస్తుందని అనుకున్నారు కానీ అలాంటిదేమీ జరగలేదు. రాజమౌళి టీం నుంచి విన్నపం వెళ్లినా ‘భీమ్లా నాయక్’ నిర్మాతలు తగ్గలేదని తెలుస్తోంది.
సంక్రాంతి కాదంటే మళ్లీ వేసవి వరకు ఎదురు చూడాలని.. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాను అంత కాలం ఆపలేమని.. వేరే రోజుల్లో రిలీజ్ చేస్తే ఆశించిన వసూళ్లు రావని.. అందుకే సంక్రాంతికే తమ చిత్రాన్ని విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాబట్టే తాము తగ్గేది లేదంటూ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
ఐతే ‘ఆర్ఆర్ఆర్’లో చాలామంది స్టేక్స్ ఉన్నాయి. దిల్ రాజు సహా టాలీవుడ్లో టాప్ డిస్ట్రిబ్యూటర్లు వివిధ ఏరియాలకు ఈ సినిమా హక్కులు తీసుకున్నారు. ‘భీమ్లా నాయక్’ రేసులో ఉంటే కచ్చితంగా థియేటర్ల సమస్య ఎదురవుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజైన ఐదు రోజులకే థియేటర్లలో బాగా కోత తప్పదు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’పై భారీ పెట్టుబడులు పెట్టిన బయ్యర్లకు రికవరీ కష్టమవుతుంది. ‘రాధేశ్యామ్’ వచ్చాక ఎలాగూ థియేటర్లు తగ్గించాల్సిందే కానీ.. అంతకు రెండు రోజుల ముందే మరిన్ని థియేటర్లు పవన్ సినిమాకు కూడా ఇవ్వాలంటే కష్టమే.
అన్నింటికీ మించి ‘బాహుబలి’ లాగే ‘ఆర్ఆర్ఆర్’ కూడా తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలుస్తుందన్న అంచనాల నేపథ్యంలో అలాంటి చిత్రానికి అడ్డంకులు రాకుండా చూసుకోవాలన్న అభిప్రాయం ఇండస్ట్రీ నుంచి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు నేతృత్వంలోని ప్రొడ్యూసర్ గిల్డ్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ‘భీమ్లా నాయక్’ చిత్ర బృందంతో రాజు అండ్ కో చర్చలు జరుపుతున్నారట. ఎలాగైనా సినిమాను వాయిదా వేయించాలని.. తర్వాత ఎప్పుడు వచ్చినా సినిమాకు పూర్తి సహకారం ఉంటుందని, కావాల్సినన్ని థియేటర్లు దక్కేలా చూస్తామని.. ఇండస్ట్రీ మంచి కోసం వాయిదాకు ఒప్పుకోవాలని రాజు బృందం సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on November 17, 2021 1:36 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…