మూడు నెలలుగా సినీ కార్యకలాపాలు ఆగిపోవడంతో ఆ పరిశ్రమ సంక్షోభం దిశగా పయనిస్తోంది. సాధ్యమైనంత త్వరగా పనులు మొదలుపెట్టకపోతే అంతే సంగతులు. థియేటర్లలో సినిమాలు ఇప్పుడిప్పుడే ఆడించే పరిస్థితి లేకపోయినా.. కనీసం షూటింగ్స్ విషయంలో అయినా సడలింపులు వస్తే అదే చాలనుకుంటోంది పరిశ్రమ.
ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలతో సినీ ప్రముఖులు చర్చలు కూడా జరిపారు. ఇక షూటింగ్స్ పున:ప్రారంభించడం లాంఛనమే అని అంతా భావిస్తున్నారు. ఐతే షూటింగ్ స్పాట్లలో పాటించాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనలపై ఒక నోట్ తయారు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు తయారు చేస్తుండగా.. ఇండస్ట్రీ నుంచి కూడా గైడ్ లైన్స్ కోరింది. ఈ బాధ్యతను సినీ పెద్దలు సీనియర్ దర్శకుడు తేజకు అప్పగించారు.
కరోనా ముప్పు లేకుండా షూటింగ్స్ ఎలా నిర్వహించాలో ఇండస్ట్రీ తరఫున తేజనే కొన్ని గైడ్ లైన్స్ తయారు చేశాడు. వాటిని ప్రభుత్వానికి పంపడం కూడా జరిగింది. ఐతే సినిమాలు తీసేటపుడు షూటింగ్ టైంలో స్ట్రిక్టుగా ఉంటాడని పేరున్న తేజ.. ఈ మార్గదర్శకాల విషయంలోనూ మరీ స్ట్రిక్టుగా వ్యవహరించాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షూటింగ్ స్పాట్లో నటీనటులు తప్ప అందరూ పీపీఈ కిట్లు ధరించాలని తేజ సూచించాడట. ఇది అంత సులువైన విషయం కాదు.
ఇక షూటింగ్స్లో బఫే భోజనం లాంటివి వద్దని.. ఎవరి భోజనాలు వాళ్లే తెచ్చుకోవాలన్న సూచన కూడా చేశారు. జూనియర్ ఆర్టిస్టులు, అసిస్టెంట్లు చాలామంది సెట్లో భోజనం పెడితే కడుపు నిండుతుందని వస్తారు. వాళ్లంతా భోజనాలు తెచ్చుకోవాలంటే ఇబ్బందే. షూటింగ్ సందర్భంగా ఎవరికైనా కరోనా సోకితే చికిత్స ఖర్చులు నిర్మాతే భరించాలన్న సూచన అనివార్యమైందే. 60 ఏళ్లకు పైబడ్డ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు షూటింగ్ స్పాట్లో ఉండకూడదన్న నిబంధన అమలు అంత సులువు కాదు.
మొత్తంగా చూస్తే తేజ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాడని.. ప్రభుత్వం ఇవే షరతులు పెడితే వాటిని అనుసరించి షూటింగ్స్ చేయడం చాలా కష్టమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
This post was last modified on June 6, 2020 2:36 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…