మూడు నెలలుగా సినీ కార్యకలాపాలు ఆగిపోవడంతో ఆ పరిశ్రమ సంక్షోభం దిశగా పయనిస్తోంది. సాధ్యమైనంత త్వరగా పనులు మొదలుపెట్టకపోతే అంతే సంగతులు. థియేటర్లలో సినిమాలు ఇప్పుడిప్పుడే ఆడించే పరిస్థితి లేకపోయినా.. కనీసం షూటింగ్స్ విషయంలో అయినా సడలింపులు వస్తే అదే చాలనుకుంటోంది పరిశ్రమ.
ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలతో సినీ ప్రముఖులు చర్చలు కూడా జరిపారు. ఇక షూటింగ్స్ పున:ప్రారంభించడం లాంఛనమే అని అంతా భావిస్తున్నారు. ఐతే షూటింగ్ స్పాట్లలో పాటించాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనలపై ఒక నోట్ తయారు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు తయారు చేస్తుండగా.. ఇండస్ట్రీ నుంచి కూడా గైడ్ లైన్స్ కోరింది. ఈ బాధ్యతను సినీ పెద్దలు సీనియర్ దర్శకుడు తేజకు అప్పగించారు.
కరోనా ముప్పు లేకుండా షూటింగ్స్ ఎలా నిర్వహించాలో ఇండస్ట్రీ తరఫున తేజనే కొన్ని గైడ్ లైన్స్ తయారు చేశాడు. వాటిని ప్రభుత్వానికి పంపడం కూడా జరిగింది. ఐతే సినిమాలు తీసేటపుడు షూటింగ్ టైంలో స్ట్రిక్టుగా ఉంటాడని పేరున్న తేజ.. ఈ మార్గదర్శకాల విషయంలోనూ మరీ స్ట్రిక్టుగా వ్యవహరించాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షూటింగ్ స్పాట్లో నటీనటులు తప్ప అందరూ పీపీఈ కిట్లు ధరించాలని తేజ సూచించాడట. ఇది అంత సులువైన విషయం కాదు.
ఇక షూటింగ్స్లో బఫే భోజనం లాంటివి వద్దని.. ఎవరి భోజనాలు వాళ్లే తెచ్చుకోవాలన్న సూచన కూడా చేశారు. జూనియర్ ఆర్టిస్టులు, అసిస్టెంట్లు చాలామంది సెట్లో భోజనం పెడితే కడుపు నిండుతుందని వస్తారు. వాళ్లంతా భోజనాలు తెచ్చుకోవాలంటే ఇబ్బందే. షూటింగ్ సందర్భంగా ఎవరికైనా కరోనా సోకితే చికిత్స ఖర్చులు నిర్మాతే భరించాలన్న సూచన అనివార్యమైందే. 60 ఏళ్లకు పైబడ్డ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు షూటింగ్ స్పాట్లో ఉండకూడదన్న నిబంధన అమలు అంత సులువు కాదు.
మొత్తంగా చూస్తే తేజ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాడని.. ప్రభుత్వం ఇవే షరతులు పెడితే వాటిని అనుసరించి షూటింగ్స్ చేయడం చాలా కష్టమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
This post was last modified on June 6, 2020 2:36 pm
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి క్రీడా రంగంలో ఓ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోనుంది. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా వెలుగొందబోతున్న ఈ…
దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయా? జరగవా? ఈ విషయంలో బీజేపీ అడుగులు ముందుకు పడతాయా? పడవా? అనే సందేహాలు తరచుగా…
ప్రభాస్ కు అత్యంత సన్నిహితమైన బ్యానర్ గా ఇంకా చెప్పాలంటే అతని స్వంత సంస్థలా ఇండస్ట్రీ భావించే యువి క్రియేషన్స్…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో మంగళవారం ఓ కీలక…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఒళ్లంతా కళ్లు చేసుకుని సాగతున్నారు.…
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చిన ఆయన..…