Movie News

ఇండస్ట్రీని ఇరుకున పెట్టేసిన తేజ

మూడు నెలలుగా సినీ కార్యకలాపాలు ఆగిపోవడంతో ఆ పరిశ్రమ సంక్షోభం దిశగా పయనిస్తోంది. సాధ్యమైనంత త్వరగా పనులు మొదలుపెట్టకపోతే అంతే సంగతులు. థియేటర్లలో సినిమాలు ఇప్పుడిప్పుడే ఆడించే పరిస్థితి లేకపోయినా.. కనీసం షూటింగ్స్ విషయంలో అయినా సడలింపులు వస్తే అదే చాలనుకుంటోంది పరిశ్రమ.

ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలతో సినీ ప్రముఖులు చర్చలు కూడా జరిపారు. ఇక షూటింగ్స్ పున:ప్రారంభించడం లాంఛనమే అని అంతా భావిస్తున్నారు. ఐతే షూటింగ్ స్పాట్లలో పాటించాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనలపై ఒక నోట్ తయారు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు తయారు చేస్తుండగా.. ఇండస్ట్రీ నుంచి కూడా గైడ్ లైన్స్ కోరింది. ఈ బాధ్యతను సినీ పెద్దలు సీనియర్ దర్శకుడు తేజకు అప్పగించారు.

కరోనా ముప్పు లేకుండా షూటింగ్స్ ఎలా నిర్వహించాలో ఇండస్ట్రీ తరఫున తేజనే కొన్ని గైడ్ లైన్స్ తయారు చేశాడు. వాటిని ప్రభుత్వానికి పంపడం కూడా జరిగింది. ఐతే సినిమాలు తీసేటపుడు షూటింగ్ టైంలో స్ట్రిక్టుగా ఉంటాడని పేరున్న తేజ.. ఈ మార్గదర్శకాల విషయంలోనూ మరీ స్ట్రిక్టుగా వ్యవహరించాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షూటింగ్ స్పాట్లో నటీనటులు తప్ప అందరూ పీపీఈ కిట్లు ధరించాలని తేజ సూచించాడట. ఇది అంత సులువైన విషయం కాదు.

ఇక షూటింగ్స్‌లో బఫే భోజనం లాంటివి వద్దని.. ఎవరి భోజనాలు వాళ్లే తెచ్చుకోవాలన్న సూచన కూడా చేశారు. జూనియర్ ఆర్టిస్టులు, అసిస్టెంట్లు చాలామంది సెట్లో భోజనం పెడితే కడుపు నిండుతుందని వస్తారు. వాళ్లంతా భోజనాలు తెచ్చుకోవాలంటే ఇబ్బందే. షూటింగ్ సందర్భంగా ఎవరికైనా కరోనా సోకితే చికిత్స ఖర్చులు నిర్మాతే భరించాలన్న సూచన అనివార్యమైందే. 60 ఏళ్లకు పైబడ్డ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు షూటింగ్ స్పాట్లో ఉండకూడదన్న నిబంధన అమలు అంత సులువు కాదు.

మొత్తంగా చూస్తే తేజ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాడని.. ప్రభుత్వం ఇవే షరతులు పెడితే వాటిని అనుసరించి షూటింగ్స్ చేయడం చాలా కష్టమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

This post was last modified on June 6, 2020 2:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

1 hour ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

3 hours ago